logo

జగన్‌ను ఇంటికి సాగనంపుదాం

ఐదేళ్ల పాలనలో జగన్‌ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అభివృద్ధి శూన్యమని, పరిశ్రమలు వెళ్లగొట్టి యువతకు ఉపాధి లేకుండా చేశారని ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

Published : 01 May 2024 06:37 IST

ప్రజలకు అభివాదం చేస్తున్న రామ్మోహన్‌నాయుడు, అశోక్‌, దాసరి రాజు తదితరులు

కంచిలి, న్యూస్‌టుడే: ఐదేళ్ల పాలనలో జగన్‌ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అభివృద్ధి శూన్యమని, పరిశ్రమలు వెళ్లగొట్టి యువతకు ఉపాధి లేకుండా చేశారని ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా, ముందు చూపు ఉన్న నాయకుడు చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బెందాళం అశోక్‌, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు, మండల తెదేపా, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి శాసనాం, గోకర్ణపురం,  జలంత్రకోట పంచాయతీ పరిధి గ్రామాల్లో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా సీనియర్‌ నాయకుడు, నారాయణపురానికి చెందిన కర్రి కోదండరావు, ఉప సర్పంచి కాళ్ల నాగేశ్వరరావు, 20కి పైగా కుటుంబాలు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు సమక్షంలో తెదేపాలో చేరాయి. యువతకు ఉపాధి అవకాశాలు, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమని కూటమి నాయకులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని