సైకిలెక్కుతున్న జగనన్న సైన్యం..!
తెదేపా గూటికి గ్రామ వాలంటీర్లు
వైకాపా నేతల వైఖరిపై అసంతృప్తితోనే చేరికలు
న్యూస్టుడే, టెక్కలి
టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు చెందిన 19 మంది గ్రామ వాలంటీర్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో మంగళవారం తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల వారంతా రాజీనామా చేసి విధుల నుంచి తప్పుకొన్నారు. వైకాపా నేతల తీరును వీరు తప్పుబట్టారు. తాము ప్రభుత్వ సేవల కోసం విధులు నిర్వహిస్తుంటే వైకాపా నేతల బలవంతపు రాజీనామాతో విభేదించామని, అందుకే తెదేపాలో చేరామని వెల్లడించారు.
న్యూస్టుడే, కోటబొమ్మాళి
- నరసన్నపేట: జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామానికి చెందిన ఆరుగురు వాలంటీర్లు ఏప్రిల్ 28న ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి సమక్షంలో పసుపు కండువా కప్పుకొన్నారు. జగన్ పాలనతో రాష్ట్రానికి, తమకు భవిష్యత్తులేదని, అందుకే చేరుతున్నట్లు చెప్పారు.
- ఆమదాలవలస: సరుబుజ్జిలి మండలం పాలవలస నుంచి ఓ వాలంటీరు ఏప్రిల్ 21న చేరారు.
- కోటబొమ్మాళి మండలం తులసిపేట నుంచి ఇద్దరు, సంతబొమ్మాళి మండలం ఉమిలాడ, గద్దలపాడు, గోవిందపురం, శ్రీకృష్ణపురం గ్రామాల నుంచి వాలంటీర్లు తెదేపాలో చేరారు. నందిగాం మండలం రాంపురం నుంచి, టెక్కలి మండలం అయోధ్యపురం నుంచి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.
జగనన్న సైన్యం.. జగన్ కోసం, వైకాపా కోసం తమ విధులకు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ఎన్నికల్లో పాల్గొంటున్నారంటూ వైకాపా నేతలు ఊదరగొడుతూ వచ్చారు.. అయితే తాము ఎవరికీ కట్టుబానిసలం కాదని పేర్కొంటూ తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు వాలంటీర్లు.. రాజీనామా చేయాల్సిందేనని గ్రామాల్లో నాయకులు బలవంతం చేయడంపై పలువురు అంతర్మథనం చెందారు.. అధికార పార్టీ నేతలు చూపించిన దౌర్జన్యాన్ని ఆమోదించేందుకు సిద్ధపడటం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వాలంటీర్లు గ్రూపులుగా ఏర్పడి కూటమి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు..
కూటమి భరోసాతో మార్పు..
కూటమి మ్యానిఫెస్టోలో వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెదేపాలో చేరేందుకు సిద్ధమవుతామని మండల స్థాయిలో వాలంటీర్ల ప్రతినిధులు కూటమి నేతలకు సందేశాలు పంపుతున్నారు. గ్రామాల్లో వారి ప్రవర్తన, వారికున్న స్థానిక పరిస్థితులను తెదేపా నేతలు వాకబు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రాజీనామాలు చేయనివారు నేరుగా తెదేపా అభ్యర్థులను కలసి సహకారం అందిస్తామని చెప్పి తమ మద్దతు ప్రకటిస్తున్నారు.
అధికార పార్టీ వెన్నులో వణుకు..
ఇన్నాళ్లూ తమ సైన్యంగా, తమ బలంగా చెప్పుకొనే వాలంటీర్లపై అజమాయిషీ చేసిన వైకాపా నేతల తీరుపై వాలంటీర్లు గుర్రుగా ఉన్నారు. దీంతో వారితో ఉంటూనే వారి అంతర్గత సమాచారాలు బయటకు ఇస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన మద్యం నిల్వల సమాచారాన్ని వాలంటీరు ద్వారానే బయటకు పొక్కినట్లు అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఇన్నాళ్లూ ఎంత నమ్మకంగా సేవలందించినా తమను మనుషులుగా కాక వస్తువులుగానే చూశారని, వారికి తామేంటో చూపిస్తామని మరికొందరు బయట పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకొస్తున్నాయ్.. మృత్యు వాహనాలు..!
[ 21-05-2024]
మూలపేట పోర్టుతో అందరి బతుకుల్లో మార్పు వస్తుందని భావించిన అక్కడి ప్రజలకు తీరని శోకం మిగులుతోంది.. పోర్టు నిర్మాణానికి చేపడుతున్న కార్యకలాపాలు పరిసర గ్రామాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
వేట లేదు.. భృతి అందలేదు
[ 21-05-2024]
సముద్రంలో మర బోట్లతో చేపల వేట నిషేధం విధించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి సాయం అందక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి లేక జీవనం భారమై నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు. -
రేవుల్లోకి అధికారుల బృందం
[ 21-05-2024]
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించడంతో జిల్లా అధికారులు ఎట్టకేలకు కదిలారు. కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, కమిటీ సభ్యులు సోమవారం రెండు రీచ్లను పరిశీలించారు. -
వెంకన్న దర్శనం.. భక్తజన పారవశ్యం..
[ 21-05-2024]
నరసన్నపేట వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 21-05-2024]
జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అధికారులను ఆదేశించారు. -
ఆశలు నీరుగార్చేశారు..!
[ 21-05-2024]
రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం తప్ప, అన్నదాతల మేలు కోసం ఒరగబెట్టిందేమీ లేదనేందుకు నారాయణపురం కుడి కాలువ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
పట్టణంలో దాహం కేకలు
[ 21-05-2024]
ఇచ్ఛాపురం పురపాలకసంఘ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నాలుగు ట్యాంకర్లతో నీరు అవసరమైన చోటుకు తరలించాల్సిన అధికారులు రెండింటితోనే సరిపెడుతున్నారు. -
29 కేంద్రాల్లో 50 శాతం లోపే..!
[ 21-05-2024]
శ్రీకాకుళం నియోజకవర్గంలో కీలకమైన నగరంలో పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేదు. మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొన్ని చోట్ల 50 శాతం కంటే తక్కువ నమోదైంది. -
పార్టీ మారారని నీటి సరఫరా నిలిపివేత
[ 21-05-2024]
వైకాపా నుంచి తెదేపాలోకి మారామని కక్ష గట్టి పైపులైన్ మరమ్మతుల పేరిట నీటి సరఫరాను నిలిపేశారంటూ గ్రామానికి చెందిన వజ్జ లోకేశ్వరరావు ఎంపీడీవో జి.భాస్కరరావుకు ఫిర్యాదు చేశారు. -
వైకాపా ఎంపీ అభ్యర్థి గృహ నిర్బంధం
[ 21-05-2024]
వైకాపా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను నందిగాం పోలీసులు సోమవారం ఆయన స్వగ్రామం కణితివూరులో గృహ నిర్బంధం చేశారు. -
మహేంద్రతనయ నదిలో దిగి కొసమాల వాసి జలసమాధి
[ 21-05-2024]
గజపతి జిల్లా గోసాని బ్లాక్లోని బాగుసాల పంచాయతీ సదర్ మహకుమా గ్రామం గుండా ప్రవహించే మహేంద్రతనయ నదిలో పడి ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
[ 21-05-2024]
పాతపట్నం మండలం కోదూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
ఏపీ ఎన్నికల్లో హింస.. 85 మంది నిందితులపై హిస్టరీ షీట్: డీజీపీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్