logo

ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన పాలకులను ఓడించండి

ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన పాలకులను ఓడించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు.

Published : 01 May 2024 06:33 IST

మాట్లాడుతున్న చలసాని శ్రీనివాస్‌

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన పాలకులను ఓడించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కుల ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు అసెంబ్లీలో బూతులు తిట్టడం, పక్క వారి భార్యల గురించి మాట్లాడుతున్నారే తప్ప.. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధిపై చర్చించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర నాయకులు కొవ్వాడ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు