ఖాదీ బతుకులంటే చిన్న చూపా..?
‘అత్యున్నత ప్రమాణాలున్న సన్నఖాదీ పొందూరు సొంతం. ఏడు దశాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుతోంది. మహాత్మాగాంధీ నుంచి అమెరికా పూర్వ అధ్యక్షుడు బిల్క్లింటన్ వరకు దీన్ని మెచ్చినవారే.. ఇంతటి ఖ్యాతి ఉన్న ఈ ఖాదీకి ఆ స్థాయిలో చేయూత అందలేదు.
పొందూరు ఖాదీపై వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం
పట్టించుకోని స్పీకర్ తమ్మినేని సీతారాం
న్యూస్టుడే, పొందూరు
‘అత్యున్నత ప్రమాణాలున్న సన్నఖాదీ పొందూరు సొంతం. ఏడు దశాబ్దాలుగా తన ప్రత్యేకతను చాటుతోంది. మహాత్మాగాంధీ నుంచి అమెరికా పూర్వ అధ్యక్షుడు బిల్క్లింటన్ వరకు దీన్ని మెచ్చినవారే.. ఇంతటి ఖ్యాతి ఉన్న ఈ ఖాదీకి ఆ స్థాయిలో చేయూత అందలేదు. పాలకుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ప్రోత్సాహం లేక భవిష్యత్తు మనుగడే లేకుండాపోయే పరిస్థితి నెలకొంది.. ఈ రంగంపై నమ్మకం లేక కొత్తతరం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం మరో ప్రధాన సమస్య.’
పొందూరు ఖాదీకి ప్రాణం పోస్తున్న శ్రామికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు.. అయిదేళ్ల వైకాపా పాలనలో చేయూత లేక కష్టానికి తగ్గ ఫలితం లేక కష్టాల సుడిలో చిక్కుకుపోయారు.. అనారోగ్యం ఓపక్క.. అర్ధాకలి మరోపక్క వారి జీవితాలను చిదిమేస్తున్నాయి.. అయినా వృత్తిపై మమకారం చంపుకోలేక ఈ రంగంలోనే నెట్టుకొస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకంగా శాసన సభాపతి అయ్యారని చేనేతకు వెలుగులు తెస్తారని ఆశించిన కార్మికులకు చీకట్లే మిగిల్చారు. పొందూరు ఖాదీ రూపురేఖలు మార్చుతామని చెప్పడం తప్ప చేసిందేమీ లేకుండా పోయింది.
పొందూరు ఎఫ్కేకే సంఘం
వృత్తికి దూరం..
గతంలో నాలుగువేల మందిపైన స్పిన్నర్లు ఉండేవారు. ప్రస్తుతం వెయ్యి మందికే పరిమితమయ్యారు. వీవర్స్ వంద మందికి పరిమితమయ్యారు. గతంలో ఉన్న వృద్ధులు ఏ పనిచేయలేక ఈ వృత్తినే నమ్ముకొని కాలం వెళ్లదీసేవారు. ప్రస్తుతం యువత ఈ వృత్తిని వదిలి వేరొక పనులకు వెళ్లిపోతున్నారు. తమ తల్లిదండ్రులకు గిట్టుబాటు ధర లేక పడుతున్న ఇబ్బందులను చూసి ప్రస్తుత యువత వేరొక పనులకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఖాదీ వృత్తిని నేటి యువత వదిలేస్తున్నారు.
రోజుకు రూ.100 కష్టమే
పొందూరు ఖాదీ వస్త్రాన్ని తీర్చిదిద్దటంలో రెండు రకాల నైపుణ్యమున్న కార్మికులు శ్రమిస్తున్నారు. ఒకరు పత్తి నుంచి దారం ఒడికి చిలపలను తయారు చేసేవారు (స్పిన్నర్లు) కాగా, రెండోది నేతన్నలు (వస్త్రాన్ని తయారు చేసేవారు). ఈ రెండు విభాగాల వారికీ రోజుకు గరిష్ఠంగా రూ.100 కూడా గిట్టుబాటు కాలేదు. కొందరికి రూ.50 మాత్రమే వస్తోంది. అదీ రోజంతా కళ్లు చేసుకుని పని చేస్తేనే. ఆర్థిక దన్ను కొరవడి ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథగా మారింది. ఎవరిని కదిపినా కష్టాలు కన్నీళ్లే.
సందర్శన తప్ప చేసిందేమీ లేదు..
ఖాదీకి ఊతమిచ్చేందుకు పాలకులు సందర్శించడం తప్ప ఇచ్చిందేమీ లేదు. శాసన స్పీకరు తమ్మినేని సీతారాం పొందూరు ఖాదీని అభివృద్ధి చేసి క్లస్టర్లు ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంపై యువతకు శిక్షణ అందిస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క పనిచేసిన దాఖలాలు లేవు. 2021లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వచ్చారు. పదివేల మంది ఖాదీ కార్మికులతో మెగా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఎలాంటి పనులు కూడా జరగలేదు.
జీవితాల్లో కానరాని వెలుగులు
ఖాదీ కార్మికులపై ప్రస్తున్న ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో వారి జీవితాల్లో వెలుగులు లేకుండా పోయాయి. కుటుంబాల పోషణకు అవస్థలు తప్పడం లేదు. కనీసం వీరు అనారోగ్యానికి గురైనా పట్టించుకునేనాథుడే కరవయ్యారు. ఈ వృత్తిలో ఉన్నవారంతా వృద్ధులే. వయసు మళ్లీనేవారే కావడంతో వివిధ రోగాలతో బాధపడుతున్నారు. సరైన వైద్యం కూడా చేయించుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారు.
ఎవరూ పట్టించుకోలేదు
50 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ప్రభుత్వపరంగా ఎలాంటి ఆదరణ లేదు. రోజంతా కష్టపడినా జీవనం కష్టంగా ఉంది. అనారోగ్యం పాలైతే పట్టించుకునేవారే లేరు. మా తరంతోనే ఈ వృత్తి అంతం అవుతుందని అనుకుంటున్నాను. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఖాదీ పరిశ్రమ మూలకు చేరుతుంది.
మలిపెద్ది సీతారాం, ఖాదీ కార్మికుడు, పొందూరు
పిల్లలు ముందుకు రాలేదు
ఈ వృత్తి మా తరంతోనే ఆగిపోతుంది. పిల్లలు ఈ పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. నా ఇద్దరు కుమారులు వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు. రోజంతా కష్టపడినా కూలి డబ్బులు రావడం లేదు. మందులకు పిల్లలపై ఆధార పడాల్సి వస్తోంది.
జల్లేపల్లి కాంతమ్మ, ఖాదీ కార్మికురాలు, పొందూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వర్తకులే దిక్కు..?
[ 22-05-2024]
ఖరీఫ్ కాలంలో అన్నదాతలకు ఏటా విత్తన పాట్లు తప్పడం లేదు. అవసరమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో వేరే దారిలేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.. గతేడాది సాంబ రకం కావాలని వేడుకున్నా ప్రభుత్వం వాటిని అరకొరగానే రాయితీపై అందించింది. -
కొండ కరిగిపోతోంది..!
[ 22-05-2024]
కోటబొమ్మాళి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు కూతవేటు దూరంలో, జనావాసాలకు ఆనుకుని ఉన్న కొండలను కొల్లగొడుతున్నా అధికార యంత్రాంగం మాత్రం నిద్రపోతోంది.. -
ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీడియో తీయాలి
[ 22-05-2024]
వచ్చే నెల నాలుగో తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మొత్తం చిత్రీకరించాలని సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. -
నెరవేరని లక్ష్యం..!
[ 22-05-2024]
రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నిధులతో నిర్మించిన గోదాంలు అన్నదాతలకు అక్కరకు రావడం లేదు. కొన్ని పూర్తికాగా మరొకొన్ని పునాదుల స్థాయిలో ఆగిపోయాయి. -
పాముకాటుకు బాలుడి మృతి
[ 22-05-2024]
టెక్కలి మండలం రావివలస పంచాయతీ చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన దాసరి సాయివినీత్ (13) పాముకాటుకు గురై మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. -
వైభవంగా బ్రహ్మాండ నాయకుని అశ్వవాహన సేవ
[ 22-05-2024]
అసంఖ్యాక భక్తుల నడుమ శ్రీనివాసుని అశ్వవాహన సేవ కనుల పండువగా సాగింది. నరసన్నపేటలోని వెంకటేశ్వరాలయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో మంగళవారం -
ఉక్కు ఉద్యోగి ఆత్మహత్య
[ 22-05-2024]
ఆర్థిక ఇబ్బందులతో ఉక్కు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్టు స్టీల్ప్లాంట్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఉక్కునగరం సెక్టారు-11లోని ‘327-ఈ’ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఉక్కు ఎస్ఎంఎస్ ఉద్యోగి తీగల చిరంజీవులు -
అలంకారప్రాయం
[ 22-05-2024]
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం అలంకారప్రాయంగా మారింది. సంబంధిత అధికారులు నిర్వహణను విస్మరించడంతో శిథిలావస్థకు చేరుతోంది. -
మూడు లారీలు, పొక్లెయిన్ సీజ్
[ 22-05-2024]
ఆమదాలవలస మండలం చెవ్వాకులపేట వద్ద వంశధార నదీగర్భంలో మంగళవారం మూడు లారీలు, పొక్లెయిన్ ఉన్నందున వాటిని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. -
రౌడీషీటర్ల బైండోవర్
[ 22-05-2024]
ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుండటంతో జిల్లాలో శాంతిభద్రతలపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించింది.
తాజా వార్తలు (Latest News)
-
అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయం.. రూ.300 కోట్లు ?
-
ఔటర్ చుట్టూ.. ఔరా అనిపించేలా
-
ఓటుకు ఊపిరిలూదిన ఊళ్లు.. 748 కేంద్రాల్లో 91 శాతానికి పైగా నమోదు
-
అతని తీరుతో అంతటా శోకం.. పోలీసు అధికారి వ్యవహార శైలిపై విమర్శలు
-
తల్లికి కుమార్తె నుంచి భరణం.. ఇందౌర్ కోర్టు తీర్పు
-
ఎమ్మెల్యేనా.. వీధి రౌడీనా!