పాదచారుల సబ్వే త్వరగా తెరవండి
పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు.
తాంబరం వాసుల డిమాండు
మూసి ఉన్న సబ్వే తలుపులు
వడపళని, న్యూస్టుడే: పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత గతేడాది సెప్టెంబరు నుంచి తాళాలు వేశారు. స్థానికులు సబ్వేను మూసి ఉంచడంపై పలుమార్లు తాంబరం కార్పొరేషన్, ప్రధాని కార్యాలయానికి వినతులు సమర్పించినా ఎలాంటి పరిష్కారమూ కనిపించలేదు.
పాఠశాలలకు వెళ్లే వారికి..
పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, వయసు పైబడిన వారు ఇక్కడి సబ్వే మూసి ఉండటంతో గణపతిపురం సబ్వే గుండా కి.మీ.కుపైగా నడిచి తూర్పు, పడమర తాంబరానికి చేరుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైల్వే లైను దాటి వెళ్తున్నారు. రూ.3.8 కోట్లతో నిర్మించిన రైల్వే సబ్వే తూర్పు, పడమర తాంబరానికి అనుసంధానంగా ఉంది. ప్రస్తుతం అక్కడి గేటుకు తాళం వేసి కనిపిస్తోంది. బయట ఉన్న గోడపై సబ్వే పబ్లిక్కు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు అనుమతి కల్పిస్తామని, దక్షిణ రైల్వే/తాంబరం కార్పొరేషన్ అని పెయింట్తో రాసిన అక్షరాలు దర్శనమిస్తున్నాయి.
గతంలో ఇక్కడ రైల్వే గేటు..
గతంలో ఇక్కడ లెవల్ క్రాసింగ్ గేటు ఉండేది. పట్టాలు దాటేటప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులందాయి. 2018లో సబ్వే నిర్మాణం జరిగింది. నిత్యం తిరిగే వేలాది మంది విద్యార్థులు, స్థానికులకు సబ్వే చాలా ఉపయోగకరంగా ఉందని, తూర్పు నుంచి పడమర తాంబరానికి వెళ్లే వారందరూ వినియోగించుకుంటున్నారని ఎప్పుడూ తెరిచి ఉంటే బాగుంటుందని ‘ఎంఈఎస్ రోడ్ గణపతిపురం వెల్ఫేర్ అసోసియేషన్’ అధ్యక్షుడు కె.రమేష్ అన్నారు. కొందరు సంఘ విద్రోహశక్తులు విద్యుద్దీపాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.
గతేడాది మార్చిలో సమావేశం..
కిందటి సంవత్సరం మార్చి నెలలో రైల్వే అధికారులు, పోలీసు విభాగం, కార్పొరేషన్ అధికారులు, మేయర్, రైల్వే సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. సబ్వే మరమ్మతులతో పాటు విద్యుద్దీపాలు కూడా అమర్చి తాంబరం కార్పొరేషన్కు అందించారు. అనంతరం రెండు వారాలు సబ్వే తెరిచి ఉంచారు. ఆ తర్వాత నిర్వహణ లోపంతో సెప్టెంబరు 1 నుంచి మూసివేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం కనిపించలేదని మరో సంఘ సభ్యుడు అరుణ్ కుమార్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
[ 02-05-2024]
కన్నియాకుమరి జిల్లా పూదప్పాండికి చెందిన సురేష్కుమార్ (46). ఇతనికి వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేష్కుమార్కి మద్యం అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. -
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
[ 02-05-2024]
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలి’ చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసు పంపారు. -
కునుకు పాట్లు..
[ 02-05-2024]
చేసెందుకు పనెక్కువ ఉంటుంది. శరీరం సహకరించదు, కళ్లు మూసుకుపోతుంటాయి, ఎప్పుడు కునుకేద్దామా అని మనసు లాగేస్తుంటుంది. అటు పని.. ఇటు కాస్తయినా నిద్రపోతే బాగుండనే ఆలోచనలు. -
వృద్ధాప్యం విజయానికి అడ్డుకాలేదు
[ 02-05-2024]
ఆటలాడేందుకు వృద్ధాప్యం అడ్డుకాదని, ముసలితనం శరీరానికేగాని ఆత్మవిశ్వాసానికి కాదని చాటిచెప్పుతున్నారు 76 ఏళ్ల సెల్వరాజ్. ఈ వయసులోనూ ఆయన ఆత్మవిశ్వాసంతో యువకుడిలా క్రీడల్లో సత్తాచాటుతున్నారు. -
పరమత్తిలో 42.5 డిగ్రీలు
[ 02-05-2024]
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. తమిళనాట ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం
[ 02-05-2024]
కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
మెట్రో రెండోదశలో 300 మలుపులు
[ 02-05-2024]
నగరంలోని మెట్రో రెండోదశలో మూడు వేర్వేరు మార్గాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూనమల్లి నుంచి పోరూరు కూడలి వరకు ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయి. -
వీక్లీ ప్రత్యేక రైళ్లు
[ 02-05-2024]
తాంబరం - సంత్రాగచ్చికి వేసవి రద్దీ కారణంగా వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే మంగళవారం ఓప్రకటనలో తెలిపింది. -
వాహన చోదకులకు మజ్జిగ సరఫరా
[ 02-05-2024]
వేసవి ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పలువురు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాంచీపురం ట్రాఫిక్ పోలీసు విభాగం తరఫున వాహన చోదకుల కోసం బుధవారం పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. -
బన్రుట్టి బస్టాండులో దాహం కేకలు
[ 02-05-2024]
కడలూర్ జిల్లా బన్రుట్టి నుంచి చెన్నై, కుంబÅకోణం, తంజావూర్, విళుపురం, నాగపట్టిణం, పేరావూరణి, చిదంబరం, సీర్గాళి, వేలూర్, చిత్తూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి తదితర ప్రాంతాలకు సుమారు 200కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు నడుస్తున్నాయి. -
రాతి క్వారీలో పేలుడు
[ 02-05-2024]
విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీప ఆవియూర్ కడంబన్కుళంలో అదే ప్రాంతానికి చెందిన సేతు, రాజపాళయం శ్రీరామ్లకు చెందిన రాళ్ల క్వారీ ఉంది. -
మళ్లీ విశాల్, ముత్తైయ కాంబో?
[ 02-05-2024]
‘మరుదు’లో కలసి పనిచేసిన నటుడు విశాల్, దర్శకుడు ముతైయ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్టు కోలీవుడ్ సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?