కాంగ్రెస్ నాయకుడి అనుమానాస్పద మృతి
కాంగ్రెస్ జిల్లా నాయకుడి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు కేపీకే జయకుమార్ ధనసింగ్(60) స్థానిక దిసయన్విలైలో నివాసం ఉంటున్నారు.
సగం కాలిన స్థితిలో మృతదేహం లభ్యం
జయకుమార్ (పాతచిత్రం)
తిరునెల్వేలి, న్యూస్టుడే: కాంగ్రెస్ జిల్లా నాయకుడి అనుమానాస్పద మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు కేపీకే జయకుమార్ ధనసింగ్(60) స్థానిక దిసయన్విలైలో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటికెళ్లిన ఆయన తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెదికినా ప్రయోజనం లేకపోవడంతో కుమారుడు కరుత్తయ్య జఫ్రిన్ శుక్రవారం పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు దర్యాప్తు చేపట్టగా శనివారం కరైసుత్తుపుదూర్ సమీపంలోని జయకుమార్కు సొంతమైన పొలంలో సగం కాలిన స్థితిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఏప్రిల్ 30న తనకు ప్రాణహాని ఉందని ఆయన తిరునెల్వేలి డీఎప్పీకి లేఖ రాసినట్లు తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. వారి వల్ల తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిపారు. అనుమానంతో కొందరి పేర్లను అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రూబి మనోహరన్, పార్టీ సీనియర్ నేత కేవీ తంగబాలు పేర్లు కూడా అందులో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తిరునెల్వేలి ఎస్పీ సిలంబరసన్ పేర్కొన్నారు.
నేతల సంతాపం...
జయకుమార్ కుటుంబీకులు చాలాకాలంగా కాంగ్రెస్లో కొనసాగుతున్నట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై ప్రకనటనలో తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. జయకుమార్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత తిరునావుక్కరసర్ పేర్కొన్నారు. త్వరితగతిన నిందితులను అరెస్టు చేయాలన్నారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదుకే దిక్కులేదు: అన్నామలై
సైదాపేట, న్యూస్టుడే: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ఫిర్యాదుకే డీఎంకే ప్రభుత్వంలో దిక్కులేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. కనిపించకుండా పోయిన జయకుమార్ మృతదేహంగా లభించటం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. అన్నామలై విడుదల చేసిన ప్రకటనలో.. ఏప్రిల్ 30న జిల్లా ఎస్పీ వద్ద ప్రాణానికి హాని ఉందని జయకుమార్ ఫిర్యాదు చేసినట్లు తెలిసిందన్నారు. అందులో నాంగునేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహరన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు తంగబాలు పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారని, పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలియటం లేదన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదుకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దర్యాప్తు చేసి మృతికి కారణాలు కనుగొనాలని అన్నామలై డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యర్థాలతో విద్యుత్తు వెలుగులు
[ 17-05-2024]
రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ తీసుకున్నా పెద్దఎత్తున చెత్తాచెదారాలు పోగవుతున్నాయి. చెన్నైలోనైతే ఇక హద్దేలేదు. ఈ వ్యర్థాలను నిల్వ చేస్తుండటంతో పెద్దఎత్తున విషవాయువులు వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. -
అబుదాబిలో రజనీ విశ్రాంతి
[ 17-05-2024]
‘జైలర్’ చిత్రం తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టైయన్’ చిత్రంలో రజనీకాంత్ నటించిన విషయం తెలిసిందే. ఆయన 170వ చిత్రమైన ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు నటించారు. -
19 జిల్లాల్లో నేడు భారీ వర్షం
[ 17-05-2024]
రాష్ట్రంలో శుక్రవారం 19 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. గురువారం విడుదల చేసిన ప్రకటనలో.. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక సముద్రతీరంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో 20 వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
ఇళయరాజాను కలిసిన మంత్రి
[ 17-05-2024]
ఇసైజ్ఞాని ఇళయరాజాను మర్యాదపూర్వకంగా కలిశానని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఎక్స్ పేజీలో తెలిపారు. -
20 నుంచి 26 వరకు ఐఐటీఎంలో అంతర్జాతీయ సదస్సు
[ 17-05-2024]
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో 20 నుంచి 26 వరకు ‘సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్స్ట్ యూత్స్’ (ఎస్పీఐసీ ఎంఏసీఏవై) 9వ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. -
శస్త్రచికిత్స లేకుండా హృదయ చికిత్స
[ 17-05-2024]
పుట్టుకతో హృదయ సమస్య ఉన్న రోగికి తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రిలో శస్త్రచికిత్స లేకుండా విజయవంతంగా చికిత్స అందించారు. -
నగదు మోసం కేసులో సినీ నిర్మాత అరెస్టు
[ 17-05-2024]
కేరళలోని కొచ్చిన్కు చెందిన జానీ థామస్ మలయాళ సినీ నిర్మాత. ఇతనిపై కోవై వడవళ్లికి చెందిన ఉదయశంకర్ అనే వ్యక్తి సిటీ క్రైం బ్రాంచ్కు ఫిర్యాదు చేశారు. -
కరెంటు తీగలపై దుస్తులు ఆరేయొద్దు
[ 17-05-2024]
వర్షాకాలంలో సంభవించే విద్యుత్తు ప్రమాదాల నియంత్రణకు విద్యుత్తుశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. వాటిని తప్పకుండా పాటించాలని ప్రజలను కోరింది. -
బడి ఈడులో బాల నేరస్థులుగా..
[ 17-05-2024]
చెన్నై జిల్లాలో ఏటా సరాసరి 500 మందికి పైగా బాలురు హత్య, హత్యాయత్నం, చోరీ, దోపిడీ తదితర కేసులలో అరెస్టయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి..
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
-
శిఖర్ పహారియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
-
వీసా లేకుండా పర్యటనల కోసం.. భారత్, రష్యా త్వరలో చర్చలు!
-
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు
-
కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్కు చేరుస్తుందా?