logo

రాష్ట్ర ప్రయోజనాలకు శ్రమిస్తా: స్టాలిన్‌

దేశానికి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా శ్రమిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు.

Published : 08 May 2024 00:15 IST

కరుణానిధి సమాధికి నివాళులర్పిస్తున్న స్టాలిన్‌, మంత్రులు

చెన్నై, న్యూస్‌టుడే: దేశానికి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా శ్రమిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. ఆయన నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వీడియో సందేశం విడుదల చేశారు. అందులో.. మూడేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, పథకాలు, మేళ్లకు లబ్ధిదారుల ముఖాల్లో కనిపించే సంతోషమే సాక్ష్యమన్నారు. ఈ సందర్భంగా వివిధ పథకాలు కింద లబ్ధిపొందిన ప్రజల భావోద్వేగాలను గుర్తు చేసుకున్నారు. ఇది తన ప్రభుత్వం కాదని, మన ప్రభుత్వమని, ఆ మేరకు నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టిందని పేర్కొన్నారు.

నేతల సమాధులకు నివాళి.. స్టాలిన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మంత్రివర్గ సహచరులైన దురైమురుగన్‌, ఏవీ వేలు, ఎమ్మార్కే పన్నీర్‌సెల్వం, పొన్ముడి, ఎంపీ టీఆర్‌ బాలు తదితరులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి మెరినా తీరంలోని దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధులను ముఖ్యమంత్రి సందర్శించారు. పుష్పాంజలితో నివాళులు అర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు