బీసీలను మరోసారి మోసగించే కుట్ర: భాజపా
బీసీలను మరోసారి మోసం చేసేందుకు జయహో బీసీ సభను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని భాజపా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ ఆరోపించారు
సమావేశంలో మాట్లాడుతూ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు గోపిశ్రీనివాస్
పెదవాల్తేరు, న్యూస్టుడే: బీసీలను మరోసారి మోసం చేసేందుకు జయహో బీసీ సభను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని భాజపా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ ఆరోపించారు. లాసన్స్బేకాలనీ భాజపా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అది జయహో బీసీ సభ కాదని, అదో రాజకీయ సభ మాత్రమేనని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చినా.. మూడున్నర సంవత్సరాల పాటు బీసీలను విస్మరించిందన్నారు. బీసీలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసనాయడు, కోశాధికారి కంటిభుక్త శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
Sports News
IND vs AUS: టీమ్ఇండియా ‘తగ్గేదేలే’.. నెట్బౌలర్లుగా నలుగురు టాప్ స్పిన్నర్లు!
-
Movies News
vani jayaram: ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత
-
Politics News
TS Assembly: దేశం చూపు కేసీఆర్ వైపు.. సంక్షేమంలో మాకు తిరుగులేదు: కేటీఆర్
-
India News
కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. భారత ఔషధ సంస్థలో అర్ధరాత్రి తనిఖీలు
-
Movies News
butta bomma review: రివ్యూ: బుట్టబొమ్మ