హస్త కళలకు జీవం.. వరించిన పద్మం
ఆయన చదువుకుంది పదో తరగతి. అయితేనేం హస్తకళలకు జీవం పోశారు. ఈ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపారు.
ఎలమంచిలి, న్యూస్టుడే
కుటుంబ సభ్యులతో పద్మశ్రీ అవార్డు గ్రహీత
ఆయన చదువుకుంది పదో తరగతి. అయితేనేం హస్తకళలకు జీవం పోశారు. ఈ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. తను పుట్టిన గ్రామం పేరును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. లక్కబొమ్మల తయారీలో ప్రకృతి సిద్ధమైన రంగులు పరిచయం చేశారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలన్న చందాన నిరాడంబరంగా కళాకారులకు సేవలందించారు. కుగ్రామమైన ఏటికొప్పాక నుంచి ప్రపంచ దేశాలకు లక్కబొమ్మలు ఎగమతులు అయ్యేలా చేశారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా చేయవచ్చని నిరూపించారు. ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేసింది. ఆయనే ఏటికొప్పాక గ్రామానికి చెందిన చింతలపాటి వెంకటపతి రాజు అలియాస్ ప్రసాద్బాబు.
ఏటికొప్పాక గ్రామానికి చెందిన వెంకటపతిరాజును అందరూ ప్రసాద్బాబు అని పిలుస్తారు. పదో తరగతి వరకు చదువుకున్నారు. ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. లక్కబొమ్మలకు ఆదరణలేదని అందుకే వలసలు పోతున్నామని కళాకారులు చెప్పిన మాటలు ఆలోచింపజేశాయి. చదువును పక్కన పెట్టి లక్కబొమ్మలకు పూర్వ వైభవం తీసుకు రావడంతో పాటు గ్రామంలోని కళాకారులు ఈ వృత్తిలో జీవించేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. తన పూర్తి సమయాన్ని ఈ కళను బతికించడానికి కేటాయించారు. ఆయన శ్రమ ఫలించింది.
కళాకారులకు శిక్షణ..: ఆధునిక బొమ్మల తయారీపై కళాకారులకు ఆయన ఇచ్చిన శిక్షణ, మెలకువలు ఫలించాయి. స్వగ్రామంలో హస్తకళా నిలయాన్ని ఏర్పాటుచేసి అందులోనే కళాకారులకు శిక్షణ ఇచ్చారు. ఏ బొమ్మ కావాలన్నా తయారు చేసేలా వారిని తీర్చిదిద్దారు.
విదేశాలకు ఎగుమతి..: ప్రసాద్బాబు ప్రకృతి సిద్ధమైన రంగులను లక్కపై వేసి వాటిని బొమ్మలకు వాడేవారు. అమెరికా, కెనడా, నెదర్లాండ్, జర్మనీ, లండన్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు పంపించి వీటిని ప్రపంచానికి పరిచయం చేశారు. విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు రావడంతో కళాకారుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ వాచీల తయారీ సంస్థ టైటాన్ వీరికి భారీగా ఆర్డర్లు ఇచ్చింది. ఈయన దగ్గర కళను నేర్చుకున్న శ్రీశైలపు చిన్నయాచారి జాతీయ స్థాయి అవార్డును పొందాడు.
పద్మశ్రీ పురస్కారంతో ఏటికొప్పాకకు గుర్తింపు
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారం 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్రగల ఏటికొప్పాక హస్తకళకు లభించిన అరుదైన గౌరవంగా తాను భావిస్తున్నట్లు చింతలపాటి వెంకటపతిరాజు (సి.వి.రాజు) అన్నారు. గురువారం అనకాపల్లి వచ్చిన ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. ‘బొమ్మల తయారీ, మార్కెటింగ్లో ప్రభుత్వ ప్రోత్సాహం బాగానే ఉంది. రైల్వేస్టేషన్, ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకోడానికి అనుమతులు ఇస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో అంకుడు చెట్లు వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నార’ని వివరించారు.
పవన్ కల్యాణ్ అభినందనలు
ఎలమంచిలి, న్యూస్టుడే: హస్తకళాకారుల సంక్షేమానికి వెంకటపతి రాజు కృషి స్ఫూర్తిదాయకమని జనసేన పార్టీ అధినేత పవణ్ కల్యాణ్ ఫోను ద్వారా అభినందించారు. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి సుందరపు విజయ్కుమార్ గురువారం ఏటికొప్పాకలో సీవీ రాజును సన్మానించారు. ఆయన ఫోనులో వెంకటపతిరాజుతో పవన్ మాట్లాడారు.
పద్మశ్రీకి ఎంపికైన కళాకారుడికి సన్మానం
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఏటికొప్పాకకు చెందిన చింతపాటి వెంకటపతిరాజుని కలెక్టర్ రవి, సంయుక్త కలెక్టర్ కల్పనాకుమారి సత్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ క్రీడామైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకపతిరాజును శాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
ఎన్నో అవార్డులు...
* హస్తకళలను బతికించడం, ప్రకృతి సిద్ధమైన రంగులను పరిచయం చేసినందుకు ఈయన సేవలు గుర్తించి ప్రభుత్వం 2002లో జాతీయస్థాయి అవార్డును అందించింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ఆ అవార్డును అందుకున్నారు. బీ 2003లో కమలాదేవి ఛటోపాధ్యాయ అవార్డును, 2011లో ఇంటేక్ సంస్థ నుంచి జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. బీ క్రాప్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పలు అవార్డులు ఈయనను వరించాయి.
* క్రాప్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నుంచి సైతం అవార్డు అందుకున్నారు.
* తపాలా శాఖ కొత్తగా బుక్ నౌ పే లేటర్ (బీఎన్పీఎల్) పార్సిల్ సర్వీసును ప్రారంభించేలా ప్రోత్సహించి ఎలమంచిలిలో ప్రారంభోత్సవం చేయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM