భారత్ ప్రపంచకప్ గెలుస్తుంది!
‘భారత ఉప ఖండంలో అక్టోబరు- నవంబరులో జరిగే ఐసీసీ 2023 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ తప్పనిసరిగా ఫేవరేట్ జట్టే. ఈ సారి ప్రపంచ కప్పు గెలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మన క్రికెటర్లకు ఫిట్నెస్సే ప్రధాన సవాలు
‘ఈనాడు’తో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ
ఈనాడు, విశాఖపట్నం
మాట్లాడుతున్న రోజర్బిన్నీ.. పక్కన మదన్లాల్
‘భారత ఉప ఖండంలో అక్టోబరు- నవంబరులో జరిగే ఐసీసీ 2023 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ తప్పనిసరిగా ఫేవరేట్ జట్టే. ఈ సారి ప్రపంచ కప్పు గెలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి భారతీయుడి ఆశ అదే’ అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. త్వరలో ప్రారంభమయ్యే పోటీలకు ఇప్పటికే భారత్ జట్టు సిద్ధంగా ఉందన్నారు. పీఎంపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) 70 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈనాడు-ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రత్యేక తోడ్పాటు: భారత క్రికెట్ జట్టు ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు ఫిట్నెస్. దాన్ని అధిగమించేలా క్రీడాకారులను సమాయత్తం చేస్తున్నాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీసీసీఐ కూడా క్రికెటర్లకు ప్రత్యేక తోడ్పాటు అందిస్తోంది. టీ20, వన్డే, టెస్టు మ్యాచ్కు తగిన విధంగా క్రికెటర్లు ఫిట్నెస్ సాధించాలి. వారు ఏ ఫార్మేట్కు సరిపోతారో చూసుకోవాలి.
83 ప్రపంచ కప్ తీపిగుర్తు...
1983లో ప్రపంచకప్ సాధించడం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. మదన్లాల్తో పాటు ఇతర జట్టు సభ్యులు చూపిన పోరాట పటిమతో దాన్ని సాధించాం. ముఖ్యంగా కపిల్దేవ్ వల్లే కప్ కొట్టగలిగాం. బాల్యం నుంచి కపిల్ తెలుసు. ఆ వరల్డ్కప్లో కపిల్ 175 స్కోర్ కొట్టకపోతే ముందుకువెళ్లే వాళ్లం కాదు. ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలడు. అందుకు 83 విజయమే నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో టీ¨20, వన్డేల్లో ప్రతి ఫార్మేట్కూ ప్రాధాన్యం ఉంది. టీ20 మ్యాచ్లు ప్రేక్షకులను అధిక సంఖ్యలో మైదానాలకు రప్పిస్తున్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఐపీఎల్, ఏపీఎల్ వంటి మ్యాచ్లు భారత జట్టులో స్థానం సాధించేందుకు క్రికెటర్లకు ఒక మెట్టుగా నిలుస్తున్నాయి.
విశాఖలో స్నేహితులు
నేను 1975లో విశాఖలో రంజీ మ్యాచ్ ఆడేందుకు వచ్చా. అప్పుడు ఆంధ్రా జట్టుతో తలపడ్డాం. రైల్వేగ్రౌండ్లో మ్యాచ్ జరిగింది. మంచి మిత్రులు కొందరు ఇక్కడున్నారు. మౌలికవసతుల పరంగా చూసుకుంటే చాలా మార్పులు వచ్చాయి. క్రికెట్ మైదానాలు, క్రికెట్ పిచ్లు పెరిగాయి. అలాగే ఉత్తమ క్రికెటర్లు ఏపీ నుంచి వచ్చారు. గతంలో కన్నా ఇప్పుడు క్రికెట్లో అనేక రకాలుగా అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం అనేక ఫార్మేట్లు వచ్చాయి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో పోటీలు నిర్వహించుకుంటున్నారు. ఐపీఎల్, ఏపీఎల్ వంటివి జోరుగా కొనసాగుతున్నాయి.
మహిళా క్రికెటర్లకు ప్రాధాన్యం
భారత క్రికెట్లో మహిళలు ఎంతగానో రాణిస్తున్నారు. వచ్చిన అవకాశాలను చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మెరికల్లాంటి క్రికెటర్లను తయారు చేయడంలో ఆయా రాష్ట్రాల్లో అకాడమీలతో పాటు ఎన్సీఏ వంటి అకాడమీలు ఉన్నాయి. అలాగే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఎంపికలు నిర్వహించి నైపుణ్యాలు పెంచేలా చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
[ 17-05-2024]
ఐదేళ్లుగా విశాఖను కబళించిన ‘జె’ గ్యాంగ్లో ఆయన ఒకరు. ఏకంగా రాయలసీమ జిల్లాలు దాటొచ్చి విశాఖలో రూ.వందల కోట్ల విధ్వంసం సాగించారు. రుషికొండ మట్టిని కొల్లగొట్టి.. ఏపీఐఐసీ భూముల్లోనూ దర్జాగా గ్రావెల్ తవ్వకాలు సాగించిన ఘనుడు. -
ఫలితాన్ని శాసించేలా!!
[ 17-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలట్ ఓట్లు వినియోగించుకున్న వారి సంఖ్య ఈ ఎన్నికల్లో గణనీయంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో మొత్తం ఓటర్లలో 0.31శాతం మంది పోస్టల్ బ్యాలట్లు వినియోగిస్తే, ఈ ఎన్నికల్లో 1.13 మంది పోస్టల్ ఓట్లు వేశారు. -
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ శిబిరాలు
[ 17-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. -
బాధితులకు ‘తెదేపా’ పరామర్శ
[ 17-05-2024]
విశాఖలోని బర్మాక్యాంపు ప్రాంతంలో జరిగిన వైకాపా నాయకుల దాడిలో గాయపడిన బాధితులను గురువారం 68వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో విశాఖ పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు గండి బాబ్జీ పరామర్శించారు. -
ఈవీఎంలకు కేంద్ర బలగాల భద్రత సీసీ కెమెరాల ఏర్పాటు
[ 17-05-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న ఓటింగ్ యంత్రాల (ఈవీఎం, వీవీపాట్)స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రతను కల్పించారు. తొలి అంచెలో కేంద్ర బలగాలు భద్రతగా ఉన్నాయి. -
ముగిసిన ఐఐవైసీ వార్షిక సమావేశాలు
[ 17-05-2024]
ఇస్కాన్ (సాగర్నగర్) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) వార్షిక సమావేశాలు గురువారం ముగిశాయి. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు(హెల్పర్) మృతి చెందాడు. -
వరాహా నదిలో రాతి విగ్రహం లభ్యం
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెదఉప్పలం సమీపాన వరాహానదిలో నూకాంబిక అమ్మవారి రాతి విగ్రహం గురువారం లభ్యమైంది. -
తెదేపా అభిమానిపై వైకాపా నాయకుల దాడి
[ 17-05-2024]
మండలంలోని జె.పి.అగ్రహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తెదేపా అభిమానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేశామని రోలుగుంట ఎస్సై సురేష్ తెలిపారు. -
పారా వాలీబాల్ జాతీయ జట్టుకు సోముదేవుపల్లి యువకుడి ఎంపిక
[ 17-05-2024]
ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు శివారు పాత సోముదేవుపల్లికి చెందిన దివ్యాంగ యువకుడు అన్నం గణేష్ పారా వాలీబాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. -
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ
[ 17-05-2024]
జాతీయ రహదారిపై నూతనగుంటపాలెం సమీపాన గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొన్న సంఘటనలో డ్రైవరుతో సహా నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు