logo

కూటమితోనే బంగారు భవిష్యత్తు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 04:07 IST

మహిళలకు కరపత్రాలు అందజేస్తున్న కొణతాల

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), కశింకోట, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. గవరపాలెం చినరామస్వామి దేవాలయం,  దాసరిగెడ్డ రోడ్డు, అంబేడ్కర్‌ నగర్‌ ప్రాంతాల్లో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గాజుగ్లాసు గుర్తుకు  ఓటు వేసి తనను, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి  సీఎం రమేశ్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి  తెలుసుకున్నారు. ఆయనకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. కూటమి నాయకులు, కార్యకర్తలు   పాల్గొన్నారు. తేగాడలో బూê్ కమిటీలతో కొణతాల, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సమావేశమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని