logo

మచ్చలేని నాయకుడు నరేంద్రమోదీ: జీవీఎల్‌

సుదీర్ఘ రాజకీయ జీవితంలో నరేంద్రమోదీ మచ్చలేని నాయకుడిగా నిలిచారని భాజపా నేత జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. లాసన్స్‌బేకాలనీ భాజపా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

Published : 08 May 2024 03:45 IST

సమావేశంలో మాట్లాడుతున్న జీవీఎల్‌ నరసింహారావు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : సుదీర్ఘ రాజకీయ జీవితంలో నరేంద్రమోదీ మచ్చలేని నాయకుడిగా నిలిచారని భాజపా నేత జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. లాసన్స్‌బేకాలనీ భాజపా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యనారాయణ అధికార పార్టీ చేసిన తప్పులను కేంద్రంపై నెడుతున్నారన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎన్డీయేకు మంచి ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే సారధ్యంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తుందన్నారు. భాజపా నాయకులు వంశీయాదవ్‌, సేనాపతి మహేష్‌, కరణంరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు