logo

పరిహారం చెల్లించాలి: చిరంజీవులు

ఇటీవల కురిసిన అకాల వర్షంతో దెబ్బ తిన్న పంటకు పరిహారం చెల్లించాలని పార్వతీపురం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి బి.చిరంజీవులు డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ నాయకులతో కలిసి ఆదివారం మండలంలోని పుట్టూరు, లచ్చిరాజుపేట, తాళ్లబురిడి తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

Published : 17 Jan 2022 05:58 IST


తడిసిన పనలు చూపిస్తున్న తెదేపా నాయకులు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన అకాల వర్షంతో దెబ్బ తిన్న పంటకు పరిహారం చెల్లించాలని పార్వతీపురం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి బి.చిరంజీవులు డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ నాయకులతో కలిసి ఆదివారం మండలంలోని పుట్టూరు, లచ్చిరాజుపేట, తాళ్లబురిడి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతోనే పంట నష్టపోయినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు వెంకటనాయుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని