ఏడు గంటలు నరకం
నాతవలస వద్ద జరిగిన ఘటన కలచివేసింది. ప్రమాద సమయంలో బస్సులో చిన్నారులు, వృద్ధులు కలిపి మరో 41 మంది ఉన్నారు. వీరంతా బయటకు రాలేక.. బిక్కుబిక్కుమంటూ ఏడు గంటల పాటు అందులోనే ఉండాల్సి వచ్చింది. తెల్లవారింది.. ఏ ఒక్కరైనా వచ్చి తమను బయటకు తీస్తారేమోనని
ఆగిన లారీని ఢీకొన్న యాత్రికుల బస్సు
అందులోనే వృద్ధులు, పిల్లలు
9 మందికి గాయాలు
నాతవలస టోల్గేట్ వద్ద ప్రమాదానికి గురైన బస్సు
భోగాపురం, న్యూస్టుడే నాతవలస వద్ద జరిగిన ఘటన కలచివేసింది. ప్రమాద సమయంలో బస్సులో చిన్నారులు, వృద్ధులు కలిపి మరో 41 మంది ఉన్నారు. వీరంతా బయటకు రాలేక.. బిక్కుబిక్కుమంటూ ఏడు గంటల పాటు అందులోనే ఉండాల్సి వచ్చింది. తెల్లవారింది.. ఏ ఒక్కరైనా వచ్చి తమను బయటకు తీస్తారేమోనని ఆశతో ఎదురు చూశారు. ఉదయం 7, 8, 9 గంటలు అవుతున్నా.. ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. ఈ విషయం తెలుసుకున్న ఈనాడు-ఈటీవీ బృందం అక్కడకు చేరుకుంది. అప్పటికే సమయం 11 కావస్తోంది. చిన్న పిల్లలు కిటికీల్లోంచి కిందకు దిగి దగ్గర్లో ఉన్న దుకాణానికి వెళ్లి బిస్కెట్లు తెచ్చి వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన పరిస్థితి కనిపించింది.
బాధితులకు శీతల పానీయాలు, బిస్కెట్లు అందిస్తున్న పోలీసులు
సమయం: శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలు
ఏం జరిగింది: డెంకాడ మండలం నాతవలస జాతీయ రహదారిపై ప్రమాదం.
ఎలా: మహారాష్ట్ర నుంచి తిరుపతి వెళ్తున్న యాత్రికుల బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఏమైంది: ఈ ఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తలుపు లాక్ కావడంతో వారితో పాటు మిగిలిన వారు బయటకు రాలేకపోయారు. ఏడు గంటల పాటు అందులోనే ఉండిపోయారు. కొందరు వృద్ధులు బస్సులోనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చింది.
‘ఈనాడు-ఈటీవీ’ చొరవతో స్పందించిన ఎస్పీ
విషయాన్ని ‘ఈనాడు-ఈటీవీ’ బృందం ఎస్పీ దీపిక ఎం.పాటిల్కు చరవాణిలో తెలపగా ఆమె వెంటనే స్పందించారు. 15 నిమిషాల్లో సంఘటనా స్థలానికి మూడు హైవే మొబైల్ వాహనాలతో పాటు పూసపాటిరేగ, డెంకాడ మండలాల ఎస్సైలు సిబ్బందితో వచ్చారు. సమీప టోల్గేట్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బస్సులో యాత్రికులు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. ఎస్సై పద్మావతి సూచనలతో కానిస్టేబుల్ త్రినాథ్ బస్సు అత్యవసర ద్వారాన్ని తెరచి ఒక్కొక్కరిని కిందకు దింపారు. వారికి అప్పటికే తీసుకొచ్చిన శీతల పానీయాలు, బిస్కెట్లు అందించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశామని, వీరంతా మహారాష్ట్రకు చెందిన వారన్నారు. వీరు పూరీ, కోల్కతా చూసి రామేశ్వరం, తిరుమల దర్శనానికి వెళ్తున్నట్లు తెలిపారు. యాత్రికులను సురక్షితంగా తీసుకెళ్లేందుకు వాహనం మాట్లాడుతున్నామని చెప్పారు. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించామన్నారు.
లోపల నానాయాతన పడుతున్న ప్రయాణికులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుసా జగన్.. ప్రాణాల విలువ
[ 27-04-2024]
జగన్.. నా గిరిజనులు అన్నావ్.. అన్నగా అండగా ఉంటానన్నావ్.. మరి ఎందుకు కొండ శిఖర గ్రామాలను వదిలేశావ్.. -
116 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎంపీ, నియోజకవర్గ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. సక్రమంగా లేని 116 నామపత్రాలను అధికారులు తిరస్కరించారు. -
ఓటింగ్ శాతం పెంపునకు కృషి
[ 27-04-2024]
జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ కోరారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలోని 31 కేంద్రాల్లో శనివారం పాలీసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈమేరకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సమన్వయాధికారులు ఆశా రమణి, -
తెదేపాలోకి ముద్దాడ
[ 27-04-2024]
వైకాపా నేత, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు యాదవ్ శుక్రవారం తెదేపాలో చేరారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
రూ.6.47 కోట్ల బంగారం, వెండి వస్తువుల స్వాధీనం
[ 27-04-2024]
వ్యానులో తరలిస్తున్న రూ.6.47 కోట్ల విలువజేసే బంగారం, వెండి వస్తువులను విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస చెక్పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్