యూరియా.. ఏదయా!
ప్రభుత్వం ఈ ఏడాది వరిసాగు వద్దనడంతో మొక్కజొన్న ఎక్కువగా వేశారు. అక్కడక్కడా వరి కూడా ఉంది. ఈ పంటలకు అవసరమైన యూరియా కోసం ‘రైతు భరోసా’ కేంద్రాల వద్ద కర్షకులు నిరీక్షిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు నల్లబజారులో అధిక
రైతు భరోసా కేంద్రాల్లో దొరకని ఎరువు
గుర్ల మండలం పాలవలస ఆర్బీకే వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు
న్యూస్టుడే-గరివిడి, గుర్ల, విజయనగరం వ్యవసాయ విభాగం: ప్రభుత్వం ఈ ఏడాది వరిసాగు వద్దనడంతో మొక్కజొన్న ఎక్కువగా వేశారు. అక్కడక్కడా వరి కూడా ఉంది. ఈ పంటలకు అవసరమైన యూరియా కోసం ‘రైతు భరోసా’ కేంద్రాల వద్ద కర్షకులు నిరీక్షిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు నల్లబజారులో అధిక ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా బస్తా యూరియాను రూ.266.50 అందించాలి. ప్రస్తుతం లేకపోవడంతో రైతు తమ భూమికి సంబంధించిన 1బీ పత్రం తెచ్చుకుంటే ఎకరా అయినా పది ఎకరాలున్నా ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. దాని కోసం ఆర్బీకేల వద్ద క్యూలు కడుతున్నారు. రాజకీయ పలుకుబడి, నేతల సిఫార్సులున్న ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో వ్యాపారులు బస్తాను రూ.350 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నారు.
బస్తా ఎరువు రూ.400
వరి వేశాను. ఆర్బీకేకు వెళ్లినా యూరియా దొరకలేదు. బయట మార్కెట్లో బస్తా ఎరువు రూ.400 పెట్టి కొన్నా. ఎమ్మార్పీ కంటే రూ.134 అధికంగా ఇవ్వాల్సి వచ్చింది. - దాసరి బంగారునాయుడు, రైతు, ఊటపల్లి, మెరకముడిదాం మండలం
అదనంగా తీసుకున్నారు
మొక్కజొన్న వేశా. యూరియా కోసం రైతు భరోసా కేంద్రానికి వెళ్తే 1బీ పత్రంలో ఎంత భూమి ఉన్నా ఒక బస్తా ఇస్తామన్నారు. ఎమ్మార్పీ రూ.266.50 ఉంటే రూ.300 తీసుకున్నారు. అదనంగా ఎందుకని అడిగితే రవాణా, కూలీల ఖర్చన్నారు.
- ఎన్.రామ్మోహన్, వెదుళ్లవలస, గరివిడి మండలం
ఈ నెలాఖరుకు రానుంది
మొక్కజొన్న విస్తారంగా వేసిన చీపురుపల్లి, సాలూరు తదితర ప్రాంతాల్లో యూరియా అవసరం ఎక్కువగా ఉంది. ఈ నెలలో 4 వేల టన్నులు రావాల్సి ఉన్నా సంక్రాంతి నేపథ్యంలో పూర్తిగా చేరుకోలేదు. ఈ నెలాఖరుకు 3 వేల టన్నుల ఎరువు రానుంది. దీంతో రైతుల అవసరాలు పూర్తిగా తీరుతాయి. -వి.టి.రామారావు, జేడీఏ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుసా జగన్.. ప్రాణాల విలువ
[ 27-04-2024]
జగన్.. నా గిరిజనులు అన్నావ్.. అన్నగా అండగా ఉంటానన్నావ్.. మరి ఎందుకు కొండ శిఖర గ్రామాలను వదిలేశావ్.. -
116 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎంపీ, నియోజకవర్గ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. సక్రమంగా లేని 116 నామపత్రాలను అధికారులు తిరస్కరించారు. -
ఓటింగ్ శాతం పెంపునకు కృషి
[ 27-04-2024]
జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ కోరారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలోని 31 కేంద్రాల్లో శనివారం పాలీసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈమేరకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సమన్వయాధికారులు ఆశా రమణి, -
తెదేపాలోకి ముద్దాడ
[ 27-04-2024]
వైకాపా నేత, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు యాదవ్ శుక్రవారం తెదేపాలో చేరారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
రూ.6.47 కోట్ల బంగారం, వెండి వస్తువుల స్వాధీనం
[ 27-04-2024]
వ్యానులో తరలిస్తున్న రూ.6.47 కోట్ల విలువజేసే బంగారం, వెండి వస్తువులను విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస చెక్పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్