logo

సముద్రంలో విద్యార్థి గల్లంతు

పరీక్షలు ముగియడంతో స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర స్నానానికి వచ్చి ఓ విద్యార్థి కెరటాల ధాటికి గల్లంతయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోపాడ గ్రామానికి చెందిన ఆకుల

Published : 20 May 2022 04:24 IST


పురుషోత్తం

భీమునిపట్నం, న్యూస్‌టుడే : పరీక్షలు ముగియడంతో స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర స్నానానికి వచ్చి ఓ విద్యార్థి కెరటాల ధాటికి గల్లంతయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోపాడ గ్రామానికి చెందిన ఆకుల పురుషోత్తం(17) అక్కివరం ఏపీ మోడల్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారంతో పరీక్షలు ముగియడంతో తోటి విద్యార్థినులు, విద్యార్థులతో కలిసి భీమిలి తీరానికి వచ్చాడు. వీరిలో పురుషోత్తం, సంతోష్‌కుమార్‌ నీళ్లల్లోకి దిగారు. బలమైన కెరటం పురుషోత్తంను లోపలికి నెట్టేయగా.. సంతోష్‌కుమార్‌ అదృష్టవశాత్తు బయటపడ్డాడు. గల్లంతైన విద్యార్థి తండ్రి నారాయణరావు భీమిలి మండలం చిప్పాడ దివీస్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడు గల్లంతయ్యాడని తెలిసి కుటుంబ సభ్యులు తీరానికి వచ్చి చేసిన రోదనలు కంటతడిపెట్టించాయి. విద్యార్థి కోసం గాలిస్తున్నామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వి.రమణ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు