బాబోయ్.. ఇవేం రహదారులు!
అధ్వాన రహదారులతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వరుస వర్షాలతో రోడ్డుపై గోతుల్లో నీరు చేసి ప్రయాణం సాహసంగా మారుతోంది. గొయ్యిలు, గతుకులమయం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
న్యూస్టుడే, తెర్లాం, బొండపల్లి, గజపతినగరం, రాజాం, బొబ్బిలి గ్రామీణం, రామభద్రపురం
అధ్వాన రహదారులతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వరుస వర్షాలతో రోడ్డుపై గోతుల్లో నీరు చేసి ప్రయాణం సాహసంగా మారుతోంది. గొయ్యిలు, గతుకులమయం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పట్టించుకునే వారు కరవైపోయారని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి, గజపతినగరం, రాజాం నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ గోతుల్లో నీరుచేరి, ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.
తెర్లాం మండలం పాములవలస గ్రామం దాటిన తర్వాత సుందరాడ, ఉద్దవోలు వరకు ప్రధాన రహదారిపై గోతులు ఏర్పడి, ఎక్కడికక్కడే అధ్వానంగా దర్శనం ఇస్తున్నాయి. ఏ మాత్రం వర్షం కురిసినా గోతుల్లో నీరు చేరుతోందని.. గుంత ఎక్కడుందో తెలియడం లేదని స్థానికులు వాపోతున్నారు. మరోపక్క ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఉన్న ఈ రహదారుల్లో మలుపులు ఉండటం, అక్కడ తుప్పలు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని.. వాటిని తొలగించాలని కోరుతున్నారు. రోడ్డు బాగుకు ప్రతిపాదనలు పంపించామని ఆర్అండ్బీ ఏఈ రాజు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
నిత్యం వేలమంది రాకపోకలు సాగించే రాజాం పట్టణంలోని ఆర్టీసీ కూడలి ప్రాంగణం గోతులమయంగా మారింది. వర్షాలకు నీరు చేరుతోంది. ప్రయాణికులు బస్సుల కోసం పరుగులు తీస్తున్న క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనం ఎక్కేందుకు, దిగేందుకు వీలు కాని పరిస్థితి. ఆర్టీసీ క్లాంప్లెక్సు నిర్మాణానికి ఇటీవల నిధులు విడుదలయ్యాయి. పనులకు సంబంధించి మంత్రుల ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా జరిగింది. వర్షాల వల్లే కాంప్లెక్సు నిర్మాణ పనులు ప్రారంభించలేదని పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గోతులు పూడ్చే బాధ్యత మున్సిపల్ అధికారులదేనని చెప్పారు.
బొండపల్లి మండలంలో దేవుపల్లి బజారు కేంద్రం రహదారి వానపడితే.. చెరువును తలపిస్తోంది. అధికారులు స్పందించి, తక్షణం రహదారులకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్టు ఏఈ అప్పలనాయుడు వద్ద ప్రస్తావించగా.. త్వరలోనే మరమ్మతులు చేపడతామని తెలిపారు.
గజపతినగరం నుంచి పురిటిపెంట మీదుగా ఆండ్రకి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా పాడైంది. ముచ్చర్ల గ్రామం నుంచి కెంగువకు వెళ్లే రహదారి చినుకు పడితే బురదమయంగా మారుతోంది. రహదారి మరమ్మతులు చేసేందుకు చర్యలు కానరావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని మండల ఇంజినీరింగు అధికారి అప్పలనాయుడు తెలిపారు.
అడుగడుగునా గొయ్యి
మెట్టవలస రహదారి
బొబ్బిలి మండలంలోని మెట్టవలసకు వెళ్లే రహదారి పాడైపోయి గోతులు ఏర్పడ్డాయి. వాటిలో వర్షం నీరు చేరడంతో వాహనాలు నడపడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేస్తామని ఏఈ రుగ్మాందనాయుడు ‘న్యూస్టుడే’తో అన్నారు.
* రామభద్రపురం మండలంలోని ఎనుబొరువు గ్రామంలో రోడ్డు మధ్యలో గోతులు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు బాగుకు అధికారులు రూ.5 కోట్లు మంజూరు చేశారు. గుత్తేదారులు సగంలో పనులు నిలిపివేశారు. వర్షాలకు రోడ్డు ఇంకా పాడైంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఏఈ నాయుడు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మిథ్యా’లయం!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు అవకాశమున్న ఏకైక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. 2007లో కాకినాడ విశ్వవిద్యాలయం ప్రాంగణంగా ఇది ఏర్పాటైంది. -
ఓటరు తీర్పుపై ఎవరి ధీమా వారిదే..!
[ 17-05-2024]
ఎన్నికల యుద్ధం ముగిసింది.. పోటీలో తొలి నుంచి అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు కదిలారు. ఓటరు తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. -
డెంగీ నివారణ అందరి బాధ్యత
[ 17-05-2024]
డెంగీతో తీవ్ర ఆనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో ఎస్.భాస్కరరావు అన్నారు. -
ఉద్యానాలకు ఉపాధి ఊతం
[ 17-05-2024]
జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ఉద్యాన తోటలు భారీగా పెంచడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మండలానికి 200 ఎకరాల్లో తోటలు పెంచాలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. -
పట్టణవాసిపై పన్ను బాదుడు
[ 17-05-2024]
చంద్రబాబు హయాంలో అద్దె ప్రాతిపదికన పన్నులు విధించేవారు. ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకునేవారు. నామమాత్రపు వార్షిక పన్ను వసూలు చేసేవారు. -
సీసీ ఫుటేజీ ఇవ్వడంలో ఆలస్యం
[ 17-05-2024]
విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన పోస్టల్ బ్యాలట్ తరలింపు ప్రక్రియలో అనుమానాలు ఉన్నాయని కూటమి విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిని అదితి గజపతిరాజు ఆరోపించారు. -
షట్టర్లు ఇలా.. నీరు పారేదెలా?
[ 17-05-2024]
సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. దీని ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారికంగా 38,500 ఎకరాల ఆయకట్టుకు, అనధికారికంగా మరో 20 వేల ఎకరాలకు సాగునీరు అందాలి. -
ఆ విపత్తు నుంచి ఎంతో నేర్చుకున్నా
[ 17-05-2024]
‘ఏడాది పాటు ఎంతో నేర్చుకున్నా. ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది’ అని జిల్లా సహాయక కలెక్టర్ బి.సహాదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. -
అదనపు దూరం... తప్పని భారం
[ 17-05-2024]
పాలకొండ ఆర్టీసీ డిపో గతంలో రీజియన్లోనే ఆదాయంలో మొదటి స్థానంలో ఉండేది. కానీ కొన్ని ఏళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. -
డోలీలోనే గర్భిణి ప్రసవం
[ 17-05-2024]
గిరిజనులు అత్యవసర వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు వారికి డోలీ మోతలు తప్పడం లేదు. జిల్లాలో అత్యధిక గిరిజన జనాభా ఉన్న ఎస్.కోట నియోజకవర్గంలో మరోసారి ఈ పరిస్థితి ఎదురైంది. -
ఇంకెప్పుడు వేస్తారో..?
[ 17-05-2024]
కురుపాం మండలం పొడి పంచాయతీ సంతోషపురం కూడలి నుంచి మీగడ గ్రామం వరకు రూ.1.90 కోట్ల ఉపాధి నిధులతో బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గత ఏడాది జులై 25న భూమిపూజ చేశారు. -
ఎఫ్సీఐ పేరిట బెదిరింపులు
[ 17-05-2024]
ఎఫ్సీఐ(ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- ఆహార కల్తీ నియంత్రణ శాఖ) పేరిట ఓ హాటల్ యాజమాన్యాన్ని బెదిరించిన నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ ఎస్సై హరిబాబు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు