Mulugu: కాన్పు కోసం వెళితే మూత్రాశయాన్ని కత్తిరించారు..
కాన్పు కోసం గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే వైద్యులు మూత్రాశయాన్ని కత్తిరించారు. అది గమనించకుండా రెండ్రోజులు అలాగే ఉంచి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన తర్వాత విషయం బయట పడింది.
ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ బాలింత
ములుగు, న్యూస్టుడే: కాన్పు కోసం గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే వైద్యులు మూత్రాశయాన్ని కత్తిరించారు. అది గమనించకుండా రెండ్రోజులు అలాగే ఉంచి వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన తర్వాత విషయం బయట పడింది. ఈ సంఘటన ములుగులోని జిల్లా ఆసుపత్రిలో జులై 28న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఇంచర్ల గీత జులై 28న ములుగు జిల్లా ఆసుపత్రికి కాన్పు కోసం వెళ్లారు. అదే రోజు సాయంత్రం వైద్యులు శస్త్రచికిత్స చేసి కాన్పు చేశారు. అప్పటి వరకు తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం నుంచి బాలింత కడుపు ఉబ్బడంతో సమస్యను వైద్యులకు వివరించారు. వారు సమస్యను గుర్తించక పట్టించుకోలేదు. రెండ్రోజులు గడిచినా అదే పరిస్థితి నెలకొనడంతో వరంగల్ ఎంజీఎంకు సిఫారసు చేశారు. అక్కడి వైద్యులు కూడా సమస్యను గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించింది. లాభం లేదనుకొని ఆమె భర్త సాగర్ హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు సమస్యను గుర్తించి మూత్ర సంచికి గాయమై ఇన్ఫెక్షన్ అయిందని తెలిపారు. ములుగు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తన భార్యకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడిందని ఆమె భర్త ములుగు పోలీసుస్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.
ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన ములుగు డీఎంహెచ్వో: ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గీత ఆరోగ్య పరిస్థితిని మంగళవారం ములుగు డీఎంహెచ్వో డాక్టర్ ఎ.అప్పయ్య పరిశీలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డీఎంహెచ్వో ‘న్యూస్టుడే’తో తెలిపారు. కాన్పు చేసిన సమయంలో మూత్రాశయానికి గాయమైంది వాస్తవమేనని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడుల బాగు పనులిక చకచకా..!
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది. -
పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..
[ 19-05-2024]
‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు. -
నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి
[ 19-05-2024]
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ప్రేమేందర్రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం
[ 19-05-2024]
సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు -
కేయూ ప్రతిష్ఠకు మరకలు
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు -
భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు..!
[ 19-05-2024]
భారాస, కాంగ్రెస్ డీఎన్ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. -
వైభవంగా వసంతోత్సవం
[ 19-05-2024]
శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. -
కదిలిన అధికార యంత్రాంగం
[ 19-05-2024]
అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు -
‘ఆదర్శం’ కొంతే.. పోలింగ్ అంతంతే!
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. -
గ్రూపు-1 పరీక్షకు 14 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. -
ఈఏపీ సెట్లో తొమ్మిదో ర్యాంకు
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ