వరంగల్ బరిలో కడియం కావ్య..
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా మాజీ ఎంపీ ప్రొ.అజ్మీరా సీతారాంనాయక్, వరంగల్ ఎంపీ భారాస అభ్యర్థిగా కడియం కావ్యలను ఖరారు చేస్తూ ఆయా పార్టీల అధిష్ఠానాలు బుధవారం ప్రకటించాయి.
ఈనాడు-వరంగల్, మహబూబాబాద్, న్యూస్టుడే : మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా మాజీ ఎంపీ ప్రొ.అజ్మీరా సీతారాంనాయక్, వరంగల్ ఎంపీ భారాస అభ్యర్థిగా కడియం కావ్యలను ఖరారు చేస్తూ ఆయా పార్టీల అధిష్ఠానాలు బుధవారం ప్రకటించాయి.
వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి..
కడియం కావ్య (వరంగల్)
స్టేషన్ఘన్పూర్ భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ముగ్గురు కూతుళ్లు కాగా పెద్ద కుమార్తె కడియం కావ్య ఉస్మానియాలో ఎండీ పాథాలజీ చేసి వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. కొన్నేళ్లుగా ‘కడియం ఫౌండేషన్’ ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలకు హైజీన్ కిట్లను పంపిణీ చేశారు. వర్ధన్నపేట సామాజిక వైద్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేసిన కావ్య గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి శ్రీహరి రాజకీయ వారసురాలిగా అసెంబ్లీకి భారాస నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు శ్రీహరినే పోటీ చేయాలని, భవిష్యత్తులో కావ్యకు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పడంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి శ్రీహరి విజయానికి కావ్య విశేష కృషి చేశారు. ఈ క్రమంలో ఈ సారి వరంగల్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావ్యకు అవకాశం దక్కింది. కావ్య భర్త డాక్టర్ నజీర్, వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
రెండోసారి సీతారాంనాయక్ ..
అజ్మీరా సీతారాంనాయక్ (మహబూబాబాద్)
ఇటీవల భారాస నుంచి భాజపాలో చేరిన ప్రొ.అజ్మీరా సీతారాంనాయక్కు మహబూబాబాద్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని గిరిజన తండాకు చెందిన ప్రొ.సీతారాంనాయక్ 2014లో తెరాస(భారాస) అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి ఆయన టికెట్ కోసం ప్రయత్నించగా పార్టీ నిరాకరిస్తూ మాలోతు కవితకు కేటాయించారు. ఈ సారి కూడా ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇటీవల భాజపాలో చేరారు. భాజపా లోక్సభ టికెట్ కోసం జాటోతు హుస్సేన్నాయక్, యాప శీతయ్య ప్రయత్నాలు చేశారు. అయితే కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర, ఎంపీగా పనిచేసిన సీతారాంనాయక్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని భాజపా అనూహ్యంగా తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
ఆ రెండు పార్టీల నుంచి ఎవరో?
వరంగల్ లోక్సభ బరిలో కాంగ్రెస్, భాజపాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై ఇంకా స్పష్టత రాలేదు. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే భాజపా నుంచి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ పోటీ చేస్తారనే వార్తలు జోరుగా వినిపించాయి. బుధవారం భారాస నేతలు ఆయన్ను హైదరాబాద్ తీసుకెళ్లడం.. అక్కడ తాను భారాసలోనే ఉంటానని, పోటీలో ఉండనని ప్రకటించడంతో వరంగల్ నుంచి భాజపా అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఇక కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టతనివ్వకపోవడంతో ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఎవరనేది తేలాల్సి ఉంది.
మహబూబాబాద్లో ఖరారు
లోక్సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. బుధవారం మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ పేరును భాజపా ప్రకటించింది. ఇంతకన్నా ముందే భారాస సిట్టింగ్ ఎంపీ కవితకు మరోమారు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొంది. కాంగ్రెస్ మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్కు టికెట్ ఇచ్చింది. మానుకోట నుంచి పోటీలో నిలవనున్న ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఈ స్థానం నుంచి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుషారుగా.. చుట్టొద్దామా...!
[ 17-05-2024]
ఉమ్మడి వరంగల్.. సాంస్కృతిక రాజధాని. ఇక్కడ ఎన్నో పర్యాటక ఆకర్షణలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. అందుకే ఈసారి వేసవిలో ఎండలు మండుతున్నా పర్యాటకులు ఓరుగల్లుకు వరుస కడుతున్నారు. -
ఎన్నికల పుణ్యం.. బడి బాగుకు మార్గం
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల వల్ల ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటులో భాగంగా వాటిలో మౌలిక వసతులు కల్పించారు.. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలు, విద్యుత్తు కల్పన పనులు చేపట్టారు. -
ఓరుగల్లు.. జలమయం!
[ 17-05-2024]
భారీ వర్షంతో వరంగల్ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సన్నాహాలు
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు. -
యాదాద్రీశుడి సేవలో మాజీ మంత్రి హరీశ్రావు
[ 17-05-2024]
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం ఉదయం సందర్శించారు. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో..?
[ 17-05-2024]
సింగరేణి సంస్థ గడిచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు.. ‘ఎల్లో అలర్ట్’
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలకే రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల విరామం ఇచ్చిన వాన మళ్లీ గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తారంగా కురిసింది. -
‘రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం’
[ 17-05-2024]
ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో కేసముద్రం మార్కెట్ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు. -
ముంపు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు
[ 17-05-2024]
గోదావరి వరదతో ముంపునకు గురయ్యే ప్రదేశాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ‘ప్రమాదం పొంచి ఉంది.. -
రైతులను మోసం చేస్తే సహించం
[ 17-05-2024]
రైతులను మోసం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువులు, -
విధుల్లో నిర్లక్ష్యం సరికాదు..
[ 17-05-2024]
ఈ నెల 20 నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులన్నింటిని పూర్తి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య పేర్కొన్నారు. -
రక్తపోటు గుండెకు చేటు..!
[ 17-05-2024]
ఏ చిన్న సమస్యతో వైద్యుడి దగ్గరకెళ్లినా.. అడిగే మొదటి ప్రశ్న మీకు బీపీ (రక్తపోటు) ఉందా? కొంచెం కోపంగా మాట్లాడినా అతనికి బీపీ ఉంది అంటారు.. ఇలా అన్ని అనర్థాలకు రక్తపోటు కారణమవుతుంది. -
9,99,501 మంది ఓటుకు దూరం..
[ 17-05-2024]
గత సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ స్థానాలకు కలిపి 9,99,501 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. అంటే 29.78 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోలేదు. -
కమీషన్ల కక్కుర్తి..!
[ 17-05-2024]
గ్రేటర్ వరంగల్ అక్రమాలకు అడ్డాగా మారింది. కమీషన్లు, పర్సంటేజీల కోసం ఉన్నత పదవిలో ఉన్నవారు సైతం ఎంతకైనా తెగిస్తున్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు?
[ 17-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీప అడవిలో మంగళవారం హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ సుజాత కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
-
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!