పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సన్నాహాలు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు.
జిల్లాలో 23,419 మంది ఓటర్లు
ఎమ్మెల్సీ ఎన్నికపై బుధవారం జరిగిన దృశ్యమాధ్యమ సమీక్షలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఇతర అధికారులు
జనగామ, న్యూస్టుడే: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నెల(మే) 27న జరిగే పోలింగ్కు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి తరఫున స్థానిక నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఓటు కోసం 23698 దరఖాస్తులు రాగా. 1828 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. ముసాయిదా జాబితాను అనుసరించి ఓటర్ల సంఖ్య 21870. ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారం అనంతరం ఏప్రిల్ 4న తుది వివరాలను ప్రకటించారు. జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 17 కేంద్రాల్లో 14886 మంది ఓటర్లున్నారు. నర్మెట్ట, తరిగొప్పులలో ఒక్కో కేంద్రం, బచ్చన్నపేటలో రెండు, జనగామ పట్టణంలో ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టేషన్ఘన్పూర్ డివిజన్లో 10 కేంద్రాల పరిధిలో 8533 మంది ఓటర్లున్నారు. లింగాలఘనపురం, రఘునాథపల్లి, జఫర్గఢ్ దేవరుప్పులలో రెండేసి, స్టే.ఘన్పూర్, పాలకుర్తిలో మూడు పీఎస్ల చొప్పున, చిల్పూరు, కొడకండ్లలో ఒక్కో కేంద్రం ఏర్పాటైంది.
జిల్లాలో ఓటర్ల వివరాలు
పురుషులు- 14915,
మహిళలు-8503,
ఇతరులు-01
మొత్తం-23419.
పోలింగ్ కేంద్రాలు-27
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతికించు..స్ఫూర్తిని పంచు!
[ 14-06-2024]
నైతిక విలువల ఆధారంగా ఒకరి శరీరంలో ఉన్న అవయవాలు (కంటిపొర, చర్మం, గుండె, మూత్రపిండం, రక్తం) మరొకరి అవసరానికి వాడదల్చుకున్నప్పుడు, వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు -
ఇద్దరిని బలిగొన్న ఇసుక ట్రాక్టర్
[ 14-06-2024]
విలాసాగర్- దామెరకుంట మధ్య దుబ్బపల్లి గ్రామ సమీపంలో గురువారం ఓ ఇసుక ట్రాక్టర్ ఇద్దరిని బలిగొంది. -
బాలుర పరిశీలన గృహంలో అధికారుల మద్యం విందు!
[ 14-06-2024]
వరంగల్ బాలుర పరిశీలన గృహం (అబ్జర్వేషన్ హోం)లో సిబ్బంది బాధ్యతలు మరచి మద్యంతో విందు చేసుకున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది -
సమస్యను చూశారు.. పరిష్కారం చూపారు!
[ 14-06-2024]
గురువారం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన వీడియో కాల్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పంట క్షేత్రాలకు వెళ్లిన అన్నదాతలు తమ చరవాణుల నుంచి వీడియోకాల్ చేసి తమ సమస్యను చూపుతూ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. -
టౌన్ ప్లానింగ్లో వసూళ్లపై కమిషనర్ ఆరా
[ 14-06-2024]
-
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
[ 14-06-2024]
నర్సంపేట పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకునే నాథులు కరవయ్యారు. -
ఓరుగల్లు రైల్వేస్టేషన్కు కొత్తందాలు
[ 14-06-2024]
వరంగల్ రైల్వేస్టేషన్లో ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద రూ.25.41 కోట్ల వ్యయ ప్రణాళికతో పునరాభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. -
లక్నవరంలో పర్యాటకులకు భద్రత కరవు
[ 14-06-2024]
గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయం సందర్శనకొచ్చే పర్యాటకులకు భద్రత కరవైంది. -
అంగన్వాడీ.. పిల్లల భవిష్యత్తుకు వారధి
[ 14-06-2024]
బుడిబుడి అడుగుల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు వారధులుగా అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది -
కొత్త రేషన్కార్డులపై చిగురిస్తున్న ఆశలు..!
[ 14-06-2024]
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డులు(రేషన్కార్డులు) జారీ చేస్తోంది. రేషన్కార్డులపై రాయితీ బియ్యంతో పాటు గతంలో అన్ని రకాల నిత్యావసరాలనూ పంపిణీ చేసేవారు. -
వామ్మో గుడుంబా..!
[ 14-06-2024]
అధికారులు గుడుంబా స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తుండడంతో జిల్లావాసులు హర్షిస్తున్నా.. మరోవైపు దాని తయారీకి అవసరమైన బెల్లం రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆశిస్తున్నారు -
బస్సుల కొరత.. ప్రయాణికుల వెత
[ 14-06-2024]
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది
తాజా వార్తలు (Latest News)
-
అమిత్ షాతో ‘సీరియస్ చర్చ’.. ఆ విషయం గురించే: తమిళిసై
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/06/24)
-
భారత్ గురించి మరింత తెలుసుకోవాలని ఉందట..! చైనాలో ఆసక్తికర సర్వే
-
రాశీఖన్నా ‘మోస్ట్ పాపులర్’.. వైరల్గా దిల్ రాజు ఫ్యామిలీ టూర్ స్టిల్స్
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
-
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్