ఓరుగల్లు.. జలమయం!
భారీ వర్షంతో వరంగల్ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది.
హనుమకొండ బస్టాండులో పోటెత్తిన వరద
ఈనాడు, వరంగల్, ఎంజీఎం ఆసుపత్రి, కార్పొరేషన్, న్యూస్టుడే: భారీ వర్షంతో వరంగల్ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది. హనుమకొండ బస్టాండు సమీపంలో మోకాలి లోతు నీరు నిలవడంతో రాకపోకలకు వాహదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. జనగామ బస్టాండు ప్రాంగణంలోని ప్రధాన కూడలి భారీ వర్షానికి జలమయమైంది. పరకాల పట్టణంలో రోడ్లపైకి వరద పోటెత్తింది. ఈ అకాల వర్షం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. అనేక చోట్ల ఈదురుగాలుల వల్ల మామిడి కాయలు రాలిపోయాయి. హసన్పర్తి, దామెర, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు, ఐనవోలు, ధర్మసాగర్, కాజీపేట, ఆత్మకూరు, పరకాల, శాయంపేట మండలాల్లో వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలోని గీసుకొండ, ఖిలావరంగల్, నల్లబెల్లి, దుగ్గొండి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, తదితర మండలాల్లోనూ అదే పరిస్థితి. అకాల వర్షాల కారణంగా కల్లాలు, రోడ్లపై పోసిన ధాన్యం తడిసి పోయాయి. మామిడి కాయలు రాలాయి. నీట తడిసిన కాయలు అక్కరకు రాకుండా పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
భారీ వర్షానికి కరీమాబాద్లోని పోచమ్మగుడి ముందు విద్యుత్తు తీగలపై పడిన వృక్షం
గ్రేటర్లో ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూం
భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో గ్రేటర్ వరంగల్ అప్రమత్తమైంది. నగర ప్రజలకు సత్వర సహాయం అందించేందుకు బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లుగా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటల పాటు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నెంబరు 1800 425 1980, ఫోన్ నెంబరు 9701999645, వాట్సాప్ 9701999676 లో సంప్రదించాలని కమిషనర్ కోరారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్యం, డీఆర్ఎఫ్ టీం 24 గంటల పాటు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యను చూశారు.. పరిష్కారం చూపారు!
[ 14-06-2024]
గురువారం ‘ఈనాడు’ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన వీడియో కాల్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పంట క్షేత్రాలకు వెళ్లిన అన్నదాతలు తమ చరవాణుల నుంచి వీడియోకాల్ చేసి తమ సమస్యను చూపుతూ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. -
బతికించు..స్ఫూర్తిని పంచు!
[ 14-06-2024]
నైతిక విలువల ఆధారంగా ఒకరి శరీరంలో ఉన్న అవయవాలు (కంటిపొర, చర్మం, గుండె, మూత్రపిండం, రక్తం) మరొకరి అవసరానికి వాడదల్చుకున్నప్పుడు, వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు -
ఇద్దరిని బలిగొన్న ఇసుక ట్రాక్టర్
[ 14-06-2024]
విలాసాగర్- దామెరకుంట మధ్య దుబ్బపల్లి గ్రామ సమీపంలో గురువారం ఓ ఇసుక ట్రాక్టర్ ఇద్దరిని బలిగొంది. -
బాలుర పరిశీలన గృహంలో అధికారుల మద్యం విందు!
[ 14-06-2024]
వరంగల్ బాలుర పరిశీలన గృహం (అబ్జర్వేషన్ హోం)లో సిబ్బంది బాధ్యతలు మరచి మద్యంతో విందు చేసుకున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది -
టౌన్ ప్లానింగ్లో వసూళ్లపై కమిషనర్ ఆరా
[ 14-06-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల తీరుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులకు కొర్రీలు పెడుతూ.. డబ్బులు వసూళ్లు చేపట్టడాన్ని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తీవ్రంగా పరిగణించారు. -
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
[ 14-06-2024]
నర్సంపేట పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకునే నాథులు కరవయ్యారు. -
ఓరుగల్లు రైల్వేస్టేషన్కు కొత్తందాలు
[ 14-06-2024]
వరంగల్ రైల్వేస్టేషన్లో ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద రూ.25.41 కోట్ల వ్యయ ప్రణాళికతో పునరాభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. -
లక్నవరంలో పర్యాటకులకు భద్రత కరవు
[ 14-06-2024]
గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయం సందర్శనకొచ్చే పర్యాటకులకు భద్రత కరవైంది. -
అంగన్వాడీ.. పిల్లల భవిష్యత్తుకు వారధి
[ 14-06-2024]
బుడిబుడి అడుగుల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు వారధులుగా అంగన్వాడీ కేంద్రాలు ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది -
కొత్త రేషన్కార్డులపై చిగురిస్తున్న ఆశలు..!
[ 14-06-2024]
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డులు(రేషన్కార్డులు) జారీ చేస్తోంది. రేషన్కార్డులపై రాయితీ బియ్యంతో పాటు గతంలో అన్ని రకాల నిత్యావసరాలనూ పంపిణీ చేసేవారు. -
వామ్మో గుడుంబా..!
[ 14-06-2024]
అధికారులు గుడుంబా స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తుండడంతో జిల్లావాసులు హర్షిస్తున్నా.. మరోవైపు దాని తయారీకి అవసరమైన బెల్లం రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆశిస్తున్నారు -
బస్సుల కొరత.. ప్రయాణికుల వెత
[ 14-06-2024]
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది
తాజా వార్తలు (Latest News)
-
మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. ఎస్వీ యూనివర్సిటీలో సంబరాలు
-
సూపర్-8 పోరుకు ముందే.. ఆ ఇద్దరు స్వదేశానికి!
-
ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా
-
‘కాళేశ్వరం’పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ
-
జులై 22న కేంద్ర బడ్జెట్.. జులై 3న ఆర్థిక సర్వే..!
-
చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్ నటుడు.. అధికారికంగా ప్రకటించిన టీమ్