బరి గీశారు.. గురి ఎవరిదో..!
‘నోటాతో కలిపి ఒక్కో బ్యాలెట్ యూనిట్పై 16 మంది అభ్యర్థుల గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరంగల్ నియోజకవర్గం పరిధిలో మూడేసి బ్యాలెట్ యూనిట్లు, మహబూబాబాద్ పరిధిలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.’
వరంగల్లో 42.. మహబూబాబాద్లో 23 మంది పోటీ
‘నోటాతో కలిపి ఒక్కో బ్యాలెట్ యూనిట్పై 16 మంది అభ్యర్థుల గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరంగల్ నియోజకవర్గం పరిధిలో మూడేసి బ్యాలెట్ యూనిట్లు, మహబూబాబాద్ పరిధిలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.’
లోక్సభ ఎన్నికల్లో నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులెవరో తేలిపోయింది. వరంగల్లో 42, మహబూబాబాద్లో 23 మంది పోటీ చేయనున్నారు. ఈనెల 18 నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ మొదలవగా.. 25 వరకు సమర్పణకు అవకాశం కల్పించారు. 26న నామపత్రాల పరిశీలన అనంతరం అనర్హులను తొలగించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు విధించారు. వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో చాలా తక్కువ మంది ఉపసంహరించుకున్నారు. బరిలో నిలిచిన స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు పూర్తిచేశారు. గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయస్థాయి పార్టీలకు ఇప్పటికే కేటాయించిన గుర్తులతో బరిలో కొనసాగనున్నారు.
వరంగల్లో అభ్యర్థులకు గుర్తులను ప్రకటిస్తున్న రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య, చిత్రంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్
వరంగల్ కలెక్టరేట్, మహబూబాబాద్, న్యూస్టుడే: నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు ఎవరో లెక్కతేలడంతో.. మంగళవారం నుంచి ప్రచారం జోరందుకోనుంది. మే 11 వరకు ఎండలతో పాటు నాయకుల పరస్పర మాటల యుద్ధాలతో రాజకీయ వేడీ రాజుకోనుంది. గుర్తింపు పొందిన ప్రాంతీయ, జాతీయస్థాయి పార్టీలకు ఇప్పటికే కేటాయించిన గుర్తులతో బరిలో దిగనున్నారు. ఎన్నికల బరిలో బీఎస్పీ అభ్యర్థులు ఉన్నారు. వరంగల్ నుంచి కల్పన పంజా, మహబూబాబాద్ నుంచి కోనేటి సుజాత పోటీ చేస్తున్నారు. ×
నిబంధనల మేరకే గుర్తుల కేటాయింపు..
ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల మేరకే స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ సమక్షంలో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. ఎన్నికల సంఘం గుర్తించని, రిజిస్టర్ అవని పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు తెలుగు అక్షరమాల ప్రామాణికంగా అభ్యర్థులకు గుర్తులు కేటాయించామన్నారు. ఒకే గుర్తును ప్రతిపాదించిన ఇద్దరు అభ్యర్థులకు లాటరీ విధానాన్ని అనుసరించి గుర్తులు ఇచ్చామన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం సూచించిన గుర్తులను కేటాయించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో శ్రీనివాస్, ఏఆర్వోలు అశ్వినీ తానాజీ, రాధిక గుప్తా, పియూష్ కుమార్, డీఎస్ వెంకన్న, రోహిత్సింగ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీళ్లు మారరు వసూళ్ల పర్వం ఆపరు!
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్లోని అనేక మండలాల పరిధిలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది వసూళ్ల పర్వంలో మునిగితేలుతున్నారు. ప్రజలు వీరికి ఆమ్యామ్యాలు చెల్లించలేక చివరకు అవినీతి నిరోధక శాఖ (అనిశా)ను ఆశ్రయిస్తున్నారు. -
ఆరోపణలు.. విచారణలు!
[ 21-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం 14వ ఉప కులపతిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించిన సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. -
స్థిరాస్తి వ్యాపారానికి ఛార్జీల పెంపు గుబులు
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషను ఛార్జీల పెంపుపై కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో భూమి విలువ పెంచితే అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. -
సోదరులను బలిగొన్న రోడ్డు ప్రమాదం
[ 21-05-2024]
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. -
900 గ్రాముల మత్తు మందు పట్టివేత
[ 21-05-2024]
హశిష్ (గంజాయి ఆకులతో తయారు చేసినది) మత్తుమందు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
పనులు త్వరగా పూర్తి చేయండి
[ 21-05-2024]
నగరానికి ముంపు తప్పాలంటే వరదనీరు సాఫీగా వెళ్లేలా చూడాలని, నాలాల్లో పూడికతీత పనులు తొందరగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులు, గుత్తేదారులకు సూచించారు. -
విద్యావంతున్ని గెలిపించండి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడు భారాస వైపు, నయవంచకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ప్రభుత్వ ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. -
జాడలేని వేసవి క్రీడా శిబిరాలు..!
[ 21-05-2024]
సెలవుల్లో చిన్నారులను క్రీడల వైపు మళ్లించడానికి తల్లిదండ్రులు తొలి ప్రయత్నంగా వేసవి శిబిరాలను ఎంచుకుంటారు. సంవత్సరం పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థుల్లో క్రీడాశిబిరాలు నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. -
ఆటోడ్రైవర్లకు సీఎన్జీ కష్టాలు
[ 21-05-2024]
పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించి పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో సీఎన్జీ, విద్యుత్తు వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సీఎన్జీ కిలో ధర.. లీటరు పెట్రోల్ ధరకంటే రూ.17 తక్కువగా ఉండటం, మైలేజీ ఎక్కువగా రావడం వల్ల ఆటోడ్రైవర్లు ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. -
ఖాళీ స్థలాలు.. సమస్యలకు నిలయాలు
[ 21-05-2024]
జనావాసాల్లో ఖాళీ స్థలాలు మురికి నీటితో కుంటలుగా మారి, కంపు కొడుతున్నాయి. యజమానుల నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. -
నిధులున్నా.. నీరుగారిన నిర్వహణ
[ 21-05-2024]
జిల్లాకు సాగునీరందే ఏకైక సాగునీటి కాలువ ఎస్సారెస్పీ డీబీఎం 38.. రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, గణపురం మండలాల మీదుగా ఉప కాల్వలు ఉన్నాయి. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సన్నద్ధం
[ 21-05-2024]
జిల్లాలో ఇంకా ఎన్నికల వాతావరణం కొనసాగుతూనే ఉంది. వారం రోజుల కిందట లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఈనెల 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణకు సందడి ప్రారంభమైంది. -
ఉపాధి కూలీలకు సౌకర్యాలు తప్పనిసరి
[ 21-05-2024]
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచే విధంగా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
-
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ
-
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు