కొత్తగూడ ఏజెన్సీకి గోదావరి జలాలు
పాకాల నుంచి గోదావరి జలాలను కొత్తగూడ ఏజెన్సీకి తరలించి రెండు పంటలు సాగయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
కొత్తగూడలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్, పార్టీ నాయకులు
కొత్తగూడ, గంగారం, న్యూస్టుడే: పాకాల నుంచి గోదావరి జలాలను కొత్తగూడ ఏజెన్సీకి తరలించి రెండు పంటలు సాగయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. సోమవారం కొత్తగూడ, గంగారం మండలకేంద్రాల్లో జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార సమావేశంలో ఆమె మాట్లాడారు. పదేళ్ల భారాస కొత్తగూడ ఏజెన్సీకి గోదావరి నీళ్లు తరలించకుండా అధికారం కోల్పోయిన తర్వాత తెస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే కొత్తగూడకు గోదావరి నీళ్ల తరలింపుపై సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారాస నేతలు చేస్తున్న కుట్రలను విశ్వసించొద్దని కోరారు. రాజ్యాంగం మార్చేందుకు భాజపా కుట్ర పన్నుతోందన్నారు. బలరాంనాయక్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా శ్రమించాలని గంగారంలో కార్యకర్తలు, నేతలను కోరారు. ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ మాట్లాడుతూ ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పోడు భూములకు శాశ్వత పట్టాలిచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందన్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన పలువురికి కండువాలను కప్పి ఆహ్వానించారు. అంతకు ముందు గుంజేడు ముసలమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించిన సీతక్క భారీ ద్విచక్రవాహనాల ర్యాలీతో సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్ఛార్జి అనిల్కుమార్, ఎంపీపీ బానోతు విజయ, జడ్పీటీసీ సభ్యురాలు పుష్పలత, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, చల్లా నారాయణరెడ్డి, మధుసూదన్రెడ్డి, రూప్సింగ్, మొగిలి, కారోజు రమేశ్, నూనావతు రాధాబాయి, వెంకన్న, శ్రీను, సర్పంచులు వెంకటలక్ష్మి, రణధీర్, రాజేశ్వర్, తదితరులున్నారు. మంత్రి సీతక్క గంగారం మండలంలో తిరుమలగండి, మడగూడెం, గంగారం, కాటినాగారం, పెద్దఎల్లాపురం, పందెం గ్రామాల్లో పర్యటించారు. గంగారం ఎంపీపీ సువర్ణ పాక సరోజన, జడ్పీటీసీ సభ్యురాలు రమ తదితరలున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడుల బాగు పనులిక చకచకా..!
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది. -
పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..
[ 19-05-2024]
‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు. -
నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి
[ 19-05-2024]
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ప్రేమేందర్రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం
[ 19-05-2024]
సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు -
కేయూ ప్రతిష్ఠకు మరకలు
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు -
భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు..!
[ 19-05-2024]
భారాస, కాంగ్రెస్ డీఎన్ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. -
వైభవంగా వసంతోత్సవం
[ 19-05-2024]
శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. -
కదిలిన అధికార యంత్రాంగం
[ 19-05-2024]
అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు -
‘ఆదర్శం’ కొంతే.. పోలింగ్ అంతంతే!
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. -
గ్రూపు-1 పరీక్షకు 14 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. -
ఈఏపీ సెట్లో తొమ్మిదో ర్యాంకు
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.