పోస్టల్ బ్యాలెట్ ఓటు.. తిరస్కరణకు తావివ్వొద్దు
ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బంది, సైనికులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లనివి 1445..
భూపాలపల్లిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు వరుసలో నిల్చొన్న ఉద్యోగులు
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బంది, సైనికులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఓటు వేసే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తిరస్కరణకు గురవుతున్నాయి.
అధికారుల చర్యలు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల దరఖాస్తు పత్రాలను నేరుగా సేకరించి జిల్లాలకు పంపించారు. దీంతో ఉద్యోగులు, వివిధ సర్వీసుల వారు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఈసారి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది ఫారం 12 పత్రాలను సేకరించి ఎపిక్ కార్డుతో సహా వివరాలను వైబ్సైట్లో పొందుపర్చారు. సదరు ఉద్యోగి ఎక్కడ ఓటు వేయడానికి ఎంపిక చేసుకున్నారో ఆ డేటా అంతా ఆన్లైన్లో కనిపించేలా ఏర్పాట్లు చేశారు.
ఓటు వేసేటప్పుడు పొరపాట్లు జరగకుండా సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. డిక్లరేషన్ సమయంలో ఇబ్బందులు కలగకుండా గెజిటెడ్ అధికారులను అందుబాటులో ఉంచుతున్నారు. ఈనెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.
నర్సంపేటలో అత్యధికం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1445 తిరస్కరణకు గురయ్యాయి. నర్సంపేట నియోజకవర్గంలో అత్యధికంగా 278 ఉన్నాయి. సరిగా ఓటు వేయకపోవడం, సంతకాలు చేయకపోవడం, తదితర కారణాలతో ఇవి చెల్లకుండా పోయాయి.
ఒకరికే టిక్ చేయాలి..
పోస్టల్ బ్యాలెట్ వేసేవారికి ఫారం 12 ఇస్తారు. ఇందులో 13ఎ, 13బి, 13సి, 13డి కవర్లు ఉంటాయి. 13ఎ కవర్లో డిక్లరేషన్ ఫారంపై తప్పకుండా సంతకం చేయాలి. బ్యాలెట్ నెంబరు, సీరియల్ నెంబరు వేయాలి. 13బి కవర్లో బ్యాలెట్ పేపర్ ఉంటుంది. అభ్యర్థుల పేర్లు, పార్టీల పేర్లు మాత్రమే ఉంటాయి. వాటి ఎదురుగా పెన్నుతో రైట్ గుర్తు పెట్టాలి. ఒకరి ఎదురుగా మాత్రమే టిక్ పెట్టాలి. ఒకరి కంటే ఎక్కువ మందికి టిక్ చేస్తే తిరస్కరణకు గురవుతుంది. ఏ అభ్యర్థికి లేదా నోటాకు టిక్ పెట్టకున్నా తిరస్కరిస్తారు.
- పూర్తిచేసిన 13ఎ, 13బి కవర్లను 13సి కవర్లో పెట్టాలి. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పెట్టెలో వేయాలి లేదా సంబంధిత అధికారులకు తపాలా ద్వారా పంపించాలి. 13డి కవర్లో సూచనలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడుల బాగు పనులిక చకచకా..!
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది. -
పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..
[ 19-05-2024]
‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు. -
నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి
[ 19-05-2024]
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ప్రేమేందర్రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం
[ 19-05-2024]
సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు -
కేయూ ప్రతిష్ఠకు మరకలు
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు -
భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు..!
[ 19-05-2024]
భారాస, కాంగ్రెస్ డీఎన్ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. -
వైభవంగా వసంతోత్సవం
[ 19-05-2024]
శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. -
కదిలిన అధికార యంత్రాంగం
[ 19-05-2024]
అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు -
‘ఆదర్శం’ కొంతే.. పోలింగ్ అంతంతే!
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. -
గ్రూపు-1 పరీక్షకు 14 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. -
ఈఏపీ సెట్లో తొమ్మిదో ర్యాంకు
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్