ఎంపీ ల్యాడ్స్ కేటాయింపు ఇలా..
దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి.. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మీకు తెలుసా?
దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి.. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.. లోక్సభ నియోజకవర్గాల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ (లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్) కింద ఏటా రూ.5 కోట్ల చొప్పున మంజూరవుతాయి. ఏడాదికి రెండు పర్యాయాలు రూ.2.5 కోట్ల చొప్పున విడుదల చేస్తారు. ఐదేళ్లలో ఏటా రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఎంపీ ల్యాడ్స్ నిధులు వస్తాయి. మొదటి ఏడాదిలో ఖర్చు చేయకుంటే రెండో ఏడాది వినియోగించవచ్చు. నిధుల్లో కనీసం 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ ఆవాస ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేటాయించాలి. ఈ పథకం 1993లో ప్రారంభమైంది. ఇది కేంద్ర ముఖ్య ప్రణాళికా మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటుంది.
ఎంపీలు ప్రాధాన్యక్రమంలో తమ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్తు, ఆరోగ్యం, క్రీడలు, పారిశుద్ధ్యం, రోడ్లు, వంతెనలు, వ్యవసాయం, తదితర అభివృద్ధి పనులను ఆయన సిఫారసులు చేయవచ్చు. కలెక్టర్ పాలనాపరమైన అనుమతులిస్తారు. పనులు పూర్తయ్యాక గుత్తేదారుకు నిధులను చెల్లిస్తారు. నిబంధనలకు లోబడి నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పని వివరాలను ఆ ప్రదేశం వద్ద ప్రదర్శించాలి. ఎంపీ పేరు, ఖర్చు చేసిన నిధులు, చేపట్టిన సంవత్సరం వివరాలను నమోదు చేయాలి.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు