నన్ను జైల్లోనే చంపాలని చూశారు
జగన్మోహన్రెడ్డి చేస్తున్న తప్పులను ఎత్తి చూపినందుకు తనను జైల్లోనే చంపాలని చూశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీ రఘురామ కృష్ణరాజు
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్టుడే: జగన్మోహన్రెడ్డి చేస్తున్న తప్పులను ఎత్తి చూపినందుకు తనను జైల్లోనే చంపాలని చూశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. సాయంత్రం రాజమహేంద్రవరంలో అభిమానులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయికలో మాట్లాడారు. ‘‘నా పుట్టిన రోజే అరెస్టు చేసి తీసుకెళ్లారు. అదే చనిపోయిన రోజుగా భావించాను. పోలీసు కస్టడీలో ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించి చిత్రహింసలకు గురిచేశారు. తెల్లకాగితంపై సంతకం చేయాలని వాదనకు దిగారు. తహసీల్దారు, రెవెన్యూ అధికారులు పేపరుపై సంతకాలు చేయాలని హింసించారు. సంతకం పెడితేనే పంపిస్తామని, లేదంటే ఇక్కడే చంపేస్తామని బెదిరించారు. కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో నోరువిప్పితే ఇక అంతే సంగతులని భయపెట్టారు. కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మీడియాను కూడా అనుమతించలేదు. కొంతమంది చొరవ తీసుకొని నా కాళ్లను ఫొటోలు తీసి పత్రికల్లో వేశారు. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జగన్ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారు. అది తప్పని వాదించాను. దాంతో నాపై కక్ష పెట్టుకొని హింసించారు. ప్రభుత్వ పనుల్లో కమీషన్ల కోసం కక్కుర్తి పడుతుంటే సరికాదని చెప్పాను. అమరావతి రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లామని.. ఇప్పుడు మార్చడం తగదని చెప్పినా జగన్ మనస్తత్వం మారలేదు. అలాంటి వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు’ అని రఘురామ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక రేవుల్లో నిద్దరోతున్న నిఘా!
[ 16-06-2024]
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఏలూరు జిల్లాలో కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఇతర జిల్లా అధికారులు, పశ్చిమలో మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇసుక రేవుల పర్యవేక్షణకు వచ్చారు -
చెర వీడుతోంది.. పోలవరం ప్రాజెక్టు పరిసరాలు శుభ్రం
[ 16-06-2024]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టులో 2016 నుంచి 2019 వరకు ఆవిష్కరించిన శిలాఫలకాలకు మెరుగులు అద్దే పనుల్లో జల వనరుల శాఖాధికారులు నిమగ్నం అయ్యారు. -
నాన్న మాట.. గెలుపు బాట!
[ 16-06-2024]
భీమవరం అర్బన్, కలిదిండి, ఉంగుటూరు, న్యూస్టుడే: బిడ్డను తనకంటే ఎత్తున నిలిపేందుకు జీవితాంతం పోరాడే అలుపెరుగని యోధుడు నాన్న. -
జన హితం..సంక్షేమ సంతకం
[ 16-06-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్ల మొత్తం పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పింఛన్ల పెంపు దస్త్రంపై మూడో సంతకం చేశారు. -
పెనుగాలుల బీభత్సం
[ 16-06-2024]
పోలవరం ప్రాంతంలో శనివారం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. జాతీయ రహదారిపై ప్రగడపల్లి, పట్టిసీమ గ్రామాల వద్ద చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
బుక్కెడు బువ్వకు భరోసా!
[ 16-06-2024]
అన్నార్తులు, పేదల క్షుద్బాధ తీరనుంది. మూడు పూటలా కడుపు నిండా ఆహారం అందనుంది. వైకాపా పాలనలో మూతపడిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
పేదలకు మరింత చేయూత
[ 16-06-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే సామాజిక పింఛన్ల సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దస్త్రంపై సంతకం చేశారు. -
8న మాధవాయపాలెం ఫెర్రీ రేవు వేలం
[ 16-06-2024]
నరసాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలాల పరిధిలోని మాధవాయపాలెం ఫెర్రీ రేవు వేలం నిర్వహణకు సంయుక్త కార్యాచరణ కమిటీ నిర్ణయం తీసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల
-
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
-
నొక్కేద్దాం.. దొరికితే చూద్దాం.. జేబులు నింపేసుకున్న ఇంటి దొంగలు
-
అమాత్యుల ‘కొండ’పి.. నేతలకు అడ్డాగా గడ్డ