సొమ్ములు రాక.. పెట్టుబడి లేక
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి కాలేదు. మరోపక్క ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్ము జమకాకపోవడంతో రబీ సాగుకు పెట్టుబడి లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
44 శాతం రైతులకు అందని ధాన్యం డబ్బు
ఉండిలో ఒక మిల్లులో నిల్వ చేసిన ధాన్యం బస్తాలు
భీమవరం వ్యవసాయ విభాగం, న్యూస్టుడే: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి కాలేదు. మరోపక్క ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్ము జమకాకపోవడంతో రబీ సాగుకు పెట్టుబడి లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
నిర్ణీత లక్ష్యంలో 71.63 శాతం ధాన్యాన్నే అధికారికంగా సేకరించగలిగారు. మిగిలిన 28.37 శాతం పంట రైతుల వద్దే ఉందని యంత్రాంగం చెబుతోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే కొంత మినహా ధాన్యమంతా సాగుదారుల నుంచి వ్యాపారుల వద్దకు చేరినట్లు స్పష్టమవుతోంది. విక్రయించిన ధాన్యం సొమ్ము తమ బ్యాంకు ఖాతాల్లో పడలేదంటూ కొనుగోలు కేంద్రాల చుట్టూ రైతులు నిత్యం తిరుగుతూనే ఉన్నారు.
జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగైంది. గత నవంబరులో అధిక వర్షాల కారణంగా దిగుబడులు బాగా తగ్గిపోయాయి. డెల్టాలో పంట కాలువలు, డ్రెయిన్లకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి 20-25 బస్తాల దిగుబడి కూడా గగనమైపోయింది. మరోవైపు నీటి లభ్యత తగ్గిపోతుండటంతో రబీ పనులు వెనువెంటనే చేపట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి దశలో ఒడ్డుకు చేరిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువ, గింజలో నాణ్యతా లోపాలు తదితర సమస్యలు ఎదురైన ప్రాంతాల్లో పంటను కల్లాల్లోనే వ్యాపారులకు విక్రయించినట్లు రైతులు చెబుతున్నారు. దిగుబడి బాగున్నచోట సైతం సాగు కోసం పెట్టుబడి పెట్టిన వ్యాపారులకే ధాన్యాన్ని అప్పగించారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లోనే పంట విక్రయించుకోవాలని అధికారికంగా సూచించారు. ఆన్లైన్లో నమోదు ప్రక్రియ అంతా ఈ కేంద్రాల్లోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. పంట మాత్రం కేటాయించిన మిల్లులకు లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో నేరుగా చేరుతోంది.
ఇదీ పరిస్థితి.. ధాన్యం విక్రయించిన 21 రోజులకు సంబంధిత రైతు ఖాతాల్లో నగదు జమ అవుతోందని అధికారులు చెబుతున్నారు. కానీ 30- 40 రోజుల దాటిపోయినా నగదు జమకాలేదని పలువురు సాగుదారులు వాపోతున్నారు. ఆన్లైన్లో సాంకేతిక సమస్యల వల్ల మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదని ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీరో బ్యాలెన్స్ ఖాతాలు కొన్నిచోట్ల వినియోగంలో లేకపోవడం, ఆధార్ అనుసంధానం చేయకపోవడం, ఫోన్ నెంబరు లింకేజీ కాకపోవడం తదితర సాంకేతిక సమస్యలు రైతులకు శాపాలుగా మారుతున్నాయని చెబుతున్నారు. వీటిని సరిదిద్దుకుంటే తప్ప సొమ్ము పడని పరిస్థితి. మరోపక్క రబీ నాట్లు పూర్తి చేసి వెనువెంటనే ఎరువులు చల్లాల్సిన దశలో కొత్త పెట్టుబడుల కోసం అన్నదాతలు అనేక పాట్లు పడుతున్నారు. పంట విక్రయించిన రైతుల్లో దాదాపు 44 శాతం మంది సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు.
సాంకేతిక లోపాలే కారణం
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయి. పంట విక్రయించిన 21 రోజుల తర్వాత రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతోంది. బ్యాంకు ఖాతాల నిర్వహణ సరిగా లేనిచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని సరిచేసుకోవాలని రైతులకు తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారం వరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయి. ఈ లోపే లక్ష్యం మేర కొనుగోళ్లు పూర్తిచేస్తాం.- దాసి రాజు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.