logo

జిల్లా యువకుడికి అరుదైన అవకాశం

‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవం’లో భాగంగా ఈ నెల 3న దిల్లీలోని పార్లమెంట్‌ హాలులో జాతీయ నాయకులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉమ్మడి జిల్లాకు చెందిన (భీమవరం) బి.సన్నీరాజ్‌కు దక్కింది.

Published : 02 Dec 2022 05:53 IST

బి.సన్నీరాజ్‌

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవం’లో భాగంగా ఈ నెల 3న దిల్లీలోని పార్లమెంట్‌ హాలులో జాతీయ నాయకులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉమ్మడి జిల్లాకు చెందిన (భీమవరం) బి.సన్నీరాజ్‌కు దక్కింది. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజన పార్లమెంట్‌ ఉత్సవంలో సన్నీరాజ్‌ విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడ ప్రతిభ కనబరచడంతో ఆంధ్రప్రదేశ్‌ తరఫున కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించిందని జిల్లా యువజన అధికారి డి.కిషోర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు