logo

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్యాయత్నం

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలోని జంగంగూడెంలో చోటుచేసుకుంది.

Published : 05 Dec 2022 04:52 IST

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలోని జంగంగూడెంలో చోటుచేసుకుంది. నూజివీడు గ్రామీణ ఎస్సై టి.రామకృష్ణ కథనం మేరకు.. గ్రామానికి చెందిన పొట్లూరి కిశోర్‌కు.. రెడ్డిగూడేనికి చెందిన మహిళతో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కిశోర్‌ మద్యానికి బానిసవడంతో భార్య మూడు నెలల కిందట పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందిన అతడు శనివారం రాత్రి మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. బాధితుడ్ని చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామీణ సీఐ అంకబాబు వివరాలు సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని