అప్పుల భారంతో భార్యాభర్తల ఆత్మహత్య
నూరేళ్లు కలిసి జీవిస్తామని ప్రమాణం చేసుకుని, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెంలో మంగళవారం సాయంత్రం జరిగింది.
నాగబాబు, అనూష(పాతచిత్రం)
ముదినేపల్లి, న్యూస్టుడే: నూరేళ్లు కలిసి జీవిస్తామని ప్రమాణం చేసుకుని, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెంలో మంగళవారం సాయంత్రం జరిగింది. అప్పులు యమపాశంగా మారి వారి జీవితాలను అర్ధంతరంగా ముగిసేలా చేశాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పరసా మాతనాగబాబు(30)కు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన అనూష(28)కు 2015లో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో పైకప్పునకు రెండు చీరలతో ఉరేసుకుని మృతిచెందారు. పక్క ఇంట్లో నివాసముంటున్న నాగబాబు తల్లి వెంకటరమణ కూలిపనికి వెళ్లి వచ్చి మంగళవారం సాయంత్రం మినప్పప్పు కోసం వెళ్లి చూడగా భార్యాభర్తలు వేలాడుతూ కనిపించారు. స్థానికులు ఆసుపత్రికి తరలించడానికి యత్నించగా అప్పటికే మృతి చెందారు. పాఠశాలనుంచి వచ్చేసరికి విగతజీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసిన ఆ చిన్నారులు కంటనీరు పెట్టడం చూపరులను కలచివేసింది. కైకలూరు రూరల్ సీˆఐ కృష్ణకుమార్, ఎస్ఐ వెంకట్కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.
రొయ్యలసాగుతో నష్టాలు
నాగబాబు గ్రామంలోనే రొయ్యలు సాగు చేశారు. ఈ ఏడాది జూన్తో చెరువు లీజు పూర్తవగా సుమారు రూ.10 లక్షల మేర అప్పులపాలయ్యారు. దీంతో భార్య నగలు సైతం తాకట్టు పెట్టారు. తండ్రి కొంత అప్పు తీర్చినా ఇంకా ఉంది. రొయ్యల సాగుతో నష్టపోయిన నాగబాబు, దానిని విరమించుకొని సింగరాయపాలెంలోని ప్రైవేటు పరిశ్రమలో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నారు. మరో పక్క మూడు నెలల క్రితం భార్యతో ఇంటి వద్దే సోడా బండి పెట్టించారు.
మా మీద మాకు అసహ్యం పుట్టి..
‘అమ్మా, నాన్నా క్షమించండి, మాకు బతకడం ఇష్టం లేదు. అప్పు తీర్చాక చనిపోదాం అనుకున్నాం. మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం. పిల్లలు జాగ్రత్త. మా ఇద్దరి కిడ్నీలు ఎవరికైనా పనికొస్తే ఇవ్వండి.హెల్ప్ అవుతుంది’ అంటూ వారు రాసిన ఉత్తరం గదిలో దొరికింది. మా వల్ల ఎవరూ గొడవ పడకండి, మా అంతట మేమే చనిపోతున్నాం. ఎవరి మీదా కోపంతో కాదు.. అని అందులో వివరించారు. బంధువులకు ఇవ్వాల్సిన రూ.5 వేల బాకీ, బీరువాలో ఉన్న రూ.50 వేల సొమ్ము, మూడు నెలల్లో పూర్తవుతున్న బండి ఈఎంఐ, బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము తదితరాల గురించి ఆ లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాల మీదకొచ్చినా స్పందించరా?
[ 17-05-2024]
ఏజెన్సీలో అతిసారం విజృంభిస్తోంది. కలుషిత నీరు గిరిపుత్రుల ప్రాణాలు తోడేస్తోంది. కుక్కునూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గుక్కెడు తాగునీటికి నోచుకోక చెలమల్లోని మురికి నీరు తాగుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవటమే ఈ మరణాలకు కారణమైంది. -
ఆగని అరాచకపర్వం
[ 17-05-2024]
పోలింగ్ నాడు వైకాపా మూకలు చేసిన విధ్వంసకాండ..వారు గత అయిదేళ్లుగా చేస్తున్న అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచింది. పచ్చని పశ్చిమలో నెత్తుటి ఛాయలు చూపించింది. ఓటమి భయం ఆవరించటంతో తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడటమే లక్ష్యంగా పని చేశారు. -
కలిసి రాని కొబ్బరి!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో 55 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. పెదవేగి, యలమంచిలి మండలాలు కొబ్బరిసాగులో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యానంలో పెద్దపంటగా భావించే కొబ్బరిలో తెగుళ్ల బెడద తీవ్రస్థాయికి చేరింది. -
తేమ పేరుతో కోత
[ 17-05-2024]
ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు. -
ఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఈఏపీ సెట్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉదయం జరిగిన అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షకు మొత్తం 175 మంది హాజరు -
పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ ?
[ 17-05-2024]
ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 118 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 66 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వచ్చాక వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. -
అర్ధరాత్రి ఇసుక దందా
[ 17-05-2024]
అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. -
నెత్తురోడిన రహదారులు
[ 17-05-2024]
ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని రహదారులు గురువారం రక్తమోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. -
కొప్పులవారిగూడెం ఘటనపై పోలీసుల అత్యుత్సాహం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో(ఈ నెల 13న) పెదవేగి మండలం కొప్పులవారి గూడెంలో జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. -
లారీ ఢీకొని తల్లి మృతి.. ప్రాణాపాయ స్థితిలో కుమార్తె
[ 17-05-2024]
లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన దుర్ఘటన గురువారం ఉదయం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!