logo

విప్లవ ధ్రువతార అల్లూరి

విప్లవ ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు ధ్రువతార అని పలువురు వక్తలు కొనియాడారు.

Published : 08 May 2024 05:50 IST

సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద జోహార్లు అర్పిస్తున్న ఆంధ్ర, తెలంగాణ క్షత్రియ పరిషత్తు ప్రతినిధులు
భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: విప్లవ ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు ధ్రువతార అని పలువురు వక్తలు కొనియాడారు. సీతారామరాజు 100వ వర్ధంతి కార్యక్రమాన్ని భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో మంగళవారం ఉదయం నిర్వహించారు. క్షత్రియ సేవాసమితి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు, ప్రధాన కార్యదర్శి నడింపల్లి నానిరాజు మాట్లాడుతూ అల్లూరి లాంటి విప్లవ యోధుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రమన్నారు. అనంతరం సీతారామరాజుకు విప్లవ జోహార్లు అర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు