జగన్ గారడీ..బీఎల్వోలకు బురిడీ!
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా వృద్ధులు మృతిచెందితే వారి ఓట్లు తొలగించేలా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్వోలను సీఎం జగన్ బురిడీ కొట్టించారు.
మూడేళ్లుగా గౌరవ వేతనం ఇవ్వని ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో రూ. 9.61 కోట్ల బకాయిలు
ఎన్నికల విధుల్లో బీఎల్వోలు
పాలకొల్లు, న్యూస్టుడే: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా వృద్ధులు మృతిచెందితే వారి ఓట్లు తొలగించేలా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్వోలను సీఎం జగన్ బురిడీ కొట్టించారు. మూడేళ్లుగా వారికివ్వాల్సిన గౌరవ వేతనానికి గండి కొట్టారు. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్నా బీఎల్వోలకు ఇవ్వాల్సిన సొమ్ములపై పెదవి మెదపడం లేదు. చిరుద్యోగులుగా ఉన్న ఉమ్మడి జిల్లాలోని 3,204 మంది బీఎల్వోల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కాళ్లరిగేలా తిరిగి...
ఎన్నికల విధుల్లో ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల వేళ ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే వరకు బీఎల్వోలే క్షేత్రస్థాయిలో కీలకం. ఫారం 6, ఫారం 7 సవరణలు మొదలుకుని తుది ఓటర్ల జాబితా తయారయ్యే వరకూ బీఎల్వోలు ఇంటింటికీ కాళ్లరిగేలా తిరగడం అందరికీ తెలిసిందే. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ ప్రతిచోటా కనిష్ఠంగా 169, గరిష్ఠంగా 286 మంది బీఎల్వోలు విధులు నిర్వర్తిస్తున్నారు.
రూ. 12 వేలు ఇస్తామని...
రెవెన్యూశాఖలో వీఆర్ఏలుగా గ్రామ సచివాలయాల్లో ఇంజినీరింగ్ సహాయకులుగా పనిచేసే సిబ్బందిని బీఎల్వోలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇలా పనిచేయడానికి ఏడాదికి రూ.6 వేలు గౌరవ వేతనం, రూ.వెయ్యి భత్యం ఇస్తామని 2022లో ప్రకటించారు. ఎన్నికల ఏడాది సమీపించాక పనిభారం పెరగడంతో గౌరవ వేతనం రూ.12వేలుగా పెంచినట్లు చెప్పారు. నియమావళి అమల్లోకి వచ్చాక కూడా బీఎల్వోలకు కనీసం స్టేషనరీ ఇచ్చిన పాపాన పోలేదు. గత జనవరి నుంచి ఒక్క స్టేషనరీకే రూ.5 వేలు వెచ్చించామని బీఎల్వోలు వాపోతున్నారు. వీటిలో దేనికీ పైసా విడుదల చేయకపోవడం ఆవేదనకు దారితీస్తుంది. మూడేళ్లుగా ఒక్కొక్కరూ పెట్టిన ఖర్చులు కలుపుకొని రూ.30 వేలకు పైబడి రావాలని బీఎల్వోలు చెబుతున్నారు.
కమిషనర్ను కలిసినా...
బీఎల్వోల దుస్థితిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను స్వయంగా కలిసి విన్నవించినా స్పందన రాలేదని వీఆర్వోల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ‘న్యూస్టుడే’తో వాపోయారు. గౌరవ వేతనాలు విడుదల చేయక ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చులను విడుదల చేయక క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియడం లేదన్నారు. మరో రెండు రోజుల్లో జరగబోయే ఎన్నికలకు నిర్వహణ సిబ్బంది ఒకరోజు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. కానీ ఇంతవరకు వారికి కల్పించే భోజన సదుపాయం గూర్చిగాని పోలింగ్ కేంద్రాల దగ్గర వేయాల్సిన షామియానా పందిళ్లు గూర్చిగాని ఎటువంటి ఆదేశాలు ఇప్పటివరకు వెలువడకపోవడం కొసమెరుపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్