గ్రావెల్ తరలింపుపై వైకాపా శ్రేణుల రగడ
సీఎం జగన్ ఇలాకా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో గ్రావెల్ తరలింపు విషయమై వైకాపాలో రగడ చోటు చేసుకుంది. తనకు ఇచ్చిన డీకేటీ భూమిలో యంత్రాలతో మట్టిని తరలించకూడదంటూ వైకాపా కార్యకర్త కొమ్మద్ది ఓబులేసు ఎంపీˆటీసీˆ సభ్యురాలు భారతిని అడ్డుకున్నారు.
ఎంపీటీసీ సభ్యురాలిని అడ్డుకున్న కార్యకర్త
వాగ్వాదానికి దిగిన వైకాపా ఎంపీˆటీసీˆ సభ్యురాలు భారతి, కార్యకర్త ఓబులేసు
వేంపల్లె, న్యూస్టుడే : సీఎం జగన్ ఇలాకా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో గ్రావెల్ తరలింపు విషయమై వైకాపాలో రగడ చోటు చేసుకుంది. తనకు ఇచ్చిన డీకేటీ భూమిలో యంత్రాలతో మట్టిని తరలించకూడదంటూ వైకాపా కార్యకర్త కొమ్మద్ది ఓబులేసు ఎంపీˆటీసీˆ సభ్యురాలు భారతిని అడ్డుకున్నారు. ఈ విషయం పోలీస్స్టేషన్ వరకు చేరింది. స్థానిక పామలూరు రోడ్డులోని 207వ సర్వే నంబర్లో బుధవారం వైకాపా ఎంపీˆటీసీˆ సభ్యురాలు భారతి జేసీˆబీ యంత్రం, ట్రాక్టర్లతో గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక దళితవాడకు చెందిన వైకాపా కార్యకర్త ఓబులేసు ఈ సర్వే నంబర్లో తనకు ప్రభుత్వం 1.06 సెట్ల భూమి కేటాయించి డీకేటీ పట్టా ఇచ్చిందంటూ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. తనకు ఇచ్చిన ప్రభుత్వ భూమిలో మీరెలా మట్టిని తవ్వుతారని ప్రశ్నించారు. తానూ అధికార పార్టీకి చెందిన వాడినేనని ఆమెను నిలదీశారు. అయితే తనకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఈ ప్రాంతంలోనే గ్రావెల్ తరలింపునకు లీజుకు ఇచ్చారని, ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి మట్టిని తరలిస్తున్నానని ఎంపీˆటీసీˆ సభ్యురాలు వాదించారు. ఈ విషయమై ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఎన్ని ఎకరాలైనా లీజుకు తీసుకున్నా తన భూమిలో మట్టిని తరలించేందుకు వీలు లేదని ఓబులేసు తేల్చి చెప్పారు. మట్టిని తరలింపు వాహనాలను వెనక్కి పంపారు. ఈ విషయమై పట్టణ సీˆఐ చాంద్బాషాకు సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రావెల్ తరలించే ప్రాంతం ఎవరిదో మైనింగ్, రెవెన్యూ అధికారుల వద్ద తేల్చుకోవాలని సూచిస్తూ ఇరువురిని అక్కడి నుంచి పంపించారు. గ్రావెల్ తరలించే అంశంపై వైకాపా వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్రెడ్డి
[ 15-06-2024]
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. -
పేదలకు పట్టెడన్నం!
[ 15-06-2024]
పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలు, భవన నిర్మాణ కార్మికులు, తోపుడుబండ్ల వర్తకులు, యాచకులకు మూడు పూటలా నాణ్యమైన ఆహారం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో 2018, జూన్ 11న అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. -
చంద్రబాబుకు రుణపడి ఉంటా!
[ 15-06-2024]
రాజకీయ పునర్జన్మనిచ్చిన తెదేపా అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి జీవితాంతం రుణపడి ఉంటానని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. -
చేనేత.... కష్టాల కలబోత!
[ 15-06-2024]
ప్రొద్దుటూరు కేంద్రంగా నైపుణ్యం, పనితనం గల చేనేత కార్మికులు రెండో రకమైన సిల్క్ యార్న్, ప్లేజర్ (వార్పు) ముడి సరకుల మిశ్రమంతో తయారు చేస్తున్న డూపియాన్ పట్టు వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. -
కబ్జాదారులను వదిలిపెట్టం
[ 15-06-2024]
‘కడప నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసినవారు ఎంతటివారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బుగ్గవంకపై రెండు వంతెనలకు టెండర్ల ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. -
పేర్లు మార్చేసి... భూములు కొట్టేసి!
[ 15-06-2024]
ఖాళీ భూముల్లో అక్రమార్కులు వాలిపోయారు. భూ యజమానులు అందుబాటులో లేకపోవడంతో నకిలీ వపత్రాలు సృష్టించి వారి పేరిట మార్చేసుకున్నారు. -
నిధుల్లేక.. నీళ్లు పారక..!
[ 15-06-2024]
ఉమ్మడి కడప జిల్లాలో చిన్ననీటిపారుదల శాఖలో చెరువుల అభివృద్ధికి నిధులు కరవయ్యాయి. గతేడాది వర్షాభావం వలన నీళ్లు కనిపించడం లేదు. -
వేంపల్లె సీఐపై డీజీపీకి ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ఫిర్యాదు
[ 15-06-2024]
తమ నాయకులను, కార్యకర్తలను వేంపల్లె సీఐ చాంద్బాషా వేధిస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి డీజీపీకి శుక్రవారం విజయవాడలో ఫిర్యాదు చేశారు. -
అదృశ్యమైన వ్యక్తి శవమయ్యాడు
[ 15-06-2024]
లక్కిరెడ్డిపల్లె మండలం పాలెంగొల్లపల్లె పంచాయతీ బురుజుపల్లెకు చెందిన చిన్నకొండు సుదర్శనబాబు (34) అనే వ్యక్తి గత నెల 27వ తేదీన గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి స్థానికులతో కలిసి వెళ్లి అదృశ్యమై శుక్రవారం శవమై తేలాడు. -
తొలి ఐదు సంతకాలను కాంగ్రెస్ స్వాగతిస్తోంది: తులసిరెడ్డి
[ 15-06-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీల అమలుపై తొలి ఐదు సంతకాల చేయడాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని పీసీసీ మీడియా సెల్ ఛైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. -
ఉపాధ్యాయుల సర్దుబాటుకు వినతి
[ 15-06-2024]
మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉందని, మిగులు ఉపాధ్యాయులను పాఠశాలలకు సర్దుబాటు చేయాలని యూటీఎఫ్, ఎస్టీయూ నాయకులు శుక్రవారం డీఈఓ శివప్రకాష్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. -
జంతువుల అక్రమ రవాణాపై సమాచారమివ్వండి
[ 15-06-2024]
జిల్లాలో ఎక్కడైనా జంతువుల అక్రమ రవాణా జరుగుతుంటే 08562-294446 నంబరుకు ఫోన్చేసి తెలపాలని జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ్ కౌశల్ ఒక ప్రకటనలో తెలిపారు. -
విజిలెన్సు అధికారుల తనిఖీ
[ 15-06-2024]
చాపాడు మండలం కుచ్చుపాప వద్ద చేపల చెరువులకు అక్రమంగా విద్యుత్తు వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై విజిలెన్సు అధికారులు విచారణ చేపట్టారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి బయటకు కేట్ మిడిల్టన్.. క్యాన్సర్ చికిత్సపై భావోద్వేగ పోస్టు..!
-
భాజపాదీ ‘రిక్షా’ పరిస్థితే.. అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది: ఉద్ధవ్ ఠాక్రే
-
రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని విమాన సర్వీసులు: ఎంపీ బాలశౌరి
-
త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. కార్యకర్తల రుణం తీర్చుకుంటా: చంద్రబాబు
-
కోడెలపై పెట్టిన కేసు జగన్ మీద కూడా పెట్టొచ్చు కదా!: శివరాం
-
‘కోహ్లీ అలా చేస్తే రిషభ్ పంత్ సంతోషిస్తాడు’