ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు
జూన్ నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: జూన్ నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లో బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రమైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ ప్రాంగణంలో 112 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 చొప్పున ఈవీఎం బళ్లలు, పోస్టల్బ్యాలెట్కు 14 బళ్లలను ఏర్పాటు చేశామన్నారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి 20 రౌండ్లు, కడప-21, పులివెందుల- 22, కమలాపురం- 23, ప్రొద్దుటూరు-20, మైదుకూరు- 20, జమ్మలమడుగుకు 23 రౌండ్లు ఏర్పాటు చేశామన్నారు. సిబ్బందికి మూడు దఫాలుగా ర్యాండమైజేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు మొదలవుతుందని, కేంద్రంలో అభ్యర్థి లేదా కౌంటింగ్ ఏజెంటు మాత్రమే ఉంటారని, ఇతరరులెవ్వరికీ చోటు లేదన్నారు. జూన్ ఆరో తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్చంద్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలపై ‘రామ’బాణం సంధించాలి!
[ 16-06-2024]
వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల పరిధిలో చేపట్టిన కాలేటివాగు ప్రాజెక్టుతోపాటు కురబలకోట మండలం ముదివేడు జలాశయం నిర్మాణపనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాల్సి ఉంది. -
కడపలో నటి నిధి అగర్వాల్ సందడి
[ 16-06-2024]
కడప నగరంలో శనివారం సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన జోస్ ఆలుక్కాస్ బంగారు ఆభరణాల షోరూంను ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవితో కలిసి ప్రారంభించారు. -
సరఫరా... అరకొర!
[ 16-06-2024]
వేసవి సెలవుల అనంతరం ఈ నెల 13న బడి గంట మోగింది. అదే రోజు విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. -
కబ్జాలపై ఉక్కుపాదం మోపండి!
[ 16-06-2024]
వైకాపా విధ్వంసకర పాలనకు చరమగీతం పాడిన తెదేపా, జనసేన, భాజపా కూటమిపై జిల్లా ప్రజానీకం.. ప్రత్యేకించి జగన్ సర్కారు బాధితులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది వైకాపా నేతలు ఊరూవాడ భూములను కాజేశారు. -
ఇసుక తరలింపుపై వైకాపా నాయకుల గొడవ... దాడికి యత్నం
[ 16-06-2024]
ఇసుక తరలింపుపై ప్రొద్దుటూరులో వైకాపా ముఖ్య నేతల అనుచరులు పెన్నా నదిలో దాడులకు పాల్పడుతున్నారు. తమ ఏరియాలో తాము మాత్రమే ఇసుకను తరలించాలని ఇతరులు వస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. -
మంత్రి మండిపల్లి రాకతో పులకించిన రాయచోటి
[ 16-06-2024]
రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్రెడ్డి రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శనివారం రాయచోటికి వచ్చారు. -
పీలేరు... అక్రమాల జోరు!
[ 16-06-2024]
నియోజకవర్గ కేంద్రం పీలేరు విద్య, వ్యాపార రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్టుగానే పంచాయతీకి ఆదాయం సమకూరుతోంది. అధికారం తమదేనని, అడిగేవారు లేరని గత వైకాపా ప్రభుత్వ హయాంలో పాలక వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!