ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
రాష్ట్రంలోని అరాచక పాలనను చూసిన ప్రజలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు కావాలని కోరుకుంటున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్రెడ్డి, హరిప్రసాద్, జడ్పీ మాజీ వైస్ఛైర్మన్ లక్ష్మీరెడ్డి పేర్కొన్నారు.
కడప నగరంలో కేకు కోస్తున్న తెదేపా నేతలు గోవర్ధన్రెడ్డి, హరిప్రసాద్ తదితరులు
అరవిందనగర్ (కడప), న్యూస్టుడే : రాష్ట్రంలోని అరాచక పాలనను చూసిన ప్రజలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు కావాలని కోరుకుంటున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్రెడ్డి, హరిప్రసాద్, జడ్పీ మాజీ వైస్ఛైర్మన్ లక్ష్మీరెడ్డి పేర్కొన్నారు. తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం కడప నగరంలోని ఎన్టీఆర్ కూడలిలో గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో 41 కిలోల కేకును కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నారన్నారు. సంబరాల్లో నాయకులు శివకొండారెడ్డి, మన్మోహన్రెడ్డి, ఉమాదేవి, జనార్దన్, పీరయ్య, రాంప్రసాద్, నాగరాజు, మీనాక్షి, స్వర్ణ, నిర్మల, మాలిన్బీ, కళావతి, సునీత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!