ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు.
- జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ లక్ష్యం పూర్తి చేశారో లేదో తెలుసుకునే బాధ్యతను కిందిస్థాయి నాయకులకు అప్పగించారు. వారు అనుకూలంగా చెబితేనే పార్టీలో గుర్తింపు ఉంటుంది. లేదా మరొకరికి అవకాశం వస్తుందని చెప్పడం ఆయా వార్డు బాధ్యులకు మింగుడు పడటం లేదు.
- జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి మెప్పు పొందేందుకు.. ఇతర నాయకులు, కార్యకర్తలు, ఇటీవల పార్టీలో చేరిన వారి గురించి నిత్యం చెడుగా చెబుతున్నారు. అదే నిజమంటూ ఆయన నమ్మడం వారికి ఇబ్బందిగా మారింది. అనర్గళంగా మాట్లాడుతున్నాడని, ఒక్క ఓటు కూడా వేయించలేని వ్యక్తి చెప్పే మాటలను పట్టించుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు.
- జిల్లాలోని మరో నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందిన వారిలోనే అంతర్గతంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. పార్టీలో చేరామా..? లేదా ఒక వ్యక్తికి బానిసగా మారామా..? అనే సందిగ్ధం నెలకొంది. పట్టుబట్టి కండువా వేసుకునే వరకు వెంటపడ్డారు. ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలువురు పేరుపొందిన నాయకులే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం కనిపిస్తోంది.
- ఇటీవల ఓ కాలనీకి చెందిన సమస్యతో పలువురు జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధిని సంప్రదించేందుకు వెళ్లగా వారికి చేదు అనుభవం ఎదురైనట్లు తెలిసింది. మీ ప్రాంతం నుంచి సహకారం ఏ మాత్రం లేదని, మరోసారి అనుకూలంగా వ్యవహరిస్తే పరిష్కార దిశగా ఆలోచన చేస్తామనడం వారిని కంగుతినిపించినట్లు సమాచారం. గెలిచిన తర్వాత తన పరిధిలో అభివృద్ధి బాధ్యత ఆయా వ్యక్తికే ఉంటుంది. కానీ ఒక్కో చోటును విడదీస్తూ పాలన కొనసాగించడం విడ్డూరంగా ఉందంటూ తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
మంచిర్యాల సిటీ, న్యూస్టుడే: జిల్లాలో కొత్తగా మారిన రాజకీయ పరిణామాలతో ప్రధాన పార్టీల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాత కొత్త నేతలు, కార్యకర్తల మధ్య వైరుధ్యాలు పొడసూపుతున్నాయి. కొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తపరిస్తే మరికొందరు లోలోపల మదనపడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది సొంతలాభం కోసం పార్టీ వీడి అధికారపక్షం వైపు అడుగులు వేశారు. మరికొందరు తమ వార్డుల పరిధిలో అభివృద్ధి కోసమని చేరారు. చేరినా అంతగా ప్రయోజనం లేనట్టే కనిపిస్తోంది. ఒక్కసారి కూడా వార్డు సభ్యుడిగా గెలవని వ్యక్తులు.. అనేక సార్లు ప్రజాతీర్పులో విజయం సాధించిన వారిపై పెత్తనం చూపించడం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆ ఇద్దరినీ ప్రసన్నం చేసుకోవడమే పని..
జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి దగ్గర ఉన్న ఓ ఇద్దరు వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడమే ప్రస్తుతం ఆ పార్టీ సీనియర్, జూనియర్ నాయకులు పనిగా పెట్టుకున్నట్లు సమాచారం. వారిని కాదని ప్రవర్తిస్తే.. అట్టడుగుకు వెళ్లాల్సిందే. ప్రస్తుతం పార్టీలో కొత్తగా చేరినా.. పాతవారు అయినా ముందుగా ఆ ఇద్దరి అనుమతితోనే ముందుకెళ్లాలి. వీరు పాస్ మార్కులు ఇస్తేనే ప్రస్తుత పదవికి ఎలాంటి ఆటంకం లేకపోవడంతోపాటు భవిష్యత్తులో అనుకున్న పదవి వస్తుందనే ఆశతో, మెప్పుకోసం కొంతమంది అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. స్థాయిని మరిచి ప్రవర్తించడం తమతో కాదంటూ మరికొందరు పార్టీకే దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాలతోనే పార్టీకి, ఆ ప్రజాప్రతినిధికి నష్టం కలుగుతుందనే అభిప్రాయాలు జిల్లావ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తా
[ 13-06-2024]
జిల్లాలో వైద్యరంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ గోడం నగేష్ పేర్కొన్నారు. -
ఫీజులో 50శాతం రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి
[ 13-06-2024]
ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే జర్నలిస్టు విద్యార్థులకు ఫీజులో 50శాతం రాయితీ ఇవ్వాలని జర్నలిస్టు జేఏసీ ప్రతినిధులు కోరారు. -
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
[ 13-06-2024]
ఖుర్షీద్ నగర్ కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. -
మంత్రి పదవి కోసం మంత్రాంగం
[ 13-06-2024]
సార్వత్రిక, శాసనసభ ఎన్నికలు ముగియడంతో రేవంత్ సర్కారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పరిస్థితిని ఆరా తీస్తోంది. తప్పకుండా విజయం సాధిస్తామనుకున్న ఎంపీ సీటు ఓడిపోవడానికి దారితీసిన కారణాలను అన్వేషిస్తోంది. పార్టీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. -
నిధులు నామమాత్రం.. సేవలు భారం
[ 13-06-2024]
ఇక్కడ కనిపిస్తున్నది ఉట్నూరు గ్రామీణ మండలం హస్నాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఆసుపత్రిలో సక్రమంగా మూత్రశాలలు, తాగునీటి సరఫరా, కిటికీలకు తలుపులు లేక వైద్యం కోసం వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రసవాలకు సంబంధించిన భవనం వర్షం పడితే ఊరుస్తుండటంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలి
[ 13-06-2024]
వివిధ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ ఇన్ఛార్జి ఛైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్యేలు హరీశ్బాబు, కోవ లక్ష్మి, పాలనాధికారి వెంకటేష్ దోత్రే, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా, అదనపు పాలనాధికారులు దీపక్తివారీ, వేణు పాల్గొన్నారు. -
విత్తనంపై డీలర్ల పెత్తనం!
[ 13-06-2024]
విత్తనాల అమ్మకాలపై ప్రభుత్వం నిబంధనలు విధించింది. చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ కూడా చేసింది. ఈ నేపథ్యంలో విత్తనాల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా లైసెన్సులు రద్దు చేస్తామని జిల్లాస్థాయి పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు సైతం విస్తృతంగా దుకాణాలను తనిఖీ చేయడం, డీలర్లకు సూచనలు జారీ చేశారు. -
ప్రజల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు
[ 13-06-2024]
జిల్లాలో వరదలు సంభవించినప్పుడు ప్రజలను రక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్, రామగుండం సీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. -
హరిత లక్ష్యం 20 లక్షల మొక్కలు
[ 13-06-2024]
జిల్లాలో హరితహారం లక్ష్యం ఖరారైంది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 20లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 311 పంచాయతీల్లో నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన హరితహారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ కొనసాగిస్తోంది. -
అస్తవ్యస్తంగా బల్దియా నిర్వహణ
[ 13-06-2024]
పట్టణ ప్రగతిలో పురపాలక సంఘం పాత్ర కీలకం. పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి తోడ్పాటునివ్వాలి. కానీ, నిర్మల్లో మాత్రం ఇది అస్తవ్యస్తంగా మారింది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. -
మోగింది బడిగంట
[ 13-06-2024]
జిల్లాలో బడిగంట మోగింది. సెలవులకు టాటా చెబుతూ విద్యార్థులు బుధవారం బడిబాట పట్టారు. ఉదయం స్వాగత తోరణాలు కట్టి.. ముగ్గులు వేశారు. -
సహజహితం.. వారి అభిమతం
[ 13-06-2024]
సొంత ఊరి కోసం ఏదైనా చేయాలనే తపనతో రూ.లక్షలు విలువ చేసే భూములను విరాళంగా ఇచ్చారు. పుట్టిన ఊరిని విడిచి పెట్టి ఏళ్లు గడిచినా సొంత ఊరిపై మమకారం మాత్రం తగ్గలేదు. సమాజ హితం కోసం ప్రజల అవసరాలు తీర్చే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
ఆటలు పాటలు చదువులు!
[ 13-06-2024]
‘బాల్యం అమూల్యం’ అన్న పెద్దల మాటలను గుర్తించిన ఐటీడీఏ అధికారులు చిన్న పిల్లల విలువైన బాల్యాన్ని సరైన మార్గంలో పెట్టడంపై దృష్టి సారించారు. ప్రత్యేకంగా వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేసి పిల్లలు బడికి కష్టంగా కాకుండా ఇష్టంగా వెళ్లేలా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఉపాధ్యాయుడి దారుణ హత్య
[ 13-06-2024]
పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఓ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది హత్య చేసిన ఘటన గాదిగూడ మండలంలో చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని ఉట్నూరు డీఎస్పీ నాగేందర్, సీఐ రహీంపాషాలు పరిశీలించి వివరాలు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతాం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
భారత కంపెనీల ‘బ్రాండ్’ బాజా.. టాప్ 100లో ఈ నాలుగింటికి చోటు
-
మాది ప్రజా ప్రభుత్వం.. ప్రచార ప్రభుత్వం కాదు: తెదేపా ఎంపీ కలిశెట్టి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వర్చువల్ క్రెడిట్ కార్డ్ గురించి ఈ విషయాలు తెలుసా?
-
విరాట్.. కాస్త ఓర్పు ప్రదర్శించు చాలు: గావస్కర్