మంత్రా.. మజాకా
ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సుమారు ఏడాది కిందట రూ. 12 కోట్ల వ్యయంతో మహామండపం, అమ్మవారి ప్రధానాలయం నిర్మాణ పనులు చేపట్టారు.
పూర్తికాని భవనాలకు హడావుడి ప్రారంభోత్సవాలు..
లోవలో మహామండపాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
తుని గ్రామీణం: ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సుమారు ఏడాది కిందట రూ. 12 కోట్ల వ్యయంతో మహామండపం, అమ్మవారి ప్రధానాలయం నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కాకుండానే దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం అట్టహాసంగా ప్రారంభించేశారు. దేవస్థానంలో సుమారు రూ.2 కోట్ల వ్యయతో అమ్మవారి ఆలయాన్ని కృష్ణశిలతో నిర్మిస్తున్నారు. ఆలయంపై పనులు పూర్తికాక పోవడంతోపాటు తలుపులు ఏర్పాటు చేయలేదు. రూ. 6 కోట్ల మహామండపం నిర్మాణ పనులు కేవలం 70 శాతమే పూర్తయ్యాయి. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎస్క్లేటర్లకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని నెలల్లో వీటన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం బాలాలయంలో భక్తులకు దర్శనం కల్పించామని ఉగాది నాటికి ప్రధానాలయంలో అమ్మవారి దర్శనం భక్తులకు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈవో విశ్వనాథ]రాజు తెలిపారు. దేవస్థానం ఛైర్మన్ గొర్లి అచ్చియ్యనాయుడు బొంగు ఉమారావు, మార్కెట్యార్డు ఛైర్మన్ బాబు పాల్గొన్నారు.
నిర్మాణ దశలో మహామండపం
అన్నవరం: అన్నవరం జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సత్యదేవుని నమూనా ఆలయం ప్రాంగణంలో ప్రసాదం కౌంటర్ నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం ప్రారంభించేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన కొద్ది గంటల ముందు హడావుడిగా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంగణంలో నమూనా ఆలయం, దుకాణ సముదాయం, ప్రసాదం కౌంటర్ పనులు ఏవీ ఇంకా పూర్తి కాలేదనేది విదితమే. పిల్లర్లపై స్లాబు వేసి ఇంకా నిర్మాణంకాని ఈ భవనంలో అల్యూమినియం కౌంటర్ పెట్టి రిబ్బన్ కత్తిరించారు. స్టెయిన్లెస్ స్టీల్ ట్యాబ్లెట్ స్టోన్ పెట్టి.. దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈవో కె.రామచంద్రమోహన్లతో కలిసి మంత్రి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి సత్యదేవుని దర్శించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్ నిధులతో చేపట్టబోయే నిత్యాన్నదాన భవనం నిర్మాణానికి టెంకాయ కొట్టారు. కేంద్ర నిధులతో చేపట్టబోయే ఈ పనులకు ఈనెల 7న ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అవే పనులకు భూమిపూజ పేరిట టెంకాయకొట్టారంతే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
[ 20-05-2024]
తాళ్లపూడి మండలంలో సోమవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలుల తీవ్రతకు విద్యుత్తు సరఫరాలో అంతరాయమేర్పడింది. -
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా