వీధుల్లో చీకట్లు.. వైకాపా తెచ్చిన ఇక్కట్లు
వైకాపా పాలనలో నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అటకెక్కించారు. అరకొర వెలుగులతో పలుచోట్ల అంధకారం అలముకుంటోంది. విద్యుత్తు వినియోగం ఆదా చేసే ప్రక్రియలో భాగంగా ఎల్ఈడీ దీపాల విధానం ఆచరణలోకి తీసుకువచ్చారు.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలు
వైకాపా పాలనలో నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ అటకెక్కించారు. అరకొర వెలుగులతో పలుచోట్ల అంధకారం అలముకుంటోంది. విద్యుత్తు వినియోగం ఆదా చేసే ప్రక్రియలో భాగంగా ఎల్ఈడీ దీపాల విధానం ఆచరణలోకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వాటి నిర్వహణ పట్టించుకోక ఖర్చు పెరుగుతుందే తప్ప వెలుగులు కనిపించడం లేదు. గుత్తేదారు సంస్థ గడువు తీరిపోవడంతో ఆ భారం పురపాలికలపై పడుతోంది.
గతంలో ఇలా..
వీధి దీపాల నిర్వహణకు ఎనర్జీ ఎఫిషిఎన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సంస్థతో ఏడేళ్ల పాటు గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. కేవలం విద్యుత్తు వినియోగం 40 శాతం ఆదా చేయవచ్చనే విధానంలో ఎల్ఈడీ బల్బులకు అవకాశం కల్పించారు. వీధి దీపాల నిర్వహణ మొత్తం సంబంధిత సంస్థ చేపట్టాలి. విద్యుత్తు దీపాల నిర్వహణ, పాడైన స్థానంలో కొత్తవి మార్చడం, సిబ్బంది నియామకం అన్నీ కంపెనీ భరించాల్సి ఉంటుంది. అందుకు గాను పురపాలికలు ప్రతినెలా ఒప్పందం ప్రకారం ధనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం ఈఈఎస్ఎల్ సంస్థ నిర్వహించగా.. మరికొన్ని దీపాల నిర్వహణ పురపాలికల ఆధీనంలోనే ఉండేది. పురపాలికల్లో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.
కారుచీకట్లు కమ్ముకున్న నిడదవోలు బస్టాండ్ నుంచి గాంధీనగర్కు వెళ్లు రహదారి
ప్రస్తుత పరిస్థితి..
ఒప్పందం పూర్తికావడంతో పురపాలికల్లోని వీధి దీపాల విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. పైగా ఎల్ఈడీ దీపాల మరమ్మతు అనేది సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నది. దీంతో సాధారణ ఎలక్ట్రీషియన్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండదు. ఆ స్థాయిలో నిపుణులైన సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.
ఒప్పందం ముగిసి..
సుమారు రెండు, మూడేళ్ల పాటు ఈ ప్రక్రియ సజావుగా సాగింది. ఆ తర్వాత నిర్వహణ ఖర్చును చెల్లించేందుకు పురపాలికలు వెనుకాడడంతో ఒప్పంద సంస్థ వెనక్కి తగ్గింది. మెల్లగా సిబ్బందిని తొలగించింది. దీంతో జిల్లాలో వీధుల్లో వెలుగులు మాయం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం 20, 40 వాట్స్ బల్బులతో సరిపెట్టేశారు. దీంతో బల్బు కాంతి పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా రాత్రిపూట
రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంపెనీ ఒప్పందం కూడా ముగిసిపోవడంతో సిబ్బందిని వెనక్కి తీసుకొంది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మొత్తం వీధి దీపాల భారం
పురపాలికలపై పడింది.
కొవ్వూరు మున్సిపల్ పార్కు నుంచి థియేటర్ల కూడలికి వెళ్లే దారి..
ఫిర్యాదులు వస్తున్నా..
సాధారణ రోజుల్లో విద్యుత్తు దీపాల విభాగానికి జిల్లావ్యాప్తంగా 300లకు పైగా ఫిర్యాదులు వస్తుంటాయి. వాటిని పరిష్కరించడంలో అశ్రద్ధ ఉంటోంది. ప్రధాన ప్రాంతాల్లో దీపాల మరమ్మతు కోసం క్రేన్లు వినియోగించాలి. వాటి కోసం వారం, పది రోజులు ఆగాల్సి వస్తోంది. వీధి దీపాల సమస్యల కోసం టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినా పలుచోట్ల సకాలంలో స్పందించడం లేదు. ఎల్ఈడీ దీపాలు మార్చేందుకు తగిన బడ్జెటు లేకపోవడంతో ఇబ్బందిగా మారుతోంది.
సిబ్బందికి చెప్పినా స్పందన కరవు
ఒక్కోసారి సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్ల వీధుల్లో అంధకారం ఏర్పడుతోంది. న్యూకాలనీ, వాసవీనగర్, సంగం కాలనీ, ఆనంద్ నగర్ వంటి ప్రాంతాల్లో రాత్రి పూట విద్యుత్తు దీపాలు సరిగా పనిచేయటం లేదు. గొల్లపుంత వంటి కొన్ని ప్రాంతాల్లో పగటి పూట కూడా ఆరకుండా వెలుగుతున్నాయి. అంధకారం నెలకొన్న ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంటోంది.
కొవ్వాడ అప్పన్నబాబు, మండపేట
అంతటా అంధకారమే..
రైల్వేస్టేషన్ నుంచి సత్యవతినగర్ శివారు వరకు, అనుసంధాన వీధుల్లో సగం కూడా వీధి దీపాలు వెలగడం లేదు. ఏదొక కారణం చెబుతున్నారు తప్ప ప్రయోజనం లేదు. రాత్రి 7 దాటితే వాహనాలకు ఉన్న, ఇళ్ల ముందు దీపాలే వెలుగుకు ఆధారం. ప్రమాదాలు జరగడంతో పాటు చోరీల బెడదతో భయపడుతున్నాం. అధికార యంత్రాంగం దృష్టి సారించాలి.
ఎం.రామచంద్రరావు, కొవ్వూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
[ 17-06-2024]
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. -
అమ్మకు కడుపుకోతే
[ 17-06-2024]
పురిటి నొప్పులు తట్టుకుని పండంటి బిడ్డను ప్రసవించడం మహిళకు మరో జన్మ. కాన్పు కష్టమైతే అనేక సమస్యలు. ప్రసవ ద్వారం చిన్నదిగా ఉన్నా, బిడ్డ అడ్డం తిరిగినా, గర్భసంచిలో తగినంత ఉమ్మనీరు లేకపోయినా, నెలలు నిండినా కాన్పయ్యే సూచనలు -
బడి బాటతో.. బంగారు లోకం
[ 17-06-2024]
భగవంతుడు కనుక ప్రత్యక్షమైతే... నా బాల్యాన్ని తిరిగి ఇవ్వమంటాను.. ఇదీ విశ్వకవి రవీంద్రుడి మాట. బాల్యం ప్రతి వ్యక్తి జీవితంలో మరపురాని జ్ఞాపకం. బంగారు లోకంలో విహరించాల్సిన వయస్సు. -
మట్టి కొండలు మాయం..
[ 17-06-2024]
అయిదేళ్ల కాలంలో మట్టి, ఇసుక, కొండలు, గుట్టలు అనే తేడా లేకుండా వైకాపా నాయకులు సహజ వనరులను కొల్లగొట్టారు. వారి ఆగడాలు భరించలేక ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. -
పోస్టుల భర్తీకి ప్రత్యేక శ్రద్ధ
[ 17-06-2024]
వైద్యుల భర్తీ, పూర్తిస్థాయిలో వైద్యసేవలు, మెరుగైన చికిత్స అందించే రీతిలో జిల్లాలోని ఆసుపత్రులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ ఎన్పీ పద్మశ్రీరాణి అన్నారు. -
కొత్త ప్రభుత్వంపై గుత్తేదారుల ఆశలు
[ 17-06-2024]
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంపై గుత్తేదారులు కోటి ఆశలు పెట్టుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ర.భ., పంచాయతీరాజ్శాఖల్లో సుమారు రూ.468 కోట్లు వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు చెల్లించాల్సి ఉంది. -
నిర్వహణ మరిచారా.. నిండా ముంచేస్తుంది..!
[ 17-06-2024]
ఇటీవల జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా కార్ల టైర్లు పేలి, పంక్చరై అదుపుతప్పుతున్నాయి. -
కాకినాడలో భారీ వర్షం.. అంధకారం
[ 17-06-2024]
కాకినాడ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రెండు గంటలకు పైగా జోరు వాన కురవడంతో ఎక్కడిక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. -
ఉప్పాడ జాంధానీ.. ఉపాధి కల్పించేనా..!
[ 17-06-2024]
ఉప్పాడ జాంధానీ ఊబిలోకి చేరింది.. నేత కార్మికుల బతుకు కష్టాలతో పరేషానీ అవుతోంది.. అయిదేళ్లుగా రాయితీలు అందకపోవడం, సరైన ప్రోత్సాహం కరవవడం.. వెరసి చేనేత కుటుంబాలు వలసెళ్లిపోవడం పరిపాటైంది.. -
నన్నయలో కొత్త కోర్సులు
[ 17-06-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో యువత ఉపాధి పొందేందుకు వీలు కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్తగా మూడు కోర్సులు ప్రవేశపెట్టారు. ఇందుకు గాను వివిధ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. -
పవన్కల్యాణ్తో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి: వర్మ
[ 17-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రిగా పవన్కల్యాణ్ ప్రమాణసీˆ్వకారం చేసిన నేపథ్యంలో రాష్ట్రం, పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. -
మహిళ దారుణ హత్య
[ 17-06-2024]
మహిళ దారుణ హత్యకు గురైన విషాద ఘటన కాకినాడ గ్రామీణ మండలం సూర్యారావుపేట ఫిషింగ్ హార్బర్లో ఆదివారం చోటుచేసుకుంది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ కోచ్ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నా.. నా కెరీర్ను మార్చింది ఆయనే: హర్మిత్ సింగ్
-
ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి!
-
రూ.5లక్షలు పెట్టి టికెట్ కొన్నా..: విమాన ప్రయాణికుడి అసహనం
-
‘ఫాదర్స్ డే’ రోజే తండ్రిని కోల్పోయిన నిక్కీ హేలీ
-
‘వార్ క్యాబినెట్ రద్దు’.. యుద్ధం వేళ నెతన్యాహు కీలక నిర్ణయం!
-
ఈసారి ఖైరతాబాద్ మహా గణపతి ఎత్తు ఎంతంటే..?