రాజధాని వద్దంటూ.. లోకల్ ఎలా అవుతారు?
‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు.
మాట్లాడుతున్న గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని, ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు తదితరులు
వట్టిచెరుకూరు, న్యూస్టుడే: ‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. వట్టిచెరుకూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్తిపాడు అభ్యర్థి బూర్ల రామాంజనేయులతో కలిసి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఈ ప్రాంతం రైతులకు నిలయం, రైతు బాంధవులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, యలమంచిలి శివాజీ, ఆచార్య ఎన్జీ రంగా లాంటి మహానుభావులు పుట్టి పెరిగిన గడ్డ అని అభివర్ణించారు. వారంతా రైతులు, వ్యవసాయం అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. నా చిన్నప్పుడు ఈ ప్రాంతంలో రైతులకు టమాటాలకు కిలోకి రూ. 2 మాత్రమే ధర దక్కేదని కొన్ని ప్రాంతాల్లో ఇదే ధరకు అమ్ముతూ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన పొలాలకు సంబంధించిన పాస్ పుస్తకాలు, ధ్రువపత్రాలు ప్రభుత్వం తీసుకుని నకలు కాపీలు మనకు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఇలా ఏ రాష్ట్రంలో కూడా లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చే వరకు భూములను రిజిస్ట్రేషన్ చేయెద్దని సూచించారు. ఎన్నికల అనంతరం మనం మళ్లీ ఇదే విధంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పారు. సీఎం జగన్ 123 సార్లు బటన్ నొక్కరని, ఆయన కూర్చీ దిగేందకు ప్రజలందరూ ఈ నెల 13న బటన్ నొక్కడానికి సిద్ధమయ్యారని వివరించారు.
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘనస్వాగతం
వట్టిచెరుకూరు మండలంలోని ప్రచారం నిర్వహించిన గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని, ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులకు ఘనస్వాగతం లభించింది. వింజనంపాడులో వారికి పొక్లెయిన్ సహాయంతో రెండు గజమాలలను వేశారు. చమళ్లమూడిలో ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా అభ్యర్థులు పూలమాలలు వేశారు. కాట్రపాడులో పూజలు చేశారు. నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, రవి దేవరాజ్, మన్నవ పూర్ణచంద్రరావు, ఎన్.నాగరాజు, జి.చింపిరయ్య, రామ్, సాంబశివరావు, హరిబాబు, గంగాధరరావు, కిరణ్కుమార్, మురళి, శ్రీనివాసరావు, సర్పంచులు రాజ్యలక్ష్మి, విజయ్కుమార్, శంకర్, వెంకటరావు, శివపార్వతి, ఎంపీటీసీలు కోటేశ్వరరావు, సుజాత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లాలో సగటు. 3.6 మి.మీ వర్షపాతం
[ 17-06-2024]
జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 3.6 మిల్లీ మీటర్లువర్షపాతం నమోదైంది. -
వీరు మారరంతే
[ 17-06-2024]
రాష్ట్రంలో వైకాపా పాలన పోయి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఇంకా కొందరు పోలీసులు వైకాపాకు అండగా నిలుస్తున్నారు. ఆ పార్టీ నాయకులపై అందే ఫిర్యాదులను తేలిగ్గా తీసుకుంటున్నారు. -
హక్కు పత్రాలకు ఎదురుచూపులు
[ 17-06-2024]
ఖరీఫ్ వ్యవసాయ పనుల సీజన్ ప్రారంభమైంది. దుక్కులు దున్నడం, పొలాలకు పశువుల ఎరువు తరలించడం, పంట వ్యర్థాలను శుభ్రం చేసుకోవడం తదితర పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. -
చేయి తడిపితేనే అనుమతులు లేకుంటే కొర్రీలు
[ 17-06-2024]
భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టణ ప్రణాళికాధికారులు కొందరు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. -
ప్రజలకు యువనేత భరోసా
[ 17-06-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ రెండోరోజు నిర్వహించిన ‘ప్రజా దర్బార్’కు ప్రజలు పోటెత్తారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం ఉదయం నియోజకవర్గ ప్రజలను కలసి సమస్యలను తెలుసుకున్నారు. -
21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు
[ 17-06-2024]
రానున్న 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు చేపడతున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. -
రూ.లక్షలు వ్యయం.. ఏం లాభం
[ 17-06-2024]
జీజీహెచ్లో అత్యవసర పరిస్థితుల్లో రోగులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన ఇనుప మెట్లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారాయి. -
కేటాయింపుల్లో కోత
[ 17-06-2024]
సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స అందించాలని ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. -
నగరపాలక సంస్థలో అవినీతిపై విచారణ జరిపించండి
[ 17-06-2024]
గుంటూరు నగరపాలక సంస్థలో గత అయిదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని నారెడ్కో అధ్యక్షుడు నాగవంశీ కోరారు. -
గుణాత్మక విద్యను దెబ్బతీసే జీవో రద్దు చేయాలి
[ 17-06-2024]
గుణాత్మక విద్యను దెబ్బతీసి ఉపాధ్యాయులపై పనిభారం పెంచుతూ గత ప్రభుత్వం తెచ్చిన జీవోనం.117ను రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
నారా లోకేశ్ ‘ప్రజా దర్బార్’ నేడు
[ 17-06-2024]
దేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉండవల్లి నివాసంలో జరిగే ‘ప్రజా దర్బార్’లో పాల్గొంటారు. -
మృత్యు మార్గాలు
[ 17-06-2024]
రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శిథిలావస్థ వంతెనలు, అధ్వాన రహదారులు, ప్రమాదకర మలుపులు, అతి వేగం, రోడ్డు నిర్మాణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. -
ఉద్యోగాల పేరుతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త
[ 17-06-2024]
తాత్కాలిక ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. -
చైనాలో పందిళ్లపల్లి కుర్రోడి సత్తా
[ 17-06-2024]
ఆ యువకుడి చిన్నతనంలో విధి వక్రీకరించింది... దీంతో కుడిచేయి మణికట్టు పై వరకు పోగొట్టుకున్నారు.. అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు.. -
మాతాశిశువులకు మేలు జరిగేనా?
[ 17-06-2024]
పల్నాడు జిల్లాలో 20 లక్షల మంది జనాభా. ఏటా 15వేల శిశు జననాలు.. అయినా మాతా శిశు సంరక్షణకు ప్రత్యేకంగా ప్రసూతి విభాగం లేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నామమాత్రపు సేవలకే పరిమితమయ్యాయి. -
చెత్తపన్ను నుంచి విముక్తి
[ 17-06-2024]
చెత్తపన్ను భారం నుంచి పట్టణాల ప్రజలకు విముక్తి లభించింది. వైకాపా పాలనలో గతంలో ఎన్నడూలేని విధంగా చెత్తపన్నును అమల్లోకి తెచ్చి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
[ 17-06-2024]
అద్దంకిలో మూడు దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సీఐ పి.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆదివారం అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచారు. -
సుద్దముక్కకు పైసల్లేవు
[ 17-06-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ నిర్వాహకంతో ప్రభుత్వ పాఠశాలల్లో సుద్దముక్కకు పైసలు అందుబాటులోలేని దుస్థితి ఏర్పడింది. రెండు విద్యా సంవత్సరాల్లో పాఠశాల నిర్వహణ గ్రాంట్ను ప్రభుత్వం మంజూరు చేయలేదు. -
బదిలీలపై ఉత్కంఠ
[ 17-06-2024]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో జిల్లా అధికారులతో పాటు డివిజన్, మండల స్థాయి అధికారుల బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. -
ఇద్దరి అపహరణ.. రక్షించిన పోలీసులు
[ 17-06-2024]
ఆర్థిక వివాదాల నేపథ్యంలో గచ్చిబౌలిలో కిడ్నాప్ గురైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు వికారాబాద్లో రక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు దర్శన్ వివాదాలకు కొత్తేమీ కాదు..!
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
-
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
-
మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్మెంట్ పేరుతో ₹81 లక్షలకు టోకరా!
-
భాజపా జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి
-
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!