‘జలకళ’లో జగన్ దగా
రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం చేపట్టాం. బోరుతో పాటు కేసింగ్పైపును కూడా ఇవ్వబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.2340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెబుతున్నాం.
బోర్ల పేరుతో రైతులకు మోసం
మోటార్లు, విద్యుత్తు కనెక్షన్లు లేక నిరుపయోగం
న్యూస్టుడే, వినుకొండ, వినుకొండ గ్రామీణ
రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం చేపట్టాం. బోరుతో పాటు కేసింగ్పైపును కూడా ఇవ్వబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.2340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెబుతున్నాం. చిన్న, సన్నకారు రైతులకు మాత్రం బోర్లతో పాటు మోటార్లు కూడా బిగిస్తున్నాం. -2020 సెప్టెంబరు 28న వైఎస్ఆర్ జలకళ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ చెప్పిన మాటలివి.
సీఎం మాటలు ఆచరణలో ఉత్తమాటలేనని తేలాయి. పథకంలో నమోదు చేసుకున్న అందరికీ బోర్లు వేయలేదు. వేసిన చోట మోటార్లు ఇవ్వలేదు. కరెంట్ కనెక్షన్లు ఏర్పాటు చేయకుండా కాలం వెళ్లబుచ్చారు. నూజండ్ల మండలం ముక్కెళ్లపాడుకు చెందిన సన్నకారు రైతు శివాజి హనుమంతరావు పొలంలో వైఎస్ఆర్ జలకళ పథకం కింద బోరు వేసి మూడేళ్లయింది. మోటారు, విద్యుత్తు కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా మారింది. పల్నాడు జిల్లాలో జలకళ లబ్ధిదారులందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు పదిశాతానికి మించి బోర్లు పనిచేయడం లేదంటే పథకం అమలు తీరు ఎలా ఉందో అర్థం చేసు కోవచ్చు.
మంజూరు ఇలా..
చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలని, బీడు భూములను సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం వైఎస్ఆర్ జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. 2020 సెప్టెంబరు 28న సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించారు. అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు ద్వారా సాగు నీరందించడమే లక్ష్యమని చెప్పారు. గ్రామ వాలంటీర్ల ద్వారా సచివాలయాల్లో రైతులు ఇచ్చిన దరఖాస్తులను వీఆర్వో పరిశీలించి డ్వామా ఏపీడీకి పంపిస్తారు. అక్కడి నుంచి భూగర్భ జల సర్వే కోసం జియాలజిస్టులకు చేరతాయి. నీటి లభ్యత ఉన్న వాటికి ఏపీడీ పరిపాలనా అనుమతి ఇస్తారు. తదుపరి బోరు వేసి మోటారుతోపాటు విద్యుత్తు కనెక్షన్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. పైసా ఖర్చు లేకుండా రైతుల భూములకు జలకళ తీసుకొస్తామని చెప్పారు.
నూజండ్లలో అంజయ్య పొలంలో నిరుపయోగంగా ఉన్న బోరు
దరఖాస్తులు 10వేలు.. విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చింది 116
పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో రైతుల నుంచి 10389 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత గ్రౌండ్ వాటర్ సర్వే విభాగం గుర్తించిన వాటిల్లో 3580 బోర్లకు అనుమతించారు. అందులో 1032 చోట్ల డ్రిల్లింగ్ పూర్తి చేశారు. ఇందులో మాచర్ల నియోజకవర్గంలో 594, వినుకొండ నియోజకవర్గంలో 200 ఉన్నాయి. గురజాల వంటి చోట్ల ఒక్కటీ లేదు. విద్యుత్తు కనెక్షన్లకు 818 బోర్లకు ప్రతిపాదన పంపితే విద్యుత్తుశాఖ 238కి మాత్రమే అనుమతించి జులై నాటికి కేవలం 116 మాత్రమే స్తంభాలు, లైన్లు పూర్తి చేశారు. వాటికి ప్రభుత్వం మోటార్లు ఇవ్వనందున అమర్చిన విద్యుత్తు పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. కొంతమంది రైతులు మాత్రం సొంత ఖర్చుతో పంప్సెట్లు అమర్చి వినియోగిస్తుండగా మరికొందరు అంత పెట్టుబడి పెట్టలేక బోర్లు ఖాళీగా వదిలేశారు. రిగ్ యజమానులకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో బోర్ల డ్రిల్లింగ్ చాలాకాలం క్రితమే ఆపేశారు.
ఉచిత బోర్లకు అందిన దరఖాస్తులు: 10168
నీరు పడిన బోర్లు : 974
విద్యుత్తు కనెక్షన్లు ఉన్నవి 116
కనెక్షన్ ఇవ్వలేదు
పొలంలో బోరు వేసి ఏళ్లు గడిచింది. ఇప్పటి వరకు విద్యుత్తు కనెక్షన్, మోటారు ఇవ్వలేదు. అధికా రులను అడిగితే రాలేదని సమా ధానం చెబుతున్నారు. సొంతంగా చేసుకోవాలంటే రూ.లక్ష ఖర్చు అవుతుంది. సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఉన్నందున కనెక్షన్ ఇస్తే బోరును వినియోగించుకుంటా.
రాగిపూడి అంజయ్య, నూజండ్ల
బోరు వేసి మోటారు ఇవ్వలేదు
జలకళ పథకం కింద పొలంలో బోరు వేసి ఇప్పటి వరకు విద్యుత్తు కనెక్షన్, మోటారు ఇవ్వలేదు. దీంతో బోరు నిరుపయోగంగా మారింది. నాలాగే చాలామందికి బోరు వేసి వదిలేశారు. అందరం విద్యుత్తు కనెక్షన్, మోటార్ల కోసం ఎదురు చూస్తున్నాం.
చిన్న భాస్కరరావు, అల్లిబాయిపాలెం, నూజండ్ల మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మాజీ మంత్రి రాజీనామా..
[ 17-06-2024]
వైకాపాకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్కు తన రాజీనామా లేఖను పంపారు -
జిల్లాలో సగటు. 3.6 మి.మీ వర్షపాతం
[ 17-06-2024]
జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 3.6 మిల్లీ మీటర్లువర్షపాతం నమోదైంది. -
వీరు మారరంతే
[ 17-06-2024]
రాష్ట్రంలో వైకాపా పాలన పోయి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఇంకా కొందరు పోలీసులు వైకాపాకు అండగా నిలుస్తున్నారు. ఆ పార్టీ నాయకులపై అందే ఫిర్యాదులను తేలిగ్గా తీసుకుంటున్నారు. -
హక్కు పత్రాలకు ఎదురుచూపులు
[ 17-06-2024]
ఖరీఫ్ వ్యవసాయ పనుల సీజన్ ప్రారంభమైంది. దుక్కులు దున్నడం, పొలాలకు పశువుల ఎరువు తరలించడం, పంట వ్యర్థాలను శుభ్రం చేసుకోవడం తదితర పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. -
చేయి తడిపితేనే అనుమతులు లేకుంటే కొర్రీలు
[ 17-06-2024]
భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టణ ప్రణాళికాధికారులు కొందరు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. -
ప్రజలకు యువనేత భరోసా
[ 17-06-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ రెండోరోజు నిర్వహించిన ‘ప్రజా దర్బార్’కు ప్రజలు పోటెత్తారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం ఉదయం నియోజకవర్గ ప్రజలను కలసి సమస్యలను తెలుసుకున్నారు. -
21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు
[ 17-06-2024]
రానున్న 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు చేపడతున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. -
రూ.లక్షలు వ్యయం.. ఏం లాభం
[ 17-06-2024]
జీజీహెచ్లో అత్యవసర పరిస్థితుల్లో రోగులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన ఇనుప మెట్లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారాయి. -
కేటాయింపుల్లో కోత
[ 17-06-2024]
సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స అందించాలని ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. -
నగరపాలక సంస్థలో అవినీతిపై విచారణ జరిపించండి
[ 17-06-2024]
గుంటూరు నగరపాలక సంస్థలో గత అయిదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని నారెడ్కో అధ్యక్షుడు నాగవంశీ కోరారు. -
గుణాత్మక విద్యను దెబ్బతీసే జీవో రద్దు చేయాలి
[ 17-06-2024]
గుణాత్మక విద్యను దెబ్బతీసి ఉపాధ్యాయులపై పనిభారం పెంచుతూ గత ప్రభుత్వం తెచ్చిన జీవోనం.117ను రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
నారా లోకేశ్ ‘ప్రజా దర్బార్’ నేడు
[ 17-06-2024]
దేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉండవల్లి నివాసంలో జరిగే ‘ప్రజా దర్బార్’లో పాల్గొంటారు. -
మృత్యు మార్గాలు
[ 17-06-2024]
రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శిథిలావస్థ వంతెనలు, అధ్వాన రహదారులు, ప్రమాదకర మలుపులు, అతి వేగం, రోడ్డు నిర్మాణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. -
ఉద్యోగాల పేరుతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త
[ 17-06-2024]
తాత్కాలిక ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. -
చైనాలో పందిళ్లపల్లి కుర్రోడి సత్తా
[ 17-06-2024]
ఆ యువకుడి చిన్నతనంలో విధి వక్రీకరించింది... దీంతో కుడిచేయి మణికట్టు పై వరకు పోగొట్టుకున్నారు.. అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు.. -
మాతాశిశువులకు మేలు జరిగేనా?
[ 17-06-2024]
పల్నాడు జిల్లాలో 20 లక్షల మంది జనాభా. ఏటా 15వేల శిశు జననాలు.. అయినా మాతా శిశు సంరక్షణకు ప్రత్యేకంగా ప్రసూతి విభాగం లేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నామమాత్రపు సేవలకే పరిమితమయ్యాయి. -
చెత్తపన్ను నుంచి విముక్తి
[ 17-06-2024]
చెత్తపన్ను భారం నుంచి పట్టణాల ప్రజలకు విముక్తి లభించింది. వైకాపా పాలనలో గతంలో ఎన్నడూలేని విధంగా చెత్తపన్నును అమల్లోకి తెచ్చి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
[ 17-06-2024]
అద్దంకిలో మూడు దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సీఐ పి.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆదివారం అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచారు. -
సుద్దముక్కకు పైసల్లేవు
[ 17-06-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ నిర్వాహకంతో ప్రభుత్వ పాఠశాలల్లో సుద్దముక్కకు పైసలు అందుబాటులోలేని దుస్థితి ఏర్పడింది. రెండు విద్యా సంవత్సరాల్లో పాఠశాల నిర్వహణ గ్రాంట్ను ప్రభుత్వం మంజూరు చేయలేదు. -
బదిలీలపై ఉత్కంఠ
[ 17-06-2024]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో జిల్లా అధికారులతో పాటు డివిజన్, మండల స్థాయి అధికారుల బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. -
ఇద్దరి అపహరణ.. రక్షించిన పోలీసులు
[ 17-06-2024]
ఆర్థిక వివాదాల నేపథ్యంలో గచ్చిబౌలిలో కిడ్నాప్ గురైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు వికారాబాద్లో రక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫాదర్స్ డే’ రోజే తండ్రిని కోల్పోయిన నిక్కీ హేలీ
-
‘వార్ క్యాబినెట్ రద్దు’.. యుద్ధం వేళ నెతన్యాహు కీలక నిర్ణయం!
-
ఈసారి ఖైరతాబాద్ మహా గణపతి ఎత్తు ఎంతంటే..?
-
స్టన్నింగ్ క్యాచ్.. మిస్సయితే తలకు గాయమయ్యేది!
-
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
-
బడ్జెట్లో ఆదాయపు పన్ను రేట్లలో మార్పులు..?