క్షణాల్లో మంటలు.. మిన్నంటిన హాహాకారాలు
ఖాజాగూడ చౌరస్తా సమీపంలోని హైమార్క్ ఛాంబర్ నాలుగంతస్తుల భవనంలో శనివారం ఉదయం 9.30-10 మధ్య జరిగిన అగ్నిప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది, అధికారులు స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. రెండో అంతస్తులో రేగిన మంటలు, పొగ నాలుగో అంతస్తుకు వ్యాపించడంతో అక్కడున్న ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాణాలు
ఖాజాగూడ చౌరస్తాలో నాలుగంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
టెర్రస్ పైకి ఎక్కిన 14 మందిని స్కైలిఫ్ట్ సాయంతో రక్షించిన సిబ్బంది
హైమార్క్ ఛాంబర్ భవనం నుంచి దట్టంగా వ్యాపించిన పొగ
ఈనాడు, హైదరాబాద్; న్యూస్టుడే, రాయదుర్గం, గౌతంనగర్: ఖాజాగూడ చౌరస్తా సమీపంలోని హైమార్క్ ఛాంబర్ నాలుగంతస్తుల భవనంలో శనివారం ఉదయం 9.30-10 మధ్య జరిగిన అగ్నిప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది, అధికారులు స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. రెండో అంతస్తులో రేగిన మంటలు, పొగ నాలుగో అంతస్తుకు వ్యాపించడంతో అక్కడున్న ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. భవనం పైభాగానికి చేరుకొని రక్షించండంటూ కేకలేశారు. రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. మాదాపూర్ అగ్నిమాపకశాఖ కార్యాలయానికి సమాచారం చేరవేశారు. ప్రాణాలు అరచేత పెట్టుకొని టెర్రస్పైకి ఎక్కిన 14 మందిని బ్రాంటో స్కైలిఫ్ట్ సాయంతో సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. అంబులెన్స్ల్లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్ ఏసీపీ రఘునందన్రావు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి(డీఎఫ్ఓ) శ్రీధర్రెడ్డి, రాయదుర్గం సీఐ తిరుపతి సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
తప్పిన పెనుముప్పు
హైమార్క్ ఛాంబర్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో గ్రీన్ బావర్చి హోటల్, మొదటి, మూడో అంతస్తులో ఐటీ సంస్థలున్నాయి. రెండు, నాలుగో అంతస్తుల్లో యాక్షన్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సెక్యూరిటీ సంస్థ కార్యాలయాలున్నాయి. శనివారం సాఫ్ట్వేర్ సంస్థలకు సెలవు కావడంతో మూసివున్నాయి. ఉదయం 10 గంటలకు రెండో అంతస్తులో విధులకు వచ్చిన యాక్షన్ గార్గింగ్ సర్వీసెస్ సంస్థకు చెందిన ఉద్యోగి సంతోష్తోపాటు మరో ఇద్దరు తాళాలు తీసి లోపలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా స్టోర్ రూమ్ నుంచి మంటలు రావటం గమనించారు. కార్యాలయంలోని పరికరాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. క్షణాల్లో మంటలు, పొగ మరింత వ్యాపించాయి. ఆందోళనకు గురైన ఇద్దరు కిందకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. మరో ఉద్యోగి 11 గంటల ప్రాంతంలో అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు.
తలుపులు బద్దలుకొట్టి..
నాలుగో అంతస్తులోని యాక్షన్ గార్డింగ్ సంస్థలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగినులతో సహా 14 మంది ఉన్నారు. భవనంపైకి దట్టమైన పొగలు వ్యాపించడంతో మెట్ల మార్గంలో కిందికి వచ్చే అవకాశం లేకపోయింది. ధైర్యం కూడదీసుకొని అందరూ టెర్రస్పైకి చేరుకోవాలనుకున్నారు. మార్గంలో తలుపులకు తాళాలు వేసి ఉండడంతో అద్దాలను బద్దలుకొట్టి పైకి చేరుకున్నారు. రక్షించమంటూ ఆర్తనాదాలు చేశారు. 11.10 గంటలకు మాదాపూర్ నుంచి రెండు అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. టెర్రస్ పైన ఉన్నవారికి సిబ్బంది ధైర్యం చెప్పారు. 11.30 గంటలకు బ్రాంటో స్కైలిఫ్ట్ చేరుకుని, డీఎఫ్ఓ శ్రీధర్రెడ్డి నేతృత్వంలో పైన ఉన్న వారిని 40 నిమిషాల్లో కిందికి దించారు. అంబులెన్స్ల్లో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి ప్రథమ చికిత్స అందించారు. 14 మందిని అరగంట సేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించి డిశ్ఛార్జి చేసినట్టు వైద్యులు తెలిపారు.
* సెక్యూరిటీ సంస్థలోని సిబ్బంది యూనిఫారాలు, షూస్, బెల్టులు తదితరాలు కాలిపోయాయి. ఫర్నిచర్ దగ్ధమైంది. సాఫ్ట్వేర్ సంస్థ కార్యాలయంలోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. 2 గంటలు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. జిల్లా అగ్నిమాకశాఖ అధికారి ఎస్.శ్రీధర్రెడ్డి, ఏడీఎఫ్వోలు గిరిధర్రెడ్డి, విజయ్కుమార్, ఎస్ఎఫ్ఓ బి.శ్రీనివాస్, టి.జగన్మోహన్ పర్యవేక్షించారు. వేగంగా స్పందించి బాధితులను కాపాడిన రాయదుర్గం పోలీసులను డీసీపీ కె.శిల్పవల్లి అభినందించారు.
బయటపడింది వీరే
కాంచమ్మ(ఖాజాగూడ), విజయ (మధురానగర్), సల్మాబేగం(అత్తాపూర్), మురాద్ కుమార్(యూపీ), రామారావు, శైలజ, షేక్సల్మా, వెంకట్ బాపిరాజు, వెంకటేశ్వర్రెడ్డి, టి.శేఖర్, తరుణ్ గోపి, చందన్, స్వర్ణరాజ్, మరో మహిళ ఉన్నారు.
భళా.. బాహుబలి స్కైలిఫ్ట్
ఐదంతస్తుల భవనంపై నుంచి కాపాడమంటూ హాహాకారాలు. లోపలకు వెళ్లేందుకు మరో మార్గం లేదు. క్రమంగా వ్యాపిస్తున్న పొగతో ఊపిరాడక ఇబ్బందిపడే పరిస్థితి. ఇటువంటి విపత్కర వేళ.. 14 మందిని సురక్షితంగా కిందకు దించి ప్రాణాలు కాపాడటంతో బాహుబలి క్రేన్ కీలకమైంది. గ్రేటర్ పరిధిలో బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనాలు ఒకటి సికింద్రాబాద్లో.. మరొకటి మాదాపూర్ అగ్నిమాపక కేంద్రాల్లో ఉంచారు. హైటెక్సిటీ పరిధిలో బహుళంతస్తుల భవనాలు, కార్యాలయాలు ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో దీన్ని బయటకు తీస్తుంటారు. ఖాజాగూడ ప్రమాదంలో మాదాపూర్ ఫైర్స్టేషన్ నుంచి స్కైలిఫ్ట్ను రంగంలోకి దించారు. 54 మీటర్ల ఎత్తు వరకూ(18 అంతస్తులు) రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగలిగే సమర్థత దీని సొంతం. అంత ఎత్తు నుంచి 400 కిలోల బరువు వరకూ సురక్షితంగా కిందకు దించగల సత్తా ఉంది. 14 మంది బాధితులను కిందకు తీసుకురావటంలో స్కైలిఫ్ట్ ఎంతో ఉపకరించిందని అగ్నిమాపకశాఖ అధికారులు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.