ఎండకు తాళలేం.. ఎన్నికల విధులకు వెళ్లలేం
ఎన్నికల విధుల పట్ల కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుతున్నారు. నిత్యం సుమారు వంద నుంచి 200ల మంది ఉద్యోగులు లేఖలు ఇస్తుండటమే అందుకు నిదర్శనం.
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల విధుల పట్ల కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుతున్నారు. నిత్యం సుమారు వంద నుంచి 200ల మంది ఉద్యోగులు లేఖలు ఇస్తుండటమే అందుకు నిదర్శనం. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం చుట్టూ వారంతా చక్కర్లు కొడుతున్నారు. ఇదేంటని కొందరు అధికారులను ‘ఈనాడు’ ఆరా తీయగా.. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు. అటు.. జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్, రిటర్నింగ్ అధికారులు అనుదీప్ దురిశెట్టి, హేమంత్ పాటిల్, సిబ్బంది విభాగం నోడల్ అధికారి ఉపేందర్రెడ్డిలోనూ మినహాయింపు లేఖలపై ఆందోళన నెలకొంది. మే 13 వరకు ఇంకెంత మంది మినహాయింపు కోరుతారోనని ఆలోచిస్తున్నారు.
సరిపడా ఉన్నప్పటికీ ఆందోళనే..
ప్రతి 16 మంది అభ్యర్థులకు ఓ బ్యాలెట్ యూనిట్ అవసరమైనందున, ఒక్కో బ్యాలెట్ యూనిట్ను మోసేందుకు ఒక్కో సిబ్బందిని నియమించుకోవాలి. ఈ లెక్కన హైదరాబాద్ జిల్లాలోని 3,986 పోలింగ్ కేంద్రాలకు 16వేల మంది ఉద్యోగులు, మరో 10 వేల మంది సిబ్బంది కావాలని అధికారుల అంచనా. అలాగే.. మరో 20శాతం మందిని రిజర్వులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం.. 20శాతం రిజర్వు యంత్రాంగంతో కలిపి ఉద్యోగులు, సిబ్బంది జిల్లా ఎన్నికల అధికారి వద్ద సిద్ధంగా ఉన్నారు. వారికి ఇటీవలే విధులు నిర్వర్తించాల్సిన అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించారు. అయినప్పటికీ.. మినహాయింపు కోరుతూ రోజువారీ విన్నపాలతో ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు.
కారణాలు: ఎండలు మండిపోతుండటం.. మేలో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో చాలామంది విధులకు ఆసక్తి చూపడం లేదు. కొందరు మహిళా ఉద్యోగులు.. తమకు కేటాయించిన కేంద్రాలు దూరంగా ఉన్నాయని, ముందురోజు రాత్రి పోలింగ్ కేంద్రంలో నిద్రించడం కష్టమని, సదుపాయాల్లేవని మినహాయింపు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రాఫిక్ మళ్లింపులు
[ 04-06-2024]
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల సమీపంలో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. -
మొదట సికింద్రాబాద్.. చివర హైదరాబాద్
[ 04-06-2024]
నువ్వా.. నేనా అన్నట్లు సాగిన పార్లమెంటు ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. -
మెడకు చున్నీ.. తలకు తీవ్ర గాయం.. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
[ 04-06-2024]
తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో మెడకు చున్నీ బిగించిన స్థితిలో ఓ మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నేరేడ్మెట్ ఠాణా పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. -
మహానగరం.. భద్రత కట్టుదిట్టం
[ 04-06-2024]
రాజధానిలో మంగళవారం నాలుగు లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. -
ఏపీలో ఎవరు.. గ్రేటర్లో ఎవరెవరు?
[ 04-06-2024]
అటు ఏపీ.. ఇటు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇంకా కొన్ని గంటల్లోనే వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ఠాణాల ప్రక్షాళనకు వేళాయె
[ 04-06-2024]
ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు నిర్దారణ కావటంతో అరెస్టయిన నగర సీసీఎస్ ఏసీపీ.. భూవివాదం కేసు మాఫీకి రూ.3 లక్షలు తీసుకుంటూ బుక్కయిన కుషాయిగూడ ఇన్స్పెక్టర్, ఎస్సై.. -
నెలాఖరు నుంచి డీపీఎంఎస్ సేవలు బంద్
[ 04-06-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలో ఈ నెలాఖరు నుంచి డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్) సేవలు నిలిపివేయనున్నారు. -
ప్రహరీ కూలి ఇద్దరు చిన్నారుల దుర్మరణం
[ 04-06-2024]
ఇంటి యజమాని నిర్లక్ష్యం మూడు వలస కుటుంబాల్లో విషాదం నింపింది. -
విద్యుత్తు ఆపేసి.. సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టి ఎస్బీఐలో చోరీకి విఫలయత్నం
[ 04-06-2024]
ఇద్దరు యువకులు మాస్కులు, గ్లౌజులతో అర్ధరాత్రి బ్యాంకులోకి చొరబడ్డారు. విద్యుత్తు ఆపేసి.. సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టారు.. లాకర్కు రంధ్రం చేద్దామంటే సాధ్యపడలేదు. -
హైటెక్ పద్ధతిలో మాల్ ప్రాక్టీస్
[ 04-06-2024]
హైటెక్ పద్ధతిలో మాల్ప్రాక్టిస్కు పాల్పడిన ఇంజినీరింగ్ విద్యార్థికి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల అపరాధ రుసుం విధించింది. -
ప్రతిష్ఠాత్మకం.. కంటోన్మెంట్ విజయం
[ 04-06-2024]
లోక్సభ ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెల్లడి కానుంది. -
కౌంటింగ్ టేబుళ్లు 140.. రౌండ్లు 148
[ 04-06-2024]
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
పాలిసెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 04-06-2024]
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. -
అపార్టుమెంట్ ప్రహరీ కూలి.. చిక్కుకున్న కార్మికుడు
[ 04-06-2024]
అపార్టుమెంట్ ప్రహరీ కూలి కార్మికుడి కాళ్లపై పడడంతో అందులోనే ఇరుక్కుపోయాడు. -
అధిక వడ్డీ ఆశ.. రూ.25 కోట్లు టోకరా
[ 04-06-2024]
నూటికి రూ.10 వడ్డీ ఇస్తా.. మీ దగ్గర ఎంత ఉంటే అంత నా దగ్గర పెట్టుబడి పెట్ట్టండి.. మీ ఆశలు, ఆకాంక్షలు తీరుస్తానంటూ.. ఆ యువకుడు నమ్మబలికాడు. -
కదులుతున్న రైలును ఎక్కుతుండగా.. ప్రమాదవశాత్తు కిందపడి డెలివరీ బాయ్ దుర్మరణం
[ 04-06-2024]
కదులుతున్న ఎంఎంటీఎస్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు దాని కిందపడి ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ మృతి చెందాడు. -
మామ, బావమరిదిపై కత్తితో దాడి
[ 04-06-2024]
తనకు నలుగురు సోదరులున్నారంటూ తరుచూ భార్య బెదిరిస్తుండడంతో విసుగుచెందిన భర్త.. మామ, బావమరిదిలపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
నా హృదయం ఉప్పొంగుతోంది: పవన్ విజయంపై చిరంజీవి ఆనందం
-
తెదేపా సెంచరీ.. ఆంధ్రప్రదేశ్లో మేజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీయే కూటమి
-
కిశోరీ భయ్యా మీరు గెలుస్తారని తెలుసు: ప్రియాంక గాంధీ ఎమోషనల్ పోస్ట్
-
‘ఇక మీ లగేజ్ సర్దుకోండి’ ప్రత్యర్థికి కంగనా కౌంటర్
-
రాహుల్ గాంధీ జోరు.. రెండుచోట్లా విజయఢంకా
-
3 లక్షలకు పైగా ఆధిక్యంతో.. కూటమి ఎంపీ అభ్యర్థుల హవా