ప్రధాని ముఖంలో ఓటమి భయం
అబద్ధాల సర్దార్..మౌని బాబా ప్రధాని నరేంద్ర మోదీ ముఖంలో ఓటమి భయం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని లోక్సభ మాజీ సభ్యుడు వి.ఎస్.ఉగ్రప్ప తెలిపారు.
రాష్ట్రంలో 20 స్థానాల్లో గెలుపొందుతాం
మాట్లాడుతున్న లోక్సభ మాజీ సభ్యుడు వి.ఎస్.ఉగ్రప్ప, చిత్రంలో వెంకటేశ్ హెగ్డె,
డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, కల్లుకంబ పంపాపతి, గాదెప్ప
బళ్లారి, న్యూస్టుడే: అబద్ధాల సర్దార్..మౌని బాబా ప్రధాని నరేంద్ర మోదీ ముఖంలో ఓటమి భయం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని లోక్సభ మాజీ సభ్యుడు వి.ఎస్.ఉగ్రప్ప తెలిపారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఈ ఎన్నికలు రెండో స్వతంత్ర సంగ్రామంగా జరుగుతున్నాయని చెప్పారు. రాజ్యాంగంపై నమ్మకం లేని భాజపాతో కాంగ్రెస్ తలపడుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ఐదు గ్యారంటీలను ప్రవేశపెట్టామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరో 25 గ్యారంటీలను కూడా ప్రవేశపెడతామన్నారు. 2018 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 165 హామీలను పూర్తి చేశాం. 2014, 2019లో లోక్సభ ఎన్నికల సందర్భంలో ప్రకటించిన భాజపా ఒక్క హామీ కూడా పరిష్కరించలేదన్నారు. శ్రీమంతులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. దేశంలో ఎన్.డి.ఎ.కి ఎదురుగాలి వీస్తోంది. మేకపోతు గాంభీర్యంతో దేశంలో 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని విమర్శించారు. కర్ణాటకలో తమ పార్టీ 20 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతారని జోస్యం చెప్పారు.
కోర్టు చీవాట్లతో కరవు నిధులు విడుదల
కర్ణాటకపై కేంద్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. మొత్తం ఎన్.డి.ఆర్.ఎఫ్. ప్రకారం కరవు నష్టం రూ.4,663 కోట్లు, మొత్తం నష్టం రూ.18,171 కోట్ల నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి గతేడాది అక్టోబరులో నివేదిక సమర్పించినా నిధులు విడుదల చేయలేదని ఉగ్రప్ప ధ్వజమెత్తారు. కోర్టుకు వెళ్లడంతో కేంద్రానికి చీవాట్లు పెట్టిన తర్వాత ప్రస్తుతం రూ.3,454 కోట్లు విడుదల చేశారన్నారు. బళ్లారి లోక్సభ నియోజకవర్గం నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో పార్టీ అధిష్ఠాన నిర్ణయమని చెప్పారు. ప్రస్తుతం బరిలో ఉన్న లోక్సభ అభ్యర్థి ఇ.తుకారామ్ గెలుపొందడం నూటికి నూరు శాతం కచ్చితమన్నారు. డీడీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, కల్లకంబ పంపాపతి, పి.గాదెప్ప, లోకేష్కుమార్, వెంకటేశ్ హెగ్డె పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చందనసీమలో విజయానందం!
[ 05-06-2024]
కర్ణాటకలో లోక్సభ ఎన్నికల మిశ్రమ ఫలితాలు అన్ని పార్టీలనూ ఆలోచనలో పడేశాయి. ఒకింత ఆనందాన్ని.. మరికొంత ఆందోళననూ మిగిల్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేర్వేరుగా చూసే విధానాన్ని ఈ ఎన్నికల్లోనూ ఓటర్లు కొనసాగించారు. -
తెదేపా కూటమి విజయంపై సంబరాలు
[ 05-06-2024]
ఆంధ్రప్రదేశ్ విధానసభ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడంతో మంగళవారం సిరుగుప్పలో అభిమానులు విజయోత్సవాన్ని ఆచరించారు. -
అమాత్యగిరిపై ఆశలేదు
[ 05-06-2024]
కేంద్ర మంత్రి కావాలన్న ఆశ నాకేమీ లేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. -
నిందితునికి 20 ఏళ్ల కారాగారం
[ 05-06-2024]
ఒక బాలిక (16)పై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో ఇక్కడి ఫాస్ట్ట్రాక్ న్యాయస్థానం మౌలాసాబ్ (75) అనే వృద్ధునికి 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. -
కార్యాలయాల్లో సంబరాలు
[ 05-06-2024]
చందనసీమలో 28 లోక్సభ స్థానాలకు 19 స్థానాలను కూటమి పార్టీలు భాజపా, జనతాదళ్ దక్కించుకోవడంతో ఆ రెండు పార్టీల కార్యాలయాలూ వేడుకలకు వేదికలుగా మారాయి. -
గౌరవసభలోకి సగౌరవంగా!
[ 05-06-2024]
కౌరవ సభలో కాకుండా గౌరవ సభలో అడుగు పెడతానని ప్రతినపూని, తన శపథాన్ని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చుకుంటున్నారని తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు ఎ.రాధాకృష్ణరాజు పేర్కొన్నారు. -
కొప్పళలో భాజపాకు అడ్డుకట్ట
[ 05-06-2024]
ప్పళ లోక్సభ నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ విజయ పరంపరకు అడ్డుకట్ట పడింది. ఇక్కడ నాలుగో విజయం కోసం కలలు కన్న కమలనాథుల ఆశలు ఆవిరయ్యాయి. అభ్యర్థి మార్పిడి ప్రయోగం విఫలమైంది. -
‘బళ్లారి గెలుపు సోనియాకు కానుక’
[ 05-06-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి ఇ.తుకారామ్ గెలుపును పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కానుకగా ఇస్తామని రాష్ట్ర క్రీడలు, యువజన సేవలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బి.నాగేంద్ర వెల్లడించారు. -
ఉద్యాననగరిలో కమల వికాసం!
[ 05-06-2024]
లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు నగరంపై కమలనాథులు మరోసారి పట్టు సాధించారు. నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ఒకటి కాంగ్రెస్కు దక్కుతుందని అందరూ అంచనా వేసినా.. అది సాధ్యంకాలేదు. -
మంచి తనమే ఆయనకు అభయహస్తం
[ 05-06-2024]
దేశం, రాష్ట్రమంతటా ప్రధాని మోదీ హవా ఉన్నప్పటికీ బళ్లారి లోక్సభ నియోజకవర్గంలో మాత్రం మోదీ హవా ఏమాత్రం పనిచేయలేదు. -
శ్రీరాములు కింకర్తవ్యం?
[ 05-06-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్నాచెల్లెళ్లిద్దరికీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఒకప్పుడు ఓటమెరుగని సర్దార్గా వెలిగిన..బి.శ్రీరాములు ఆయన సోదరి జె.శాంత వరుసగా ఓటమితో కోలుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం లేదు: డీకే అరుణ
-
మణిపుర్లో కాంగ్రెస్ విజయం.. ఆయనకు చెంపపెట్టు: జైరాం రమేశ్
-
చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తా: సీఎం రేవంత్
-
అహంకారం నెత్తికెక్కడంతోనే 151 సీట్లు 11 అయ్యాయి: నారా లోకేశ్
-
విమాన టికెట్ ధరలు లాక్.. ఎయిరిండియా కొత్త సదుపాయం
-
నవీన్ పట్నాయక్ రాజీనామా.. ఒడిశా తదుపరి సీఎం ఎవరో?