మాటలతో మోసం చేశారు: చల్లా
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికీ జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
అలంపూర్, న్యూస్టుడే: రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికీ జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం అలంపూర్ పట్టణ కేంద్రంలో భారాస ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా, ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, కేవలం మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. గతేడాది డిసెంబరు 9వ తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఏ రైతుకూ మాఫీ జరగలేదని, కనీసం రైతు బంధు డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు మరో పర్యాయం ప్రజలను మోసం చేస్తూ కొత్తగా ఆగస్టు 15 వరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్ల పైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒట్టు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి దేవుళ్లను వాడుకుంటూ ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బారాస అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని కార్యకర్తలకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీరప్ప స్వామికి నాగాభరణం వితరణ
[ 17-06-2024]
మండలకేంద్రమైన రాజోలి గ్రామంలోని బీరప్ప స్వామి ఆలయానికి దాతలు సోమవారం నాగాభరణం వితరణ చేశారు. -
భక్తి శ్రద్ధలతో బక్రీద్
[ 17-06-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో ముస్లిం సోదరులు సోమవారం బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. -
సరస్వతి నిలయాల్లో సమస్యల కొలువు
[ 17-06-2024]
జిల్లాలోని పలు పాఠశాలల్లో సమస్యలు కొలువుదీరాయి. అరకొర తరగతి గదులు ఉండటం, కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవసరమైన మూత్రశాలలు, శౌచాలయాలు లేకపోవడం, విద్యుత్తు సౌకర్యం అంతంత మాత్రంగా ఉండటం, పాఠశాలలకు రక్షణ గోడలు లేక భద్రత కొరవడటం వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. -
గాడితప్పిన సహకార మార్కెటింగ్
[ 17-06-2024]
రైతులకు అండగా నిలుస్తూనే ఆదాయం గడించటం మహబూబ్నగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం(డీసీఎంఎస్) ఏర్పాటు లక్ష్యం. జరుగుతున్నది మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆదాయం పెంచుకోకపోగా ఉన్న రూ.కోట్ల విలువైన ఆస్తులకు రక్షణ కరవైంది. -
నిబంధనలు బేఖాతరు.. ప్రజలు బేజారు
[ 17-06-2024]
పాలమూరులో జాతీయ రహదారుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో భారత్మాల రహదారి నిర్మాణం జరుగుతుండగా నాగర్కర్నూల్ జిల్లాలో 167కే జాతీయ రహదారి పనులు ఊపందుకున్నాయి. -
అక్రమ తవ్వకాలు ఆగేదెన్నడు?
[ 17-06-2024]
పాలమూరులోని ఊర్కొండ మండలంలోని తెల్ల గ్రానైట్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మండలంలోని ఊర్కొండ, ఊర్కొండపేట, నర్సంపల్లి శివారులో మొత్తం 5,200 ఎకరాల్లో పెద్ద గుట్టలు విస్తరించి ఉన్నాయి. -
యథేచ్ఛగా ఇసుక దందా
[ 17-06-2024]
ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది.. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము వరకు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ ఇసుకాసురులు సొమ్ము చేసుకుంటున్నారు. ధన్వాడ మండలంలోని గోటూర్ శివారు కోయిల్సాగర్ వాగులో ఇసుక దందా ఇదీ. -
దిగుబడి లేక.. ధరలు పైపైకి
[ 17-06-2024]
వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో భూగర్భజలాలు అడుగంటడం.. సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. బోరుబావులు పూర్తిగా అడుగంటి కూరగాయలు ఇతరా పంటలు సాగు పూర్తిగా తగ్గిపోయింది. -
ప్రమాదాల అడ్డాగా ధర్మాపూర్
[ 17-06-2024]
మహబూబ్నగర్కు కూత వేటు దూరంలో ఉన్న ధర్మాపూర్ ప్రాంతం ప్రమాదాలకు అడ్డాగా మారింది. జాతీయ రహదారి-167పై మహబూబ్నగర్ నుంచి ధర్మాపూర్కు ఆరు కి.మీ.ల దూరం ఉంటుంది. ఈ రోడ్డు పలు ప్రాంతాల్లో ఎగుడు, దిగుడుగా ఉంది. -
హరిత లక్ష్యం 20 లక్షలు
[ 17-06-2024]
జిల్లాలో ఈ ఏడాది హరితహారం పథకంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రామాలకు కేటాయించిన లక్ష్యం మేరకు గుంతలు తవ్వే కార్యక్రమం ముమ్మరం చేశారు. -
ఉపకార వేతనాల్లో పాలమూరు ప్రతిభ
[ 17-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యలో ఆర్థిక తోడ్పాటును అందించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపకార వేతనాలు(ఎన్ఎంఎంఎస్ - నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) అందజేస్తోంది. -
కొత్త సర్వే నంబర్లపై ఆరా
[ 17-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను పెంచడానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ నెల 14న ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయగా అధికారులు, సిబ్బంది సెలవులు కూడా తీసుకోకుండా కసరత్తు చేస్తున్నారు. -
మురుగు గుంతలో పడి చిన్నారి మృత్యువాత
[ 17-06-2024]
ఆడుకుంటూ వెళ్లిన రెండేళ్ల బాలుడు మురుగు గుంతలో పడి మృత్యువాత పడిన విషాద ఘటన ఆదివారం సాయంత్రం రాజాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విమానాలకు.. ‘ఉష్ణోగ్రత’ సెగ.. రెండు గంటలు నిలిచిపోయిన విమానం
-
‘ఇండియా స్థానంలో భారత్’.. వివాదం అనవసరం - ఎన్సీఈఆర్టీ
-
రోహిత్ కోచ్ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నా.. నా కెరీర్ను మార్చింది ఆయనే: హర్మిత్ సింగ్
-
ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి!
-
రూ.5లక్షలు పెట్టి టికెట్ కొన్నా..: విమాన ప్రయాణికుడి అసహనం
-
‘ఫాదర్స్ డే’ రోజే తండ్రిని కోల్పోయిన నిక్కీ హేలీ