సహజ ప్రసవానికే ప్రాధాన్యం
తూప్రాన్కు చెందిన ఓ గర్భిణి రెండో కాన్పు నిమిత్తం మెదక్లోని మాతాశిశు సంరక్షణ కేంద్రాని(ఎంసీహెచ్)కి వచ్చింది. నెలలు నిండటంతో వైద్యబృందం ప్రసవం చేయగా పాపకు జన్మనిచ్చారు.
కేంద్రంలో బాలింతలు
న్యూస్టుడే, మెదక్: తూప్రాన్కు చెందిన ఓ గర్భిణి రెండో కాన్పు నిమిత్తం మెదక్లోని మాతాశిశు సంరక్షణ కేంద్రాని(ఎంసీహెచ్)కి వచ్చింది. నెలలు నిండటంతో వైద్యబృందం ప్రసవం చేయగా పాపకు జన్మనిచ్చారు. ఆ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కాగా వైద్యులు గర్భ సంచి తొలగించారు. పరిస్థితి విషమించడంతో గాంధీకి పంపించగా రక్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడారు. సదరు మహిళ మరోసారి ఎంసీహెచ్కు వచ్చి వైద్యసిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
* మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఈనెల 11న 24 గంటల్లో 25 ప్రసవాలు జరిగాయి. ఇందులో 12 సాధారణ, మిగతావి సిజేరియన్ ప్రసవాలు. ఇది వరకు ఆసుపత్రిలో 23 ప్రసవాలు జరుగగా, ఆ రికార్డును తిరగరాశారు. కార్పోరేట్ స్థాయిలో వసతులు, కేసీఆర్ కిట్ అమలు, వైద్యానికి ఇంటి నుంచి ఆసుపత్రి వరకు వాహన సౌకర్యం కల్పించడం.. పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల వైపు గర్భిణులు మొగ్గుచూపుతున్నారు. గతంలో అసౌకర్యాల మధ్య ప్రసవాలు జరగ్గా, ఇప్పుడు అధునాతన వసతులు అందుబాటులోకి రావడంతో వచ్చే వారికి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో సహజ కాన్పులపై దృష్టిపెడుతున్నారు.
అధునాతన సౌకర్యాలు
జిల్లా కేంద్రం మెదక్లో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఇది వరకు ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనంలో కొనసాగేది. గతేడాది మే నెలలో రూ.17 కోట్లతో స్థానిక పిల్లికొట్టాల వద్ద అధునాతన భవనం అందుబాటులో రాగా, అక్కడికి మార్చారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలతో ఇక్కడ సహజ కాన్పులు జరిగేలా వైద్యులు దృష్టిసారించారు. గర్భిణిగా పేరు నమోదైనప్పటి నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో చికిత్స పొందుతుండగా, ఆరు నెలల తర్వాత ఎంసీహెచ్కు వచ్చి సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు వాకబు చేస్తున్నారు. రక్తహీనత, రక్తపోటు ఉంటే చికిత్స అందిస్తున్నారు. ఒక వేళ కుటుంబీకులు శస్త్రచికిత్స చేయాలని కోరినా.. సహజ కాన్పుపై అవగాహన కల్పిస్తున్నారు.
ఆరు నెలల తర్వాత..
శివదయాళ్, సివిల్ సర్జన్, ఎంసీహెచ్
గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రసవాలు జరిగేలా దృష్టి సారించాం. ఆరు నెలలుగా ఉన్న సమయం నుంచి వచ్చే వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధవహిస్తున్నాం. వారికేమైనా సమస్యలుంటే సమయం సమీపించే నాటికి తొలగిపోయేలా చర్యలు తీసుకుంటున్నాం. కాన్పు సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే తగిన చికిత్సతో తల్లి, బిడ్డల ప్రాణాలు కాపాడుతున్నాం. ఎంసీహెచ్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండటం కలిసొచ్చింది.
అందుబాటులో వైద్యులు
పరీక్షిస్తున్న వైద్యులు
మాతా శిశుసంరక్షణ కేంద్రం అందుబాటులోకి రావడంతో వైద్యసేవలు మెరుగయ్యాయి. మెదక్ సమీపంలోని మండలాలతో పాటు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, గోపాల్పేట, మేడ్చల్ జిల్లాల నుంచి గర్భిణులు ఇక్కడికి వస్తున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయి. గత జులై నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది జులైలో 308, ఆగస్టులో 338, సెప్టెంబరులో 377, అక్టోబరులో 384, నవంబరులో 407, డిసెంబరులో 376 వరకు జరిగాయి. ఈ ఏడాది జనవరి 27 వరకు 310 వరకు జరగ్గా, ఇందులో 166 సాధారణమైనవే కావడం గమనార్హం. నిత్యం ఇక్కడ 15 వరకు చేస్తున్నారు. ఒక సివిల్ సర్జన్తో పాటు మరో ముగ్గురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇద్దరు అనస్తీషియా వైద్యులు ఉన్నారు. ఇద్దరు చిన్నపిల్లల వైద్యులు సేవలందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్యేక కమిటీ.. వేధింపుల నివారణకు దివిటీ
[ 21-05-2024]
మున్సిపల్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగుల రక్షణకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆగని ఇసుక దందా
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వాగులు, నదులు, చెరువులను అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వేస్తూ ‘జలసిరి’ని తరలించి జేబులు నింపుకొంటున్నారు. -
ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 21-05-2024]
సిద్దిపేటలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో 307 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారంగా రాశారు. -
రైతులకు జీలుగ విత్తనాలు అందజేత
[ 21-05-2024]
జీలుగు విత్తనాలు లభించడంలేదని రైతులు రోడ్డెక్కిన ఘటన మండల కేంద్రం హవేలిఘనపూర్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. -
చెత్త సేకరణ.. ఆదాయానికి కార్యాచరణ
[ 21-05-2024]
తూప్రాన్ మండలం మల్కాపూర్లో తడి, పొడి చెత్త సేకరించి కంపోస్టు ఎరువు తయారు చేయడంలో ఆదర్శంగా నిలిచారు. నిత్యం గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించి ఎరువుల తయారు చేసి, -
మామిడి ప్రదర్శనకు వేళాయె
[ 21-05-2024]
మామిడి సీజన్ వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సంగారెడ్డిలోని ఫల పరిశోధనా స్థానమే. ఇక్కడ వందలాది రకాల మామిడి ఫలాలు రుచి చూసే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. -
క్రీడా సాధన.. భవితకు నిచ్చెన
[ 21-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు చరవాణులతో కాలక్షేపం చేస్తుంటారు. సెల్ఫోన్లపై నుంచి పిల్లల ధ్యాసను మళ్లించాలన్న సంకల్పంతో పలువురు ఆటలు, యోగా ఉచితంగా నేర్పించేందుకు ముందుకొచ్చారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
[ 21-05-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు, కడుపు నొప్పితో సతమతం అవుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
[ 21-05-2024]
తేనెటీగల పెంపకంతో రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మధ్య తెలంగాణ మండల సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి పేర్కొన్నారు. -
ధరణి సేవల్లో తాత్సారం
[ 21-05-2024]
అధికారులు సమయపాలన పాటించకపోవడం.. సిబ్బంది నిర్లక్ష్యంతో తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్లు, ధరణి సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. -
గ్యాస్ రీఫిల్లింగ్.. ఇద్దరిపై కేసు
[ 21-05-2024]
రాయితీ గ్యాస్ను అక్రమంగా రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని సదాశివపేట సీఐ మహేష్గౌడ్ తెలిపారు. -
జిల్లాకు మూడు కస్తూర్బాలు మంజూరు
[ 21-05-2024]
బాలికల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు మూడు కస్తూర్బా బాలికల విద్యాలయాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పుర పాలన గాడిన పడేదెలా?
[ 21-05-2024]
కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల లోక్సభ ఎన్నికలు పూర్తికావడంతో ప్రభుత్వం స్థానిక సంస్థలపై దృష్టి సారించింది. -
‘కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే’
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ఇంటలెక్చువల్ ఛైర్మన్, క్రమశిక్షణ సంఘం సభ్యుడు అనంతుల శ్యామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. -
సర్కారు బడులు..ఆదర్శం చాటేలా..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతుంటారు. ఈ తరుణంలో కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా చదువును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
సిబ్బంది తగ్గుముఖం.. రిజిస్ట్రేషన్లలో జాప్యం
[ 21-05-2024]
చాలీచాలని సిబ్బందితో సరైన వసతులు లేక జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవహారాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయాన్ని అందించే కార్యాలయాల నిర్వహణలో పలు లోపాలు తలెత్తుతున్నాయి. -
ప్రయాణ ప్రాంగణ స్థలాన్ని కబ్జా.. కాపాడాలని వినతి
[ 21-05-2024]
ప్రజలకు ఉపయోగపడే ప్రయాణ ప్రాంగణం స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని పరిరక్షించాలని నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన పలువురు సోమవారం కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారిణి దేవకిదేవికి వినతిపత్రం అందజేశారు. -
పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
[ 21-05-2024]
భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్థిరాస్తి వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్