ఉపాధికి చేయూత జాతీయ స్థాయి ఘనత
కరోనా పరిస్థితులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మ నిర్బర్ పథకం కింద రెండు సంవత్సరాలుగా రుణాలు అందిస్తోంది.
వీధి వ్యాపారులకు రుణాల పంపిణీలో ముందంజ
మొదటి పది స్థానాల్లో సంగారెడ్డి, జహీరాబాద్ పురపాలికలు
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జహీరాబాద్ : కరోనా పరిస్థితులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మ నిర్బర్ పథకం కింద రెండు సంవత్సరాలుగా రుణాలు అందిస్తోంది. సంగారెడ్డి, జహీరాబాద్ పురపాలికలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని దేశంలోనే తొలి పది స్థానాల్లో నిలిచాయి. వరుసగా మూడో సారి ఈ ఘనతను దక్కించుకున్నాయి. మొదటి విడత రూ.10 వేలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ రుణాన్ని సక్రమంగా చెల్లించిన వారికి రెండో విడత రూ.20 వేల రుణాన్ని వీధి వ్యాపారులకు ఇచ్చారు. వీటినీ చెల్లించిన వారికి రూ.50 వేల చొప్పున అందజేశారు. లక్షలోపు పట్టణ జనాభా కేటగిరీలో ఈ రెండు పురపాలికలు ఘనత సాధించాయి. ఇదే స్ఫూర్తితో మిగిలిన మున్సిపాలిటీలు ముందుకు సాగితే చిరు వ్యాపారులకు మరింత ఆర్థిక సహాయం అందుతుంది. ఈ నేపథ్యంలో కథనం.
కమిషనర్లు, మెప్మా విభాగం చొరవ
జిల్లాలో 8 పురపాలక సంఘాలున్నాయి. లక్షలోపు జనాభా విభాగంలో సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలు అత్యధిక రుణాలు ఇచ్చి ముందంజలో నిలిచాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి జహీరాబాద్లో 722 మందికి రూ.3.29 కోట్లు పంపిణీ చేయగా.. దేశంలో ఆరో స్థానం దక్కింది. సంగారెడ్డిలో 628 మందికి 2.15 కోట్లు రుణాలు అందించారు. ఈ పట్టణం జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండో విడత రుణాలు సక్రమంగా చెల్లించిన చిరు వ్యాపారులకు మూడో విడత రుణాలను పంపిణీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల పురపాలక కమిషనర్లతో పాటు మెప్మా విభాగంలో పని చేసే సీవోలు బ్యాంకర్ల వద్దకు వెళ్లి రుణాలు ఇప్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేశారు. వ్యాపారులు తీసుకున్న రుణాలు ప్రతి నెలా చెల్లిస్తున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు. ఎవరైనా వెనుకడుగు వేస్తే.. అవగాహన కల్పించి చెల్లించేలా చూస్తున్నారు.
అందరి కృషితోనే గుర్తింపు: గీత, మెప్మా పీడీ
సంగారెడ్డి, జహీరాబాద్ పురపాలికలు అందరి కృషి ఫలితంగానే దేశంలోనే మొదటి పది స్థానాల్లో నిలిచాయి. ఈ గుర్తింపును ఇక ముందు కూడా కొనసాగించాలి. మిగతా పట్టణాల్లోనూ వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించి గుర్తింపు సాధించాలి.
తొలి రెండు విడతల్లో..
సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలు తొలి, రెండో విడత రుణాల విభాగంలోనూ జాతీయ స్థాయిలో టాప్ టెన్లో చోటు దక్కించుకున్నాయి. 2020-21 సంవత్సరానికి జహీరాబాద్ పురపాలికలో 3,633 మందికి రూ.3.63 కోట్లు పంపిణీ చేయగా ఆరో స్థానం, సంగారెడ్డిలో మొదటి విడత కింద రూ.10 వేల చొప్పున 3,387 మందికి రూ.3.38 కోట్లు ఇవ్వగా 9వ స్థానం సాధించాయి. 2021-22లో రెండో విడతలోనూ సంగారెడ్డిలో ఒక్కో వ్యాపారికి రూ.20 వేల చొప్పున 922 మందికి రూ.1.84 కోట్లు, జహీరాబాద్లో 779 మందికి రూ.1.55 కోట్ల రుణాలు అందిచాయి. సంగారెడ్డి 8, జహీరాబాద్ 10వ స్థానంలో నిలిచాయి. చిరు వ్యాపారులు చాలా మంది రుణాలు తీసుకున్న తరువాత నెల వారీ చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఈ రెండు పురపాలికల్లో మెప్మా సిబ్బంది ప్రత్యేక చొరవ చూపి.. వాయిదాలు సక్రమంగా చెల్లించేలా చొరవ చూపారు.
సంగారెడ్డిలో దుకాణాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడి.. భద్రత కొరవడి..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో రక్షణ కరవైంది. ప్రహరీలు లేక, ఒక వేళా ఉన్నా, ఆకతాయిలు, మందుబాబులు వల్ల ప్రమాదం పొంచి ఉంటోంది. ఆయా మండలాలు, పట్టణాల్లో పాఠశాలలకు కాపలాదారులు లేరు. -
ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించి భరోసా కల్పించాలి
[ 21-05-2024]
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమయానికి రవాణా చేసి రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. -
ప్రత్యేక కమిటీ.. వేధింపుల నివారణకు దివిటీ
[ 21-05-2024]
మున్సిపల్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగుల రక్షణకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆగని ఇసుక దందా
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వాగులు, నదులు, చెరువులను అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వేస్తూ ‘జలసిరి’ని తరలించి జేబులు నింపుకొంటున్నారు. -
ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 21-05-2024]
సిద్దిపేటలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో 307 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారంగా రాశారు. -
రైతులకు జీలుగ విత్తనాలు అందజేత
[ 21-05-2024]
జీలుగు విత్తనాలు లభించడంలేదని రైతులు రోడ్డెక్కిన ఘటన మండల కేంద్రం హవేలిఘనపూర్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. -
చెత్త సేకరణ.. ఆదాయానికి కార్యాచరణ
[ 21-05-2024]
తూప్రాన్ మండలం మల్కాపూర్లో తడి, పొడి చెత్త సేకరించి కంపోస్టు ఎరువు తయారు చేయడంలో ఆదర్శంగా నిలిచారు. నిత్యం గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించి ఎరువుల తయారు చేసి, -
మామిడి ప్రదర్శనకు వేళాయె
[ 21-05-2024]
మామిడి సీజన్ వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సంగారెడ్డిలోని ఫల పరిశోధనా స్థానమే. ఇక్కడ వందలాది రకాల మామిడి ఫలాలు రుచి చూసే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. -
క్రీడా సాధన.. భవితకు నిచ్చెన
[ 21-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు చరవాణులతో కాలక్షేపం చేస్తుంటారు. సెల్ఫోన్లపై నుంచి పిల్లల ధ్యాసను మళ్లించాలన్న సంకల్పంతో పలువురు ఆటలు, యోగా ఉచితంగా నేర్పించేందుకు ముందుకొచ్చారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
[ 21-05-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు, కడుపు నొప్పితో సతమతం అవుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
[ 21-05-2024]
తేనెటీగల పెంపకంతో రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మధ్య తెలంగాణ మండల సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి పేర్కొన్నారు. -
ధరణి సేవల్లో తాత్సారం
[ 21-05-2024]
అధికారులు సమయపాలన పాటించకపోవడం.. సిబ్బంది నిర్లక్ష్యంతో తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్లు, ధరణి సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. -
గ్యాస్ రీఫిల్లింగ్.. ఇద్దరిపై కేసు
[ 21-05-2024]
రాయితీ గ్యాస్ను అక్రమంగా రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని సదాశివపేట సీఐ మహేష్గౌడ్ తెలిపారు. -
జిల్లాకు మూడు కస్తూర్బాలు మంజూరు
[ 21-05-2024]
బాలికల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు మూడు కస్తూర్బా బాలికల విద్యాలయాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పుర పాలన గాడిన పడేదెలా?
[ 21-05-2024]
కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల లోక్సభ ఎన్నికలు పూర్తికావడంతో ప్రభుత్వం స్థానిక సంస్థలపై దృష్టి సారించింది. -
‘కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే’
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ఇంటలెక్చువల్ ఛైర్మన్, క్రమశిక్షణ సంఘం సభ్యుడు అనంతుల శ్యామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. -
సర్కారు బడులు..ఆదర్శం చాటేలా..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతుంటారు. ఈ తరుణంలో కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా చదువును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
సిబ్బంది తగ్గుముఖం.. రిజిస్ట్రేషన్లలో జాప్యం
[ 21-05-2024]
చాలీచాలని సిబ్బందితో సరైన వసతులు లేక జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవహారాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయాన్ని అందించే కార్యాలయాల నిర్వహణలో పలు లోపాలు తలెత్తుతున్నాయి. -
ప్రయాణ ప్రాంగణ స్థలాన్ని కబ్జా.. కాపాడాలని వినతి
[ 21-05-2024]
ప్రజలకు ఉపయోగపడే ప్రయాణ ప్రాంగణం స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని పరిరక్షించాలని నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన పలువురు సోమవారం కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారిణి దేవకిదేవికి వినతిపత్రం అందజేశారు. -
పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
[ 21-05-2024]
భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్థిరాస్తి వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్