ఎండ పెరిగి.. మీటర్లు తిరిగి
ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు.
పెరుగుతున్న విద్యుత్తు వినియోగం
మెదక్లో నిర్మానుష్యంగా ప్రధాన రహదారి
మెదక్ టౌన్, న్యూస్టుడే: ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. ఎండల కారణంగా ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లతో పాటు విద్యుత్తు పరికరాల వాడకం పెరిగిపోవడంతో చాలామంది పరిమిత యూనిట్లు దాటిపోయి, రాయితీని పొందలేకపోతున్నారు. గత నెలతో పోలిస్తే గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య తగ్గినా.. రాయితీ డబ్బు పెరగడం విశేషం. గతంలో 100 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించుకున్న లబ్ధిదారులు సైతం ఎక్కువ విద్యుత్తును వాడుతున్నారు. కానీ వినియోగం 200 యూనిట్లలోపు ఉండడంతో వారికి ఇచ్చే రాయితీ సొమ్ము పెరిగింది. అధికారుల లెక్కల మేరకు లబ్ధిదారుల సంఖ్య తగ్గినా... వినియోగం పెరగడంతో ప్రభుత్వానికి రాయితీ భారం పెరుగుతోంది.
తగ్గిన సర్వీసులు: జిల్లా వ్యాప్తంగా 2,04,945 విద్యుత్తు కనెక్షన్లు ఉండగా, తెల్లరేషన్ కార్డు ఉండి గృహజ్యోతి పథకం కింద లబ్ధిపొందే వారు 1,14,027 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మార్చి నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించుకున్న 1,11,258 సర్వీసులకు జీరో బిల్లులు ఇచ్చారు. తాజాగా ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగింది. గత నెలలో జీరో బిల్లులు పొందిన వారిలో కొంతమంది 200 యూనిట్లు దాటడంతో ఈ నెలలో బిల్లును చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలలో 1,09,649 సర్వీసులకు మాత్రమే జీరో బిల్లు వచ్చాయి. ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తును ఎక్కువగా వాడటంతో 1601 మంది అర్హతను కోల్పోయారు. మార్చి నెలలో రూ.2.66 కోట్లు రాయితీ ఇవ్వగా, ఈ నెలలో రూ.3.26 కోట్లుగా ఉంది. ఒక నెలలోనే రాయితీ సొమ్ము రూ.60 లక్షలకు పెరిగింది.
కోడ్ ముగిశాకే సవరణ: ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. ప్రజాపాలనలో దరఖాస్తులు తప్పుగా ఇవ్వడంతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు చేసిన తప్పిదాల వల్ల చాలా మంది జీరో బిల్లులను పొందలేక పోయారు. తర్వాత మార్చుకునేందుకు అవకాశం ఇచ్చినా.. అది పూర్తికాకముందే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం అందజేస్తున్న రాయితీ కోసం జిల్లాలో ఇంకా చాలా మంది ఎదురుచూస్తున్నారు. కోడ్ ముగిసిన తర్వాత జూన్ నెల నుంచి మిగతా వారు జీరో బిల్లు పొందే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగిస్తున్న కొంతమందికి ఆహార భద్రత కార్డులు లేకపోవడంతో గృహజ్యోతి పథకం కింద లబ్ధిపొందలేక పోతున్నారు.
43.9 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
మెదక్, న్యూస్టుడే: భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. వడగాల్పులు వీయడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే ఎండ వేడి ప్రారంభమై సాయంత్రం ఏడుగంటల వరకు ఉంటోంది. బుధవారం రామాయంపేట మండల ప్రగతి ధర్మారంలో 43.9 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో జిల్లాలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. వడగాల్పుల కారణంగా మెదక్లో ప్రధాన రహదారులు బోసిపోయాయి.
పొదుపుగా వాడాలి
- రాంబాబు, డీటీఈ విద్యుత్తు ఎస్ఈ కార్యాలయం
గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందాలంటే.. జిల్లాలోని ప్రతి ఒక్కరూ విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి. 200 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించుకుంటేనే రాయితీ వర్తిస్తుంది. వేసవిలో విద్యుత్తు పరికరాల వినియోగం అధికమవడంతో 200 యూనిట్లలోపు విద్యుత్తును వాడుకునే వారు తగ్గినప్పటికీ వాడకం పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పచ్చందాలకు.. ప్రత్యేక కార్యాచరణ
[ 13-06-2024]
పర్యావరణ పరిరక్షణలో వృక్షాలే కీలకం. వీటి వల్లే ఆహ్లాదకర వాతావరణంతోపాటు, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ముఖ్యంగా అడవుల్లో మొక్కలు నాటి వాటిని పెంచితే భారీ వర్షాలు కురిసి భూగర్భజలాలు పెరిగి పంటలు బాగా పండేందుకు ఆస్కారం ఉంటుంది. -
ధాన్యం మరాడించడంపై దృష్టి
[ 13-06-2024]
కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మరాడించడంపై అధికారులు దృష్టి సారించారు. నాలుగు సీజన్లకు సంబంధించి ఆయా మిల్లులకు ధాన్యం కేటాయించగా, -
చదువులమ్మ నెలవుల్లో.. చిన్నారుల చిరునవ్వులు
[ 13-06-2024]
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా చిన్నారులతో సందడి నెలకొంది. సర్కారు బడులను మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలతో అలంకరించారు. -
5 నెలలు.. 175 మరణాలు
[ 13-06-2024]
రహదారులు అభివృద్ధికి చిహ్నాలంటారు. అవే దారులపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లడం, మద్యం తాగి నడపడం, ఇష్టారీతిన వాహనాలు నిలపడం, -
ఉద్యాన సాగుకు ఊతమేదీ?
[ 13-06-2024]
విత్తు నాటగానే వరుణుడి కటాక్షం కోసం ఆకాశం వైపు చూడాలి.. మొలకెత్తింది మొదలు పంటకు చీడపీడల నివారణ.. చేను కోతకొచ్చి ఉత్పత్తులను మార్కెట్కు తరలించేదాకా అన్నదాతలకు కష్టాలే. -
సర్కారు బడుల్లోనే నాణ్యమైన బోధన
[ 13-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లోనే డీఎస్సీ అర్హతతో ఉద్యోగాలు సాధించిన అత్యున్నతమైన ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేస్తారని జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. -
లీకేజీలతో శుద్ధ జలం కలుషితం
[ 13-06-2024]
మిషన్భగీరథ పథకం నీటి సరఫరాలో నెలకొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం నేపథ్యంలో నీటి లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. -
టోల్గేట్తో ఆదాయం.. ఏదీ సదుపాయం?
[ 13-06-2024]
రహదారులు అభివృద్ధికి సూచిక. వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా ప్రయాణించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన రహదారులను నాలుగు నుంచి ఆరు వరుసలుగా నిర్మించాయి. -
పర్యావరణహితమే సంకల్పం
[ 13-06-2024]
పర్యావరణ శ్రేయస్సు.. సమాజ హితాన్ని కాంక్షిస్తూ పలువురు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. స్వార్థం చూసుకోకుండా స్వచ్ఛతలో భాగస్వామ్యమవుతూ ఇతరులకు ప్రేరణ కల్పిస్తున్నారు. -
కృత్రిమ ఇసుకతో భూమాత నిస్సారం
[ 13-06-2024]
పంటల సాగు చేపట్టాలంటే మట్టి, ఇసుకరేణువులతో కూడిన సారవంతమైన భూమి అవసరం. కొందరు మట్టి నుంచి కృత్రిమంగా ఇసుక తయారుచేసి అక్రమ దందా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
-
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
-
రికార్డు సమయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
యడియూరప్పను అరెస్టు చేయవచ్చు: కర్ణాటక మంత్రి
-
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
-
రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడినట్లుంది.. నాపై ఒత్తిడేం లేదు: శివమ్ దూబె