నేడు ప్రధాని మోదీ భువనేశ్వర్ రాక
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు.
రేపు బ్రహ్మపుర, నవరంగపూర్లలో బహిరంగ సభలు
భువనేశ్వర్, న్యూస్టుడే: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. ఆదివారం ఉదయం బ్రహ్మపుర చేరువలోని గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొణిసి వద్ద ఏర్పాటయ్యే భాజపా విజయ సంకల్ప ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు నవరంగపూర్ చేరుకుని మరో బహిరంగ సభలో పాల్గొంటారని భాజపా రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర్ శనివారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు.
భాజపా శ్రేణుల్లో ఉత్సాహం
ఎన్నికల భేరీ మోగిన తర్వాత తొలిసారిగా మోదీ రాష్ట్రానికి వస్తున్నందున భాజపా శ్రేణుల్లో ఉత్సాహం కనిపిప్తోంది. ఆయన ఏం చెబుతారన్న దానిపై ప్రజల్లోనూ ఉత్కంఠ ఉంది. రాష్ట్రానికి ప్రధాని మోదీ చాలాసార్లు వచ్చారు. అలా వచ్చినపుడు ఆయన నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. గతసారి (2019) ఎన్నికల సమయంలోనూ ఆయన సంయమనం పాటించారు. ఈసారి ఈ పరిస్థితి ఉండకపోవచ్చునని, వైఫల్యాలు ఎండగట్టే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు. ఇటీవల దిల్లీలో ఒక టీవీ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఒడిశా ప్రతిష్ఠ మసకబారిందని, ప్రగతి ఫలాలు ప్రజల ముంగిళ్లకు చేరడం లేదని ఆయన విమర్శించారు. పాలన మారాలని, పనులు చేసే ప్రభుత్వం అధికారంలోకి రావాలని అంతా కోరుతున్నారన్నారు. ఇది భాజపా వల్లే సాధ్యమన్న ఆశాభావం ఓటర్లలో ఉందని మోదీ చెప్పారు.
12 సభల్లో పాల్గొననున్న మోదీ
ఒడిశాలో నాలుగు విడతల పోలింగ్ (ఈ నెల 13, 20, 25, జూన్ 1న) నిర్వహించనుండగా ఈ నెల 30 సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ప్రధాని మోదీ 12 బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని, నెలాఖరు వరకు రాష్ట్రానికి తరచూ వస్తారని భాజపా అధికార వర్గాలు శనివారం తెలిపారు. ఈ నెల 10 సాయంత్రం భువనేశ్వర్కు రెండోసారి రానున్న ప్రధాని రాజధానిలో రోడ్షో నిర్వహిస్తారు. 12న భవనేశ్వర్, బొలంగీర్లలో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. మరోవైపు ఆదివారం రాత్రి తొలి పర్యటన ఖరారు కాగా, భువనేశ్వర్లో భద్రత కట్టుదిట్టం చేశారు. రాజ్భవన్లో మోదీ రాత్రి విడిది చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
5 రోజుల్లో లక్ష మందిని కలిసిన ఒడిశా సీఎం
[ 18-06-2024]
ప్రజా సమస్యలు వినేందుకు ప్రజాప్రతినిధులు ఐదు నిమిషాలు కేటాయించడమంటే గగనంగా మారిపోతున్న రోజులివి. -
100 రోజుల్లో అందుతాయా..?
[ 18-06-2024]
నవీన్ సర్కార్ 25 ఏళ్లలో చేయలేక పోయిన పనులు భాజపా ప్రభుత్వం అయిదేళ్లలో పూర్తి చేయాలి. దాంతోపాటు ఎన్నికల ముందు.. -
ప్రాణాలు పోతున్నాయి..!
[ 18-06-2024]
రాయగడ జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. ఏటికేడు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. -
15 మంది బాధితుల గుర్తింపు
[ 18-06-2024]
జిల్లాలోని కాశీపూర్ సమితి డొంగశిల పంచాయతీ మునుస్పొదర్ గ్రామాన్ని పీడిస్తున్న అంతుచిక్కని వ్యాధిగ్రస్థుల సంఖ్య 15కి చేరుకుంది. -
19న బిజద సభాపక్షం భేటీ
[ 18-06-2024]
బిజద అధినేత నవీన్ పట్నాయక్ అధ్యక్షతన బుధవారం (19న) సాయంత్రం భువనేశ్వర్లోని శంఖభవన్ (బిజద కార్యాలయం)లో ఆ పార్టీ సభాపక్షం నేతల సమావేశం జరగనుంది. -
సెఫాలి కొండకు మహర్దశ
[ 18-06-2024]
మూడున్నర దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని సెఫాలి కొండపై ఉన్న రామేశ్వర ఆలయానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
పిడుగుపాటుకు ఆవులు మృతి
[ 18-06-2024]
పిడుగుపాటుకు 20 ఆవులు మృతి చెందిన ఘటన మల్కాన్గిరి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘సూపర్-8’లో మా వ్యూహం ఇదే: రవీంద్ర జడేజా
-
‘నాన్నా.. ఒక్కసారి రావా’: 9 నెలల క్రితమే అమరుడైన తండ్రి కోసం చిన్నారి వాయిస్ మెసేజ్లు
-
ఎన్నికల ప్రక్రియపై జగన్ పోస్టు.. తెదేపా స్ట్రాంగ్ కౌంటర్!
-
వాటిని నమ్మొద్దు.. జాన్వీ సోషల్ మీడియా ఖాతాలపై టీమ్ క్లారిటీ
-
విజయవాడలో పవన్ కల్యాణ్కు ఘన స్వాగతం
-
గ్యారీ కిరిస్టెన్ ‘మాంత్రికుడు’ కాదు.. వెంటనే అద్భుతాలు జరిగిపోవు: పాక్ మాజీ క్రికెటర్