బెండపూడి పిల్లల్లా..విజయనగరం అనేదెన్నడో?
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బెండపూడి అభ్యసన విధానం అమలు చేయాలని, ప్రతి ఉపాధ్యాయుడు చరవాణిలో ‘గూగుల్ రీడ్ లాంగ్ యాప్’ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో
చదవడం, రాయడంపై సర్వే నిర్వహిస్తున్న జిల్లా కమిటీ సభ్యులు (పాత చిత్రం)
హాయ్ సర్.. వియ్ ఆర్ ఫ్రమ్ బెండపూడి.. అంటూ ఆంగ్లంలో అదరగొట్టారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఇప్పుడు ఏ విద్యార్థి నోట విన్నా.. ఏ ఇద్దరు ఉపాధ్యాయులు కలిసినా వీరి గురించే. రాష్ట్రంలో ఇన్ని బడులు ఉండగా.. అక్కడే ఎందుకు అంత చక్కగా మాట్లాడుతున్నారు అన్నదే చర్చ.
మరి మన దగ్గరో..
ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు ఆంగ్లంలో వెనుకబాటు కనిపిస్తోంది. సగటున 40 శాతం మందికి చదవడం, రాయడం రాదని డైట్ చేసిన సర్వేలో తేటతెల్లమైంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన బెండపూడి విద్యార్థులతో పోల్చితే ఎంతో వ్యత్యాసం ఉంది. అక్కడున్న విద్యా విధానాలు జిల్లాకు పూర్తి భిన్నమనే చెప్పొచ్చు. - న్యూస్టుడే, విజయనగరం విద్యావిభాగం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బెండపూడి అభ్యసన విధానం అమలు చేయాలని, ప్రతి ఉపాధ్యాయుడు చరవాణిలో ‘గూగుల్ రీడ్ లాంగ్ యాప్’ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆంగ్లం అభివృద్ధి కాకపోవడానికి కారణాలు, నేర్చుకునేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘న్యూస్టుడే’ కథనం.
కాకినాడ జిల్లా బెండపూడిలో ఆంగ్లం కోసం ఆరేళ్ల కిందటే ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు. ప్రయోగశాలను ఏర్పాటు చేయడంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. మన దగ్గర ఎక్కడా ల్యాబ్లు లేవు. నిర్ణీత పీరియడ్లలోనే బోధిస్తున్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాల ఊసే లేదు. తరగతి గదుల్లో సాంకేతిక పరిజ్ఞానం కానరాదు. ప్రత్యేకంగా ఉపాధ్యాయుల నియామకం ఉండదు. ఫలితంగా విద్యార్థులు ఆంగ్లమంటేనే భయపడుతున్నారు.
మాట్లాడే ఉపాధ్యాయులేరీ
ఆంగ్ల ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉన్న వారు కూడా ఆంగ్లంలో మాట్లాడరు. కొందరిలో ప్రతిభ ఉన్నా బోధనకు అనాసక్తత చూపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతమున్న 4,478 ఎస్జీటీల్లో సుమారు 1500 మందే ఆంగ్లంలో మెథడాలజీ, ఎం.ఎ. ఆంగ్లం వంటి కోర్సులు పూర్తిచేశారు. పాఠశాల సహాయకుల్లో 471 మంజూరు పోస్టులకు 440 మంది పనిచేస్తున్నారు. ఇంకా 31 ఖాళీలున్నాయి.
మన తర‘గతి’ ఇంతే..
తరగతి గదిలో అంతర్జాలం, ల్యాప్ట్యాప్లు, మైక్రోఫోన్లు ఉండాలి. వీటి ద్వారా బెండపూడి తరహాలో విదేశీయులతో మాట్లాడించాలి. జిల్లా విషయానికొస్తే ఎక్కడా ఇవి లేవు. గతంలో కంప్యూటర్ విద్యను తీసుకొచ్చినా ఉపాధ్యాయుల తొలగింపుతో మూలకు చేరింది. డిజిటల్ తరగతులు 471, స్మార్ట్ తరగతులు 32, వర్చువల్ తరగతులు 166 పాఠశాలల్లో ఉన్నప్పటికీ మూలకు చేరాయి.
సర్వేలో ఇలా..
చదవడం, రాయడంపై జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) గత నెలలో జిల్లాలో నాలుగుచోట్ల సర్వే నిర్వహించింది. బాగా చదవడం రాయడం వచ్చిన వారు, కొంతవరకు చదవడం రాయగలిగినవారు, రెండూ రానివారు ఏ, బి, సి గ్రూపులుగా విభజించారు. సర్వేలో ఆయా పాఠశాలల్లో ఆంగ్లభాష ప్రగతి దారుణంగా ఉందని తేలింది.
నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలి
ఉపాధ్యాయులకు ఆంగ్లంలో మాట్లాడే విధానంపై తగిన శిక్షణ ఇవ్వలేదు. భాషా నైపుణ్యాలపై ఏడాదికి కనీసం పదిరోజుల పాటు శిక్షణ ఇవ్వాలి. ల్యాబ్లు ఏర్పాటు చేసి, విద్యార్థులతో ప్రయోగాలు చేయించాలి. ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కూడా నియమించాలి. - కుసుమన్న, ఆంగ్లం పాఠశాల సహాయకుడు
విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాలి
ఇంగ్లిషు నేర్చుకునేలా విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాలి. కృత్యాలు అందించాలి. నిజ జీవితంలో పరిచయమున్న పదాలు, వాక్యాలు మొదటగా నేర్పుతూ భాషపై పట్టు సాధించేలా తరగతి గదిలో వాతావరణం కల్పించాలి. వనరులు, పుస్తకాలు, చిన్న వాక్యాలు గల కార్డులు, పదాలు అందుబాటులో ఉంచాలి. చదవడం, రాయడం, గుర్తుపట్టడం, మౌఖిక కృత్యాలు తరచుగా నేర్పించాలి. చిత్రాలు, సన్నివేశాలు, పదకేళి, ఆటలు, కృత్యాలు ద్వారా నేర్చుకునేలా చూడాలి.
- ఎ.ప్రవీణ్కుమార్, ఆంగ్లం ఉపాధ్యాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జన సైనికుల చేయూత
[ 17-06-2024]
ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాలై విజయనగరం మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరఘట్టం మండలం హుస్సేనుపురం గ్రామానికి చెందిన అలజంగి నాణికి జన సైనికులు ఆర్థిక సాయం అందించారు. -
వ్యాన్ బోల్తా..17 మందికి గాయాలు
[ 17-06-2024]
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని గెడ్డగూడ సమీపంలో అదుపుతప్పి వ్యాన్బోల్తా పడింది. -
గిరిజనులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తాం
[ 17-06-2024]
ఫీడర్ అంబులెన్సుల ఏర్పాటు ద్వారా మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన వైద్య సేవలందేలా చూస్తామని గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. -
సమస్యలు గుర్తించారు.. గాలికి వదిలేశారు
[ 17-06-2024]
పట్టణ ప్రజల సమస్యలను గుర్తించాం.. వాటికి పరిష్కారం చూపుతామంటూ గత ప్రభుత్వం గొప్పగా పేర్కొంది. ఆచరణలో మాత్రం అశ్రద్ధ వహించింది. -
భవిష్యత్తుపై భయం!
[ 17-06-2024]
గ్రామ వాలంటీర్ల సేవలను అయిదేళ్ల పాటు యథేచ్ఛగా వైకాపా ప్రభుత్వం వినియోగించుకుంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లు తమ పార్టీ సైన్యం అని చెప్పుకొంది. -
పేదలకు మరింత భరోసా!
[ 17-06-2024]
పేదల బతుకుల్లో భరోసా నింపుతానని చంద్రబాబు ఎన్నికల ముందు మాటిచ్చారు. ఆర్థిక భారమని తెలిసినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి బాధ్యతలు స్వీకరించిన రోజే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల లబ్ధిని భారీగా పెంచారు. -
జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా
[ 17-06-2024]
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై సాధికారత, సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. -
స్పందన.. ఇక పీజీఆర్ఎస్!
[ 17-06-2024]
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ఇకపై ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’(పీజీఆర్ఎస్)గా ప్రభుత్వం మార్పు చేసింది. -
వ్యవసాయోదయం
[ 17-06-2024]
జిల్లా వ్యాప్తంగా వర్షాలు అనుకూలిస్తున్నాయి. గత ప్రభుత్వ నిర్ణయాలతో సాగు అంటేనే వెన్నులో వణుకు మొదలయ్యే అన్నదాతల్లో కొత్త ప్రభుత్వం భరోసాతో ఆశలు చిగురిస్తున్నాయి. -
మహిళల సాధికారతకు శ్రీకారం
[ 17-06-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారిస్తోంది. మహిళలకు హామీ ఇచ్చిన మేరకు వారిని లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. -
వైకాపా పాపం..వాహనదారులకు శాపం
[ 17-06-2024]
ఉమ్మడి జిల్లాలో కీలకమైన బొబ్బిలిలోని పారాది కాజ్వే మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన పనులతో ఈ పరిస్థితి ఏర్పడింది. -
గోమాతకు సీమంతం
[ 17-06-2024]
గోవులపై తమకున్న ప్రేమను చాటుకున్నారు గుర్లకు చెందిన బాడాన రాజశేఖర్, సుధ దంపతులు. ఆదివారం మండల కేంద్రంలోని ఉమా సహిత కోటేశ్వరస్వామి ఆలయంలోని గోశాలలో తమ గోవుకు సీమంతం చేశారు. -
ఆధార్ అనుసంధానమైతేనే ఉపకారం
[ 17-06-2024]
ఎన్ఎంఎంఎస్(జాతీయ ఉపకారవేతన పరీక్ష)కు ఎంపికైన విద్యార్థుల బ్యాంకు ఖాతాకు ఆధారు నంబరు అనుసంధానం అయితేనే ఉపకార వేతనం లభించనుంది. -
అరకొరగా సేవలు
[ 17-06-2024]
గత ప్రభుత్వ హయాంలో అగ్రి ల్యాబ్లంటూ ఆర్భాటం చేసినా.. ఇంతవరకు ఉభయ జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. -
నేలబావిలో ట్రాక్టరు బోల్తా: చోదకుడి దుర్మరణం
[ 17-06-2024]
నేలబావిలో ట్రాక్టర్ బోల్తాపడి ఓ ఇంటిపెద్ద దుర్మరణం చెందిన ఘటన లక్కవరపుకోట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై గోపాలరావు వివరాల ప్రకారం.. -
అయిదేళ్లూ నాన్చేశారు..
[ 17-06-2024]
పాలకొండలోని జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో గత అయిదేళ్లుగా భక్తులు అసౌకర్యాలకు గురవుతున్నారు. ఏటా పది రోజులపాటు జరిగే ఈ యాత్రలో సదుపాయాల కల్పన అంతంతమాత్రంగానే ఉంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈ నెల 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
-
రైల్వే ట్రాక్పై 10 సింహాలు.. లోకోపైలట్ ఏం చేశారంటే!
-
కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి పంకజ ముండే
-
‘పుష్ప 2’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?