వైకాపా నుంచి తెదేపాలో చేరికలు
వైకాపా నుంచి తెదేపాలోకి చేరికల జోరు కొనసాగుతోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన 150 వైకాపా కుటుంబాల వారు తెదేపాలో చేరారు.
కోటబొమ్మాళి: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో చేరిన కురుడు వైకాపా కార్యకర్తలు తదితరులు
కోటబొమ్మాళి, పోలాకి, న్యూస్టుడే: వైకాపా నుంచి తెదేపాలోకి చేరికల జోరు కొనసాగుతోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన 150 వైకాపా కుటుంబాల వారు తెదేపాలో చేరారు. కోటబొమ్మాళి మండలం కురుడుకు చెందిన నాయకులతో పాటు ఏభై కుటుంబాలు , సంతబొమ్మాళి మండలం కోటపాడు నాయకులు, యువకులు, సంతబొమ్మాళికి చెందిన ఏభై మత్స్యకార కుటుంబాలు, ఇజ్జవరం పంచాయతీ నాయకులతో పాటు మరో ఇరవై కుటుంబాలు తెదేపాలో చేరాయి. నందిగాం మండలం హర్షబాడ పంచాయతీ సవరరామకృష్ణాపురానికి చెందిన నాయకులు, యువకులు కూడా చేరారు. బీ పోలాకి మండల పరిధిలోని మబుగాం గ్రామంలో తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తి స్వగృహంలో పోలాకి పంచాయతీ నరసాపురం వార్డు సభ్యులు సనపల నారాయణరావు, సీనియర్ వైకాపా కార్యకర్త మెట్ట తిరుమలరావుల ఆధ్వర్యంలో పలువురు సభ్యులు తెదేపాలో చేరారు. వీరికి బగ్గు రమణమూర్తి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలతో ఉంటాం.. ప్రగతి చూపిస్తాం..!
[ 16-06-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో కుదేలైన జిల్లాను ప్రగతిపథంలోకి తీసుకెళ్లడానికి కూటమి ఎమ్మెల్యేలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించడానికి అధికారులను సంప్రదిస్తున్నారు. -
ముగిసిన వేట విరామం..!
[ 16-06-2024]
చేపల వేటకు గంగపుత్రులు సమాయత్తమయ్యారు. జలపుష్పాలు గుడ్లు పెట్టే సమయం కావడంతో ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి రెండు నెలల పాటు సముద్రంపై వేటకు వెళ్లకుండా ప్రభుత్వం విరామం ప్రకటించింది. -
నోరు జారితే ఊరుకునేది లేదు
[ 16-06-2024]
అయిదేళ్ల పాటు మాజీ మంత్రి అప్పలరాజు సామాజిక మాధ్యమాల వేదికగా తనపై బురద జల్లారని, ఇక నోరు జారితే ఊరుకునేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. -
బాలికపై లైంగిక వేధింపులు!
[ 16-06-2024]
శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ బాలిక ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్లో ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసినట్లు ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
బడి బస్సులు భద్రమేనా!
[ 16-06-2024]
వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ తెరుచుకున్నాయి. బడి బస్సులు భద్రతపై అధికారులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం దృష్టి సారించాల్సిన సమయమిది. -
నాగావళి వెలవెల
[ 16-06-2024]
జిల్లా కేంద్రంలో నాగావళి నది నీరు లేక వెలవెలబోతోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవకపోవడం.. మడ్డువలస జలాశయం, నారాయణపురం ఆనకట్ట నుంచి నీరు విడుదల చేయకపోవడంతో నీటి మట్టం తగ్గి ఎడారిని తలపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.31 కోట్లు.. బాధితులకు అందజేసిన అధికారులు
-
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్
-
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!